India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం <<18961013>>ధర<<>> ఉదయంతో పోల్చితే కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,62,710 ఉండగా రూ.760 తగ్గి రూ.1,61,950కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం నుంచి రూ.700 పతనమై రూ.1,48,450 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.3,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ నిన్నటి వరకు రూ.350 కోట్ల(గ్రాస్)కు పైగా వసూలు చేసింది. నిన్న జరిగిన ఈవెంట్లో మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేశారు. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేశ్ స్పెషల్ రోల్ చేశారు.

గాయంతో NZతో జరిగిన తొలి 3 T20లకు దూరమైన తిలక్ చివరి 2 మ్యాచులూ ఆడట్లేదని BCCI తెలిపింది. అతని స్థానంలో శ్రేయస్ జట్టులో కంటిన్యూ అవుతారని వివరించింది. అయితే వచ్చే నెల ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నాటికి తిలక్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నం.3లో ఇషాన్ ఆడుతుండగా, తిలక్ జట్టులో జాయిన్ అయితే ఆ స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది.

నేషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(నేషనల్ అథారిటీ కాంపా) 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో పీజీ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://moef.gov.in/

వరంగల్(D) మట్టెవాడలోని భోగేశ్వర ఆలయం చాలా విశిష్టమైనది. ఇక్కడి శివలింగం కింద 11 లింగాలు ఉండటం విశేషం. అందుకే ఒక్కసారి అభిషేకం చేస్తే ఏకాదశ రుద్రాభిషేక ఫలం దక్కుతుందని నమ్మకం. ఈ లింగానికి ఎన్ని నీళ్లతో అభిషేకం చేసినా, ఆ నీరు ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా అంతర్ధానం కావడం మరో విశేషం. ప్రతిరోజు రాత్రి ఒక పాము(భోగి) వచ్చి స్వామిని సేవిస్తుందని, అందుకే దీనికి భోగేశ్వర ఆలయమని పేరు వచ్చిందని ప్రతీతి.

ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించేందుకు ఆలయ కమిటీ (BKTC) సిద్ధమైంది. చార్ధామ్ యాత్రలో భాగమైన ఈ టెంపుల్స్తో పాటు, కమిటీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని BKTC అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు. త్వరలో జరిగే బోర్డు మీటింగ్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశముంది. ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయం తెరుచుకోనుంది.

శరీర రోగనిరోధకవ్యవస్థ ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేయడాన్నే కవాసకి వ్యాధి అంటారు. దీనివల్ల కొరోనరీ ధమనులు, గుండె కండరాలపై ప్రభావం పడుతుంది. చిన్నారుల్లో ఈ వ్యాధి ఉంటే 5 రోజులకు పైగా జ్వరం, దద్దుర్లు, కళ్ళు ఎర్రబడడం, పెదవులు పగలడం, నాలుక ఎర్రగా మారడం, చేతులు, కాళ్లలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 5 సంవత్సరాల్లోపు పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

TG: దేశవ్యాప్తంగా జనగణన 6 నెలల్లోనే పూర్తవుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ మహిళల రిజర్వేషన్తోపాటు ఇతర ప్రక్రియ అంతా ఎన్నికలలోపే పూర్తవుతాయన్నారు. తెలంగాణలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

T20 వరల్డ్ కప్కు ముందు భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో రియాన్ పరాగ్ను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరాగ్ను ఫిబ్రవరి 2న ముంబైలో రిపోర్ట్ చేయమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్లో రవి బిష్ణోయి ఉన్నప్పటికీ WCలో ఆల్రౌండర్ కోసం సెలక్టర్లు చూస్తున్నారు.

గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండాను ఎగురవేసే విధానంలో ఉండే తేడాలు చాలామందికి తెలిసుండదు. ఆగస్టు 15న ప్రధానమంత్రి కింద ఉన్న జెండాను పైకి లాగి ఎగురవేస్తారు. దీనిని హోయిస్టింగ్ అంటారు. ఇది వలస పాలన నుంచి విముక్తిని సూచిస్తుంది. అదే జనవరి 26న పైన కట్టిన జెండాను విప్పుతారు. దీనిని ‘అన్ ఫర్లింగ్’ అంటారు. ఇది రాజ్యాంగం అమలులోకి రావడాన్ని సూచిస్తుంది. రాష్ట్రపతి దీనిని నిర్వహిస్తారు. SHARE IT
Sorry, no posts matched your criteria.