India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కలుషిత నీటిని ఉపయోగించడమే తురకపాలెంలో <<17599008>>మరణాలకు<<>> కారణమని తమ పరిశీలనలో తేలిందని YCP నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ నీటిని వాడటంతో అవయవాలు దెబ్బతిని చనిపోతున్నారని ఆరోపించారు. గుంటూరు తురకపాలెంలో పర్యటించిన నేతలు మరణాలకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు.
TG: ఇకపై లబ్ధిదారులే తమ ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలు యాప్లో అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. దాన్ని బట్టి బిల్లులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈమేరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల యాప్పై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఫొటోలు తీయడం ఆలస్యం కావడంతో బిల్లులు రాక ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించామన్నారు.
TG: SLBC పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కాంట్రాక్టర్ ఒక్కరోజు పనులు ఆలస్యం చేసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. టన్నెల్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం-అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలు వాడుకోవాలని, నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలన్నారు.
భారత ప్రధాని మోదీతో ట్రంప్కు ఉన్న అనుబంధం తెగిపోయిందని యూఎస్ మాజీ NSA బోల్టన్ అన్నారు. ఇది ప్రతి ఒక్కరికీ గుణపాఠమని చెప్పారు. వ్యక్తిగత సంబంధాలు కొన్నిసార్లు సహాయపడినా, చెత్త నిర్ణయాల నుంచి మాత్రం రక్షించలేవన్నారు. ప్రస్తుతం అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతినడం రష్యా, చైనాతో మోదీ సన్నిహితంగా మారేలా చేశాయని అభిప్రాయపడ్డారు. US విషయంలో భారత్కు చైనా ప్రత్యామ్నాయంగా మారిందన్నారు.
క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరించారు.
* 2025 ఆగస్టు 31 వరకు ఉన్న అనధికార కట్టడాల క్రమబద్ధీకరణకు నిర్ణయం
* చిత్తూరు జిల్లాలో 2 పరిశ్రమల ఏర్పాటుకు సమ్మతం
* మడకశిరలో HFCL కంపెనీ ఏర్పాటుకు ఆమోదం
* విశాఖ, అమరావతి, మంత్రాలయంలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు పచ్చజెండా
* పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం
కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న హైదరాబాద్లో జరిగే గణేశ్ శోభాయాత్రలో ఆయన పాల్గొనాల్సి ఉండగా, పర్యటన రద్దైంది.
దేశ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారుతాయని PM మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. ‘వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలి. దేశీయ ఉత్పత్తులు వాడుతున్నామని అందరూ గర్వపడాలి. గాంధీజీ నినాదం కూడా స్వదేశీ.. దాన్ని అందరం పాటించాలి. స్వదేశీ డే, స్వదేశీ వీక్ను పండుగగా నిర్వహించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
ప్రపంచ ప్రఖ్యాత, ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియోగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్తో పేరొందారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.
TG: బీఆర్ఎస్ను కవిత వీడటంతో దాని అనుబంధ సంస్థగా ఉన్న జాగృతిలో చీలికలు బయటపడుతున్నాయి. కవిత తమను నడిరోడ్డుపై పడేసిందని జాగృతి నేత రాజీవ్ సాగర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి తమదేనని, కేసీఆర్ చెప్పిందే చేస్తామని చెప్పారు. తెలంగాణ జాగృతి బోర్డు పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. దీనిపై జాగృతి ఫౌండర్ కవిత స్పందించాల్సి ఉంది.
అమెరికాను ‘సాల్ట్ టైఫూన్’ అనే పేరు భయపెడుతోంది. చైనాకు చెందిన ఈ సైబర్ ముఠా అమెరికాలోని ప్రతి పౌరుడి డేటాను హ్యాక్ చేసిందని సెక్యూరిటీ నిపుణులు భయపడుతున్నారు. ఈ ముఠా 2019 నుంచి 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నారు. ఈ భారీ ఎటాక్ చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తోందని NYT కథనం పేర్కొంది. చైనా ప్రభుత్వమే వీరికి నిధులు ఇస్తుందని ఆరోపించింది.
Sorry, no posts matched your criteria.