news

News April 15, 2025

పంజాబ్‌కు ‘మ్యాక్సీ’మమ్ నిరాశే

image

పంజాబ్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచారు. KKRతో మ్యాచులో కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను ముందుండి నడిపించాల్సింది పోయి వరుణ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యారు. గత మ్యాచుల్లోనూ మ్యాక్సీ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మొత్తంగా ఈ సీజన్లో 6 మ్యాచుల్లో 41 పరుగులే చేశారు. దీంతో జట్టుకు భారంగా మారారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

News April 15, 2025

లా కమిషన్ ఛైర్మన్‌గా దినేశ్ మహేశ్వరి

image

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి 23వ లా కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హితేశ్ జైన్, DP వర్మను సభ్యులుగా నియమించింది. 2027 ఆగస్టు 31వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు.

News April 15, 2025

డబ్బులేక రోడ్డు పక్కనే పడుకునేవాడిని: షారుఖ్

image

కెరీర్ తొలినాళ్లలో ముంబైలో అద్దె కట్టేందుకు కూడా డబ్బు లేక రోడ్డు పక్కన పడుకునేవాడినని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మనిషికి ఇల్లు, చదువు ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్లే. ఉద్యోగం, డబ్బు లేకపోయినా ఫర్వాలేదు కానీ నిద్రపోవడానికి, బాధగా ఉన్నప్పుడు కూర్చుని ఏడవడానికి ఓ నీడ కచ్చితంగా ఉండాలి. నా పిల్లలకు నా పరిస్థితి ఉండకూడదని ముందుగానే ఇల్లు కట్టుకున్నాను’ అని తెలిపారు.

News April 15, 2025

IPL: పాపం పంజాబ్

image

గత మ్యాచులో SRH చేతిలో ఓటమి మూటగట్టుకున్న పంజాబ్ తాజాగా KKRతో మ్యాచులోనూ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 9.1 ఓవర్లలో 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ప్రియాంశ్ 22, ప్రభ్‌సిమ్రన్ 30 రన్స్ చేయగా, కెప్టెన్ శ్రేయస్ డకౌట్ అయ్యారు. ఇంగ్లిస్(2), వధేరా(10), మ్యాక్సీ(7) విఫలమయ్యారు. KKR బౌలర్లలో హర్షిత్ 3, వరుణ్ 2 వికెట్లతో సత్తా చాటారు.

News April 15, 2025

సునీల్ నరైన్ రహస్యం అదే: బిస్లా

image

KKR మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ చాలా సీజన్లుగా IPL ఆడుతున్నా ఇప్పటికీ అతడి బౌలింగ్‌ను చాలామంది ఛేదించలేకపోయారు. అందుకు గల కారణాన్ని KKR మాజీ వికెట్ కీపర్ బిస్లా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నరైన్ తన మిస్టరీని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడతారు. ఆఖరికి నెట్ ప్రాక్టీస్ సమయంలోనూ బ్యాటర్లకు బౌలింగ్ చేయరు. కీపర్‌ను కాబట్టి నాకు అర్థం కావడం కోసమైనా కొన్ని బంతులు వేయమని నేను అడిగేవాడిని’ అని తెలిపారు.

News April 15, 2025

రేవంత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

image

TG: గచ్చిబౌలి పీఎస్‌లో 2016లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని CM రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. గోపన్‌పల్లిలోని భూవివాదానికి సంబంధించి రేవంత్‌పై కేసు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసును కొట్టేయాలంటూ 2020లో రేవంత్ పిటిషన్ వేశారు. ఇవాళ విచారణ సందర్భంగా పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని జస్టిస్ కె.లక్ష్మణ్ ఆదేశించారు.

News April 15, 2025

ప్రతీకార రాజకీయాలకు ఇది నిదర్శనం: కాంగ్రెస్

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఛార్జిషీటులో ఈడీ <<16108914>>చేర్చడంపై<<>> కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలకు, బెదిరింపులకు ఇది నిదర్శనమని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై తమ పార్టీ మౌనంగా ఉండదని, సత్యమేవ జయతే అంటూ Xలో ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం చట్టబద్ధమైన పాలన ముసుగులో చేస్తున్న రాజకీయమని రమేశ్ మండిపడ్డారు.

News April 15, 2025

కొత్త సినిమా కలెక్షన్ల సునామీ

image

అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తమిళనాడులో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సంభవం కొనసాగుతోందని పేర్కొంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. అజిత్ కెరీర్‌లో తమిళనాడులో తొలి రోజే అత్యధిక ఓపెనింగ్స్(రూ.30కోట్లు+) రాబట్టిన చిత్రంగానూ నిలిచింది.

News April 15, 2025

ట్రాఫిక్ చలాన్ల జారీలో కీలక మార్పులు!

image

వాహనదారులకు విధించే చలాన్లపై కేంద్రం కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని తీసుకొచ్చింది. చలాన్లు విధించే ఆటోమేటెడ్ కెమెరాలు కనీసం 10 సెకన్ల ఫుటేజ్‌ను రికార్డ్ చేయాలని ఆదేశించింది. ట్రాఫిక్ చలాన్ల అమలులో పారదర్శకతను పెంచేందుకు ఈ చర్యకు సిద్ధమైనట్లు తెలిపింది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే 1-10 సెకన్ల వీడియోతో పాటు, టైమ్, లొకేషన్ చూపేలా చలాన్‌లో స్పష్టంగా కనిపించాలని తెలిపింది.

News April 15, 2025

వైఎస్ జగన్ పర్యటనలో ఘటనపై పోలీసుల విచారణ

image

AP: వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పాపిరెడ్డిపల్లిలో జగన్‌ను తీసుకొచ్చిన హెలికాప్టర్‌ను కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు. అదే సమయంలో హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్, కో పైలట్ టేకాఫ్ చేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు పైలట్, కో-పైలట్‌కు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని సూచించారు.