news

News April 16, 2025

భారీగా తగ్గిన ధర.. కేజీ రూ.6!

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. మొన్నటి వరకు రూ.1800-రూ.2300 పలికిన క్వింటాల్ ఉల్లి.. ఇప్పుడు రూ.1300కు పడిపోయింది. కనిష్ఠంగా క్వింటాల్ ధర రూ.600 పలుకుతోంది. అంటే కేజీ రూ.6 మాత్రమే. పెట్టుబడి రావడం కూడా కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. అటు మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.25-30గా ఉంది.

News April 16, 2025

పవన్ భార్యపై ట్రోల్స్.. విజయశాంతి ఫైర్!

image

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన AP DyCM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్ చేయడం సరికాదని TG MLC విజయశాంతి మండిపడ్డారు. ‘విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన అన్నా లెజినోవాపై కామెంట్స్, ట్రోలింగ్ చేయడం అత్యంత అసమంజసం. తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడినందుకు కృతజ్ఞతగా శ్రీవారికి తలనీలాలిచ్చారు. ఇలా ట్రోల్ చేయడం తప్పు’ అని ట్వీట్ చేశారు.

News April 16, 2025

నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, నిన్న రాత్రి 8 గంటల వరకు మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5 మి.మీ. వర్షం పడగా, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది.

News April 16, 2025

పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే చిరు ఉద్యోగులకు మే నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి నెలనెలా జీతాలు అందనున్నాయి. ఈ మేరకు పంచాయతీ‌రాజ్ శాఖ ఫైల్‌కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ప్రతినెలా వీరి జీతాల కోసం రూ.115కోట్లు కేటాయించనున్నారు. ఇకపై వారికి నెలనెలా వేతనాలు అందేలా ప్రత్యేక పోర్టర్ రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 92వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.

News April 16, 2025

TGలో రానున్న రెండ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?

image

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2రోజుల పాటు పగటిపూట ఎండ, సాయంత్రం వర్షాలు పడే అవకాశాలున్నాయని IMD తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిలాల్లో వర్షాలు పడతాయంది. 40KM వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

News April 16, 2025

నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

image

AP: CM చంద్రబాబు ఇవాళ యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 20న చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను అక్కడే జరుపుకోనున్నారు. చంద్రబాబు ఇవాళ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి ఆయన విదేశాలకు చేరుకుంటారు. తిరిగి ఈ నెల 22న ఢిల్లీకి చేరుకుని పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. CM వ్యక్తిగత పర్యటన కావడంతో ఏ దేశానికి వెళ్తున్నారనేదానిపై వివరాలు గోప్యంగా ఉంచారు.

News April 16, 2025

నేడు సుప్రీంలో కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ

image

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. దేశ వ్యాప్తంగా ఈ భూముల అంశం చర్చనీయాంశంగా మారడంతో సుప్రీం ఈ కేసును సుమోటో స్వీకరించి భూమి చదును చేసే పనులపై స్టే విధించిన విషయం తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు.. సీఎస్ శాంతికుమారి ఈ కేసుపై అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూములు ప్రభుత్వానివే అని, 20 ఏళ్లుగా న్యాయవివాదంలో ఉండటం వల్ల ఆ స్థలంలో చెట్లు పెరిగాయని పేర్కొన్నారు.

News April 16, 2025

IPL: నేడు ఢిల్లీ, రాజస్థాన్ ఢీ

image

IPLలో ఇవాళ DC, RR తలపడనున్నాయి. ఈ రెండింటి మధ్య లీగ్‌లో 29 మ్యాచులు జరగ్గా, 15(RR)-14(DC) విజయాలు దక్కించుకున్నాయి. రాజస్థాన్‌కు పరాగ్ ఫామ్ కలవరపెడుతుండగా కెప్టెన్ శాంసన్‌పైనే భారం పడుతోంది. మరోవైపు ఢిల్లీ ఓపెనర్ మెక్‌గుర్క్ పేలవ ప్రదర్శన వారిని ఇబ్బంది పెడుతుండగా, కరుణ్ నాయర్ మొన్నటి నాక్‌తో బ్యాటింగ్ లైనప్‌ను పటిష్ఠం చేశారు. ఢిల్లీ పిచ్ కాబట్టి ఇవాళ హైస్కోరింగ్ గేమ్ చూసే అవకాశం ఉంది.

News April 16, 2025

భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది అవకాశం

image

TG: రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ‘భూభారతి’ భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది వరకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కలెక్టర్లు, ఆర్డీవోలకు సవరణ అధికారులు ఇవ్వనుంది.
ఫీజుల వివరాలు..
మ్యుటేషన్/సక్సెషన్: ఎకరానికి రూ.2,500
పట్టాదార్ పాస్ బుక్: రూ.300, సర్టిఫైడ్ కాపీ: రూ.10
రికార్డ్ సవరణ/ అప్పీళ్లు: రూ.1,000
స్లాట్ రీషెడ్యూల్: తొలిసారి ఫ్రీ, రెండోసారి రూ.500

News April 16, 2025

బాలీవుడ్‌లోకి ధోనీ ఎంట్రీ?

image

బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ చేసిన ఓ పోస్టుతో క్రికెటర్ <>ధోనీ<<>> బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహీ ఓ రొమాంటిక్ రోల్‌లో కనిపించబోతున్నారని అందులో ఆయన రాసుకొచ్చారు. ఆ వీడియోలో ధోనీ లవ్ సింబల్ బెలూన్ పట్టుకొని కనిపించారు. దీంతో ఈ స్టార్ క్రికెటర్‌ను కరణ్ బాలీవుడ్‌లో లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ఓ యాడ్ షూటింగ్ అని కొందరు చెబుతున్నారు.