India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు.
☛ తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 12 గంటల సమయం
☛ నేడు యూరప్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు
☛ TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి శ్రవణ్ రావు విచారణ
☛ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ రేపు ఈడీ ఆఫీసు వద్ద ధర్నా: టీపీసీసీ చీఫ్
☛ అఫ్గానిస్థాన్లో 6.9 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
KKRతో మ్యాచ్లో తన గుండె వేగం పెరిగిందని పంజాబ్ కోచ్ పాంటింగ్ తెలిపారు. 50 ఏళ్ల వయసులో తనకు ఇలాంటి మ్యాచులు చూడాల్సిన అవసరం లేదని సరదాగా అన్నారు. చాహల్ అద్భుత ప్రదర్శనను ప్రశంసించారు. బ్యాటింగ్ దారుణంగా ఉన్నా.. వికెట్లు త్వరగా పడగొట్టి అద్భుతం చేశారన్నారు. ఎన్నో మ్యాచులకు కోచ్గా చేసినా ఈ విజయం మాత్రం తనకు బెస్ట్ అని పేర్కొన్నారు. మ్యాచ్పై నమ్మకంగా ఎలా ఉండాలనేదానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు.
గతేడాది ఏఐ నిపుణుల నియామకంలో భారత్ టాప్లో నిలిచినట్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్ 2025‘ వెల్లడించింది. ఏఐ నియామకాల్లో ఇండియా 33 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. భారత్ తర్వాత బ్రెజిల్ (30.83), సౌదీ అరేబియా (28.71), అమెరికా (24.73) ఉన్నట్లు పేర్కొంది. కాగా ఏఐ టాలెంట్ను నిలుపుకోవడంలో భారత్ ఇబ్బందులు పడుతోందని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపింది.
AP: రాష్ట్రంలో ఒక్కో ఖైదీపై ఏడాదికి రూ.2.67 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ‘ఇండియన్ జస్టిస్ రిపోర్ట్-2025‘ తెలిపింది. వివిధ జైళ్లలో ఉన్న 7,200 మంది ఖైదీల్లో ఒక్కొక్కరికి రోజుకు రూ.733 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది దేశంలోనే అత్యధిక ఖర్చని తెలిపింది. TGలో ఒక్కో ఖైదీపై ఏటా రూ.33,277 మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. 6,500 మందిపై ఒక్కొక్కరికి రోజుకు రూ.91 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.
AP: సమాజంలో అశాంతి రేపి అల్లర్లు సృష్టించాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం మాట్లాడారు. వక్ఫ్ చట్టంపై వైసీపీ మూడు రకాలుగా వ్యవహరించిందని.. లోక్సభలో వ్యతిరేకిస్తూ, రాజ్యసభలో అనుకూలంగా ఓటేసిందని విమర్శించారు. మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైరయ్యారు.
‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ సినిమా <<16027655>>రీరిలీజ్<<>> అవుతుండటంపై మాస్ మహారాజా రవితేజ ఇన్స్టాలో స్పెషల్ స్టోరీని పోస్ట్ చేశారు. ‘నేను చేసిన సినిమాల్లో నా ఆటోగ్రాఫ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది నా మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈనెల 18న ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో విడులవుతోంది. బిగ్ స్క్రీన్పై ఆ మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటారని ఆశిస్తున్నా’ అని ఆయన ఇన్స్టాలో రాసుకొచ్చారు.
TG: CM రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఈనెల 22 వరకు తన బృందంతో కలిసి టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటిస్తారు. ఈనెల 21న ఒసాకా వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారు. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. 23న తిరిగి HYD చేరుకుంటారు.
TG: LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటితో గడువు ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నెలాఖరు వరకూ పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటి వరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.
వక్ఫ్ సవరణ చట్టంపై నేటి నుంచి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరగనుంది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ మొత్తం 73 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ, వైసీపీ, ఎస్పీ, టీవీకే, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, ఎంఐఎం పార్టీలతో పాటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఇతరులు ఈ పిటిషన్లు వేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం మ.2 గంటల నుంచి వాదనలు విననుంది.
Sorry, no posts matched your criteria.