India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రబీలో సాగు చేసే కట్టె జనుమును కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు పూత దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ శిలీంద్రాల వల్ల విత్తనం రంగుమారడం, కుళ్లిపోవడం జరిగితే కాయ ఏర్పడే దశలో లీటరు నీటికి కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీ చేయాలి.

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ ప్రజలు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధం చరిత్రాత్మకమైనదని గుర్తుచేశారు. ఆయన మెసేజ్ను ఢిల్లీలోని US ఎంబసీ షేర్ చేసింది. టారిఫ్లు, ట్రేడ్ డీల్ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నప్పటికీ.. ట్రంప్ నుంచి ఈ తరహా సందేశం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో TGT 493, PRT 494 పోస్టులున్నాయి. 2026-27 విద్యాసంవత్సరానికి వీటిని భర్తీ చేయనున్నట్లు KVS వెల్లడించింది. జాబును బట్టి డిగ్రీ, డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), CTET ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.
వెబ్సైట్: https://kvsangathan.nic.in/

అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ <<18959429>>ఉదయం<<>> ఔన్స్కు $100 వద్ద ఉన్న ధర ప్రస్తుతం $110కి చేరింది. కేవలం నెల రోజుల్లోనే 54% పెరుగుదల నమోదు కాగా జనవరి 2025తో పోలిస్తే ఏకంగా 280% పెరిగిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.

AP: రాజధాని అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్లో తొలిసారి నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసుల కవాతు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్వర్ణ పంచాయతీ- స్వచ్ఛ పంచాయతీ, స్వచ్ఛాంధ్ర, పర్యాటక, ఉద్యానవన శాఖ, అమరావతి, ఐటీ శకటాలు అబ్బురపరిచాయి.

స్టార్ హీరో గోవిందాపై భార్య సునీతా అహుజా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన అఫైర్స్ రూమర్స్ను పరోక్షంగా కన్ఫర్మ్ చేసిన ఆమె 63 ఏళ్ల వయసులో ఇలాంటివి తగదని సూచించారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారని.. వాళ్లు డిస్టర్బ్ అవుతారన్నారు. ‘హీరోయిన్ అవ్వలేని కొంతమంది అమ్మాయిలు స్టార్లను ట్రాప్ చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. మరి మీ బుద్ధి ఏమైంది’ అంటూ గోవిందా పేరు ఎత్తకుండా ఆయన్ని ప్రశ్నించారు.

అగ్రరాజ్యం అమెరికా 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ను ఇటీవల <<18861240>>నిలిపివేసిన <<>>విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో 2027లో గ్రీన్కార్డు కోటా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ 175 దేశాలకు ఏడాదికి సుమారు 67 వేల ఇమిగ్రెంట్ వీసాలు జారీ అవుతాయి. అయితే ప్రాసెసింగ్ నిలిచిపోవడంతో వినియోగం కాని కోటా మిగిలే పరిస్థితి ఏర్పడింది. దీంతో వచ్చే ఏడాదికి అదనంగా దాదాపు 50 వేల గ్రీన్కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా(THDC)100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, BE, B.Tech, BBA అర్హతగల అభ్యర్థులు జనవరి 31వరకు NATS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తును, డాక్యుమెంట్స్ను పోస్ట్ చేయాలి. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://thdc.co.in

పసి పిల్లలకు 7-9 నెలల వయసు నుంచి పాలదంతాలు వస్తాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పళ్లు రావడం మొదలయ్యాక మృదువైన బ్రష్తో వాటిని శుభ్రం చెయ్యాలి. దురద, నొప్పి రాకుండా శుభ్రమైన క్లాత్ని కొంతసేపు ఫ్రిజ్లో ఉంచి పిల్లలకు నోట్లో పెట్టుకోవడానికి ఇవ్వాలి. కొంతమందిలో ఈ దంతాలు వచ్చే సమయంలో జ్వరం, మోషన్స్ అవుతాయి. ఇవి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.

AP: సీఎం CBN అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 28న క్యాబినెట్ భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆయన 29న అరకులో పర్యటించనున్నట్లు చెప్పాయి. 30, 31వ తేదీల్లో కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించాయి. అలాగే రేపు 4pmకు TDP కేంద్ర కార్యాలయానికి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అవుతారని తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.