India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
USలో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్ (స్వీయ బహిష్కరణ) చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. US నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.
ఇల్లు క్లీన్ చేస్తుంటే దొరికిన ఓ పాత బ్యాంక్ పాస్ బుక్ ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. చిలీకి చెందిన ఎక్సెక్వియల్ హినోజోసాకి ఇంట్లో 60 ఏళ్ల క్రితంనాటి తన తండ్రి బ్యాంక్ పాస్బుక్ లభించగా అందులో రూ.1.4 లక్షలు జమ చేసినట్లు ఉంది. అందులో బ్యాంకు దివాలా తీస్తే ఆ డబ్బు ప్రభుత్వం ఇస్తుందని తెలిసి అధికారులను కలవగా వారు నిరాకరించారు. న్యాయపోరాటంలో వడ్డీతో రూ.10.27 కోట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
BJPకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందని APCC చీఫ్ షర్మిల అన్నారు. ‘దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను BJP జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తోంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేయడాన్ని, సోనియా, రాహుల్ గాంధీపై ED ఛార్జ్షీట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. “మనీ”నే లేని కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆరోపించడం అత్యంత దారుణం’ అని ట్వీట్ చేశారు.
తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి నేడు. స్త్రీ విద్య, వితంతు వివాహాలు, బాల్య వివాహ నిర్మూలన కోసం అవిశ్రాంత కృషి చేశారు. తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్రము’, స్వీయచరిత్ర, ప్రహసనాలు రచించారు. వివేకవర్ధని, హాస్య సంజీవిని పత్రికలు స్థాపించి సామాజిక చైతన్యం కల్పించారు. బ్రహ్మ సమాజం, హితకారిణి సంస్థలతో సమాజ సేవకు ఆస్తులనే అర్పించారు.
రామ్చరణ్తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్తో సందీప్ ఓ మూవీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాను బన్నీ రిజెక్ట్ చేశారని, ఆ మూవీనే చరణ్తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక రౌండ్ చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. చెర్రీ నటిస్తున్న ‘పెద్ది’, సందీప్ డైరెక్ట్ చేయాల్సిన ‘యానిమల్ పార్క్’ చిత్రాలు పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్పైకి వెళ్తుందని టాక్.
ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్పై సిబ్బంది అత్యాచారం చేశారు. 46ఏళ్ల ఓ ఎయిర్ హోస్టెస్ గురుగ్రామ్లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్లో జారిపడ్డారు. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ICUలో చికిత్స పొందుతున్న ఆమెపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై డిశ్చార్జి అయ్యాక ఆమె PSలో ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
TG: నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో BJP ప్రభుత్వం, ED కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. AICC అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ రేపు HYD ఈడీ ఆఫీసు వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ DCCల ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలన్నారు.
ట్రోలర్స్పై సీనియర్ నటి ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నగా మారిన తన న్యూ లుక్ను SMలో షేర్ చేయగా కొందరు ట్రోల్ చేశారు. ఇంజెక్షన్స్ చేసుకోవడం వల్లే ఈ మ్యాజిక్ జరిగిందంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘మీరు అసలు ఎలాంటి మనుషులు? మీ ముఖాన్ని మీరు చూపించరు. ఎందుకంటే మీ వ్యక్తిత్వం ఎంత అసహ్యంగా ఉంటుందో మీకు తెలుసు. మీ పేరెంట్స్పై జాలేస్తోంది’ అంటూ ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
కోనోకార్పస్ చెట్లపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని రక్షించాలంటూ ప్రముఖ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. అపోహలు నమ్మి చెట్లను నరకొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ చెట్లు అత్యధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయని YVU మాజీ VC ప్రొ.ఏఆర్ రెడ్డి తెలిపారు. తక్కువ నీరు, నిర్వహణ లేకుండానే ఈ మొక్కలు బతుకుతాయని, హైవేలపై విరివిగా నాటాలని సూచించారు. ఈ చెట్లు భూగర్భ జలాలను అత్యధికంగా తీసుకుంటాయనేది అవాస్తవమని చెప్పారు.
కేకేఆర్తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. ఈ క్రమంలో చాహల్ రూమర్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా వైరల్గా మారింది. ‘వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్.. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడు అనేందుకు ఇదే కారణం. అసామాన్యుడు’ అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్లు పెడుతున్నారు.
Sorry, no posts matched your criteria.