India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఖమ్మం జిల్లా గంగారంతండాకి చెందిన దివంగత యువ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన ఆమె వ్యవసాయ రంగంలో ఎంతో కృషి చేశారు. గత ఏడాది వరదల్లో ఆమె కన్నుమూశారు. కానీ ఆమె ప్రతిభకు కేంద్రం తాజాగా గుర్తింపు అందించింది. అశ్విని పేరిట జాతీయ స్థాయిలో కొత్త శనగ వంగడాన్ని విడుదల చేసింది. త్వరలో గెజిట్ నోటిఫికేషన్లో ఆ వంగడాన్ని పొందుపరచనున్నారు.
ప్రాసెస్డ్ & జంక్ ఫుడ్స్, కూల్డ్రింక్స్, పిజ్జాలు తినే పురుషుల్లో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హార్మోన్ల ప్రభావం వల్ల స్త్రీలలో ఈ రిస్క్ తక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉన్న పురుషులు టెస్టులు చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. కాగా బ్రిటన్లోని పురుషులు, స్త్రీలపై 28ఏళ్ల పాటు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ముల్లాన్పూర్లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్ నరైన్ ఐపీఎల్ రికార్డులకెక్కారు. ఈ మ్యాచ్లో ఆయన 2 వికెట్లు తీశారు. ఈక్రమంలో ఆ జట్టుపై ఆయన తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 36కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలరైనా ఓ ప్రత్యర్థి జట్టుపై ఇన్ని వికెట్లు తీయడం ఇదే అత్యధికం.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వీటితో పాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీచేసింది.
ఓపెనర్గా రోహిత్ శర్మ రాణించకపోవడం కారణంగానే ముంబై ఇండియన్స్ ఫెయిల్ అవుతోందని భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా వ్యాఖ్యానించారు. ముంబై పైచేయి సాధించాలంటే హిట్మ్యాన్ దూకుడుగా ఆడాలన్నారు. కాగా రోహిత్ ఈ సీజన్లో ఐదు మ్యాచ్ల్లో 0, 8, 13, 17, 18 పరుగులు మాత్రమే చేశారు. MI ఆరు మ్యాచ్ల్లో 4 ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో ఉంది.
AP: VZM(D) మెంటాడ(మ) కుంటినవలసలో నిర్మిస్తున్న కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్సిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నియామకం కోసం ప్రధానికి లేఖ రాస్తానని తనను కలిసిన వర్సిటీ వీసీ, అధికారులకు CBN బదులిచ్చారు. 561 ఎకరాల ప్రాంగణం ఉన్న ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం 600 మంది విద్యార్థులు చదువుతున్నారు.
గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కొందరు దురుద్దేశంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. దీని వెనుక ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఉన్నాయని పేర్కొంది. ప్రోటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యూయేషన్ చేయించినట్లు స్పష్టం చేసింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని తేల్చి చెప్పింది.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ప్రత్తిపాడు పీఎస్లో కేసు నమోదైంది. తాజాగా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్క్తో పాటు పవన్ భార్యపైనా వీరు తప్పుడు పోస్టులు పెట్టినట్లు సమాచారం.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్డమ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభమైనట్లు హీరో విజయ్ దేవరకొండ ఇన్స్టా స్టోరీలో తెలిపారు. ఇప్పటికే సగం పార్ట్ పూర్తయిందని వెల్లడించారు. విజయ్ స్టోరీని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. మే 30న సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు-హీరో సిద్ధమయ్యారని రాసుకొచ్చింది.
AP: పాలిసెట్ దరఖాస్తుల గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 17 వరకు <
Sorry, no posts matched your criteria.