India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPL-2025: KKRతో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్లో <<16112256>>PBKS<<>> అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాను 95 పరుగులకే కట్టడి చేసింది. IPLలో ఇంత తక్కువ స్కోరు(111)ను కాపాడుకోవడం ఇదే తొలిసారి. కాగా, ఇదే పంజాబ్ 2024 సీజన్లో KKRపై 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆ మ్యాచ్లో బెయిర్స్టో సెంచరీతో చెలరేగారు. ఆ గేమ్ మీకు గుర్తుంటే COMMENT చేయండి.
పోలీసు విభాగం పనితీరుకు సంబంధించి ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో 6.44Pతో ఏపీ రెండో స్థానం, 6.19Pతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో ప.బెంగాల్ చిట్టచివర నిలిచింది. జ్యుడీషియల్ ర్యాంకింగ్లో TGకి 2వ, APకి 5వ స్థానాలు దక్కాయి. అలాగే, ప్రిజన్స్ విభాగంలో ఏపీ 4వ, టీజీ 7వ స్థానంలో నిలిచాయి.
బిహార్లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ తిరిగి CM అవుతారని ఆయన కుమారుడు, JDU నేత నిషాంత్ ధీమా వ్యక్తం చేశారు. 2010 కంటే ఈసారి ఎక్కువ చోట్ల తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిహార్ Dy.CM సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. INDI కూటమి ఎంత పోరాడినా ఫలితం ఉండదన్నారు. అటు నితీశ్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్-RJD వ్యూహాలు రచిస్తోంది.
111- <<16112625>>పంజాబ్<<>> (v KKR, 2025)*
116- చెన్నై (v PBKS, 2009)
118- హైదరాబాద్ (v MI, 2018)
119- పంజాబ్ (v MI, 2009)
119- హైదరాబాద్ (v PWI, 2013)
120- ముంబై (v PWI, 2012)
125- పంజాబ్ (v SRH, 2021)
ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీపై US అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. రాజకీయ, సైద్ధాంతిక, ఉగ్రవాద మద్దతు వైఖరిని కొనసాగిస్తే పన్ను మినహాయింపు హోదాను తొలగిస్తామని హెచ్చరించారు. అలాగే, వర్సిటీని ఓ రాజకీయ సంస్థగా భావించి పన్ను విధిస్తామన్నారు. యూనివర్సిటీలో యూదు వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం వర్సిటీకి సంబంధించి పలు గ్రాంట్లు, కాంట్రాక్టులను నిలిపేసిన విషయం తెలిసిందే.
LSGతో నిన్న జరిగిన మ్యాచులో చెన్నై గెలుపొందిన విషయం తెలిసిందే. వరుసగా 5 మ్యాచులు ఓడిన CSK జట్టు ఎట్టకేలకు గెలిచి తన అభిమానులను సంతోషపరిచింది. ఇకపై జరిగే మ్యాచుల్లో CSK వరుస విజయాలతో దూసుకెళ్తుందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. 2010లోనూ తొలి ఏడు మ్యాచుల్లో ఐదు ఓడిపోయిందని, ఈ సీజన్లోనూ ఇదే జరిగిందంటున్నారు. ఆ సీజన్లో కప్ కొట్టినట్లే ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడుతుందని అభిప్రాయపడుతున్నారు.
వయసుతో సంబంధం లేకుండా ఇటీవల బరువు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో బరువు తగ్గాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేక కొందరు బాధపడుతుంటారు. శరీరానికి అందిస్తున్న, ఖర్చు చేస్తున్న క్యాలరీలపై అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అలాగే, ఎంత నీరు తాగుతున్నాం? సరిపడా నిద్ర పోతున్నామా? లేదా? ఒత్తిడికి గురవుతున్నామా? అనే విషయాలు చెక్ చేసుకోవాలి. ఇవి బరువుపై ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు.
హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్లో చేస్తారా? అని యాంకర్ అడగ్గా.. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని గుర్తు చేశారు. ఇప్పటికే ఎల్లువచ్చి గోదారమ్మ(గద్దలకొండ గణేశ్) సాంగ్లో చేశానని చెప్పారు. హీరోయిన్కి ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు సిద్ధమని తెలిపారు. కాగా సూర్యతో ఈ బ్యూటీ నటించిన ‘రెట్రో’ మూవీ మే 1న రిలీజ్ కానుంది.
పెరూలో జరిగిన ISSF వరల్డ్ కప్లో భారత మహిళా షూటర్లు బంగారం, వెండి పతకాలతో మెరిశారు. ఉమెన్స్ 10మీ. ఎయిర్ పిస్టల్ క్యాటగిరీలో 18 ఏళ్ల సురుచి గోల్డ్ మెడల్ సాధించగా, 2024 ఒలింపిక్స్లో డబుల్ మెడల్ విజేత మనూ భాకర్ వెండి పతకం కైవసం చేసుకున్నారు. ఒలింపిక్స్ పతకాల తర్వాత మనూకు ఇదే తొలి అంతర్జాతీయ స్థాయి మెడల్ కావడం విశేషం. తాజాగా వీరిద్దరి ఘనత పట్ల క్రీడారంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా పేరొంది. దీనిపై ఇక వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. న్యూఢిల్లీ నుంచి కశ్మీర్కు సరాసరి నడిచే వందేభారత్ రైలును ఈ నెల 19న మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3గంటలకు తగ్గనుంది. ఇది జమ్మూను కశ్మీర్ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.
Sorry, no posts matched your criteria.