India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.

AP: జనసేనపై జరుగుతున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించాలని పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ‘ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, కుల విభేదాలను జనసేనకు ఆపాదించాలని కొందరు కిరాయి వక్తలు, మాధ్యమాలు కుట్రలు పన్నుతున్నాయి. వివాహేతర సంబంధాల రచ్చను కూడా రుద్దాలని చూస్తున్నాయి. అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలి’ అని పవన్ సూచించినట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.

BCCIని భారత క్రికెట్ టీమ్ ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేయడాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన PILను SC డిస్మిస్ చేసింది. ‘BCCI కాకుంటే ఇంకేది ఉంటుంది? 2, 3 టీములుంటే వాటి మధ్య పోటీ ఉండేది. ఇప్పుడలా లేదు కనుక ఇష్యూయే లేదు’ అని CJI జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ గుర్తింపు ఉందని, దాన్ని ఎలా ప్రశ్నిస్తామని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. జాతీయ క్రీడా చట్టం నియంత్రణ కూడా ఉంటుందన్నారు.

AP: సంక్రాంతి వేళ ఎమ్మెల్యేలే కోడి పందేలు ఎలా నిర్వహించారని వైసీపీ చీఫ్ జగన్ ప్రశ్నించారు. ‘ఈ సందర్భంగా రూ.2వేల కోట్లు చేతులు మారాయి. ప్రభుత్వమే ఈ పందేలను ప్రోత్సహించింది. పోలీసులు, నాయకులు వాటాలు పంచుకున్నారు. గ్యాంబ్లింగ్కు చట్టబద్ధత కల్పించారా? చంద్రబాబు అన్ని చెడ్డ అలవాట్లు, గుణాలు ఉన్న చెడ్డ వ్యక్తి’ అని ఫైరయ్యారు.

T20 క్రికెట్లో టీమ్ ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా NZతో జరిగిన మ్యాచ్లో తన గురువు యువరాజ్ సింగ్ (74 సిక్సర్లు) రికార్డును 33 ఇన్నింగ్స్ల్లోనే అధిగమించారు. ప్రస్తుతం T20Iల్లో 81 సిక్సర్లతో భారత ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నారు. యువీ శిక్షణలో రాటుదేలిన అభిషేక్.. గురువును మించిన శిష్యుడిగా మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నారు.

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నిన్న దేశవ్యాప్తంగా థియేటర్లలో రూ.0.48 కోట్లు(15%- థియేటర్ ఆక్యుపెన్సీ) వసూలు చేసిందని sacnilk తెలిపింది. తొలి వారం రూ.130 కోట్ల(నెట్) కలెక్ట్ చేయగా 13 రోజుల్లో మొత్తంగా రూ.141.98 కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటివరకు ఈ మూవీ 55శాతమే రికవరీ చేసిందని సినీ వర్గాలు తెలిపాయి.

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<

గురు గ్రహ బలం పెంచుకోవాలంటే మహిళలు పుట్టింటి నుంచి తెచ్చిన దీపపు కుందులతో నిత్యం దీపారాధన చేయాలి. చీమలు ఎక్కువగా ఉన్న చోట చక్కెరను ఆహారంగా చల్లాలి. సాధువులకు నెయ్యి దానం చేయడం శుభప్రదం. ఇంటికి పడమర దిశలోని శివాలయంలో బ్రాహ్మణులకు బియ్యం దానమివ్వాలి. ఇంటి ఈశాన్యంలో 9 వత్తుల నేతి దీపం వెలిగించాలి. గురుస్తోత్రం పఠించడం మరింత శ్రేష్ఠం. వేంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల గురు గ్రహ బలం చేకూరుతుంది.

1945-2017 మధ్య న్యూక్లియర్ వెపన్స్ వల్ల లక్షలాది ముందస్తు మరణాలు సంభవించినట్లు ‘నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్’ రిపోర్ట్ వెల్లడించింది. అదేంటి.. హిరోషిమా, నాగసాకి తర్వాత అణ్వస్త్రాల దాడి జరగలేదు కదా అనుకుంటున్నారా? అయితే ఈ వెపన్స్ టెస్టింగ్స్ వల్ల దాదాపు 40 లక్షల మంది తమ జీవితకాలం కంటే ముందే చనిపోయారని నివేదిక తెలిపింది. 9 దేశాల్లో 2,400కు పైగా న్యూక్లియర్ వెపన్స్ పరీక్షలు జరిగినట్లు వెల్లడించింది.

డౌన్ పేమెంట్ లేకుండా బ్యాంక్ లోన్తో ఇల్లు కొనుగోలు చేయొచ్చని ప్రసారమయ్యే యాడ్స్లో నిజం లేదు. RBI నిబంధనల ప్రకారం బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రాపర్టీ విలువలో 100%కి లోన్ ఇవ్వవు. పర్సనల్ సేవింగ్స్ నుంచి కొనుగోలుదారుడు కొంత మొత్తాన్ని తప్పకుండా చెల్లించాలి. రూ.30లక్షల వరకు ఉన్న ప్రాపర్టీకి 90%, రూ.30లక్షల-75లక్షల వరకు 80%, రూ.75లక్షల కంటే ఎక్కువైతే 75% వరకు మాత్రమే లోన్ మంజూరు చేయొచ్చు.
Sorry, no posts matched your criteria.