India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MHలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబు సమాధిని రక్షించాలని కోరుతూ మెుఘల్ వారసుడు యాకుబ్ హబీబుద్దీన్ UNOకు లేఖ రాశారు. అసత్య ప్రచారాల వల్ల సమాధిని కూల్చివేయాలంటూ నిరసన ప్రదర్శనలు జరిగాయని లేఖలో తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చారిత్రక కట్టడాలను కాపాడేలా ప్రత్యేక భద్రతను కల్పించాలని కోరారు. కాగా గత నెలలో ఔరంగజేబు సమాధి కేంద్రంగా మత ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.
AP: YS జగన్ హెలికాప్టర్ పైలట్ అనిల్, కో పైలట్ శ్రయాజ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. శ్రీసత్యసాయి(D) సి.కె.పల్లి పీఎస్లో వారి విచారణ జరుగుతోంది. ఈనెల 8న జగన్ చిప్సన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్లో పాపిరెడ్డిపల్లికి వచ్చారు. YCP కార్యకర్తలు భారీగా చుట్టుముట్టడంతో హెలికాప్టర్ దెబ్బతింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పకుండా పైలట్, కో పైలట్ వెళ్లిపోయారు. దీన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
AP: కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే జి.లోక్నాథ్ (75) గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి తుదిశ్వాస విడిచారు. 1989లో ఆలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రంగన్న (టీడీపీ)పై గెలిచారు. లోక్నాథ్ స్వగ్రామం ఆలూరు మండలంలోని మొలగవల్లి. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
TG: SSC ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి, మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే మెమోల ముద్రణపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నెలాఖరున రావాల్సిన ఫలితాలు మరింత ఆలస్యమవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు. మెమోలపై పాస్/ఫెయిల్తో పాటు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ అని మెన్షన్ చేయాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే రిజల్ట్స్ వెల్లడిస్తారని తెలుస్తోంది.
1990 నుంచి 2024 వరకు సంభవించిన భూకంపాల్లో అత్యధికంగా చైనాలో నమోదైనట్లు NOAA తెలిపింది. అక్కడ 186 సార్లు భూమి కంపించింది. దీని తర్వాత జపాన్లో 98, అమెరికాలో 78, ఇండియాలో 58సార్లు భారీ భూకంపాలు వచ్చినట్లు పేర్కొంది. ఇంకా ఎక్కువ సార్లే భూమి కంపించినా ఇవి $1మిలియన్ ఆస్తి నష్టం, 10+ మరణాలు సంభవించిన వాటి వివరాలు మాత్రమే. కాగా, 1923లో సంభవించిన జపాన్ భూకంపంలో అత్యధికంగా 1,42,807 మంది చనిపోయారు.
టీమ్ ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య సాగరిక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారికి ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. జహీర్, సాగరిక 2017లో పెళ్లి చేసుకున్నారు.
AP: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఉ.10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను ఏప్రిల్ 23 మ.3 గంటలకు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు ఏప్రిల్ 23న ఉ.10 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి.
వైద్య రంగంలో AI ఆవశ్యకతను తెలిపే ఓ వార్త వైరల్ అవుతోంది. కొవిడ్ సమయంలో USకు చెందిన తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని 17 మంది వైద్యులకు చూపించింది. ఎవ్వరూ ఆ పిల్లాడి సమస్యకు కారణాన్ని చెప్పలేకపోయారు. విసిగిపోయిన తల్లి ChatGPTకి MRI రిపోర్ట్స్, పిల్లాడి లక్షణాలను వివరించింది. అది ‘టెథర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్’గా నిర్ధారించింది. ఈ సమాచారంతో వైద్యులు పరీక్షలు చేసి, శస్త్రచికిత్స చేశారు.
TG: హైదరాబాద్లోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సాయి సూర్య తేజ డెవలపర్స్ కంపెనీపై ఈడీ దాడులు చేసింది. సురానా కంపెనీ ఛైర్మన్, డైరెక్టర్ ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బోయిన్పల్లిలో ఈ దాడులు చేపట్టింది. కాగా వీరిపై మనీలాండరింగ్తోపాటు విదేశాలకు హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. దీనిపై గతంలోనే కేసు నమోదైంది.
రెండు రోజుల గ్యాప్ తర్వాత బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.88,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగి రూ.96,170 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ. 200 పెరిగి రూ.1,10,000గా ఉంది.
Sorry, no posts matched your criteria.