news

News September 4, 2025

కోహ్లీ-రోహిత్‌ని ఆడొద్దనే హక్కు లేదు: దీప్‌ దాస్‌

image

కోహ్లీ-రోహిత్ మరికొన్నేళ్లు క్రికెట్ ఆడగలరని టీమ్ ఇండియా మాజీ కీపర్ దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డారు. ‘ఏ ఆటగాడినైనా వయసు రీత్యా రిటైరవ్వమని చెప్పే హక్కు ఎవరికీ లేదు. పర్ఫామ్ చేస్తుంటే కొనసాగడంలో తప్పేంటి? ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెప్పనప్పుడు.. ఎప్పుడు ఆపాలో ఎలా చెప్తారు’ అని ప్రశ్నించారు. కోహ్లీ-రోహిత్ T20, టెస్టుల నుంచి రిటైరైన విషయం తెలిసిందే.

News September 4, 2025

అధిక వర్షాలు.. వరి నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

అధిక వర్షాల వల్ల నారుమడిలో జింకు లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 నుంచి 5 గ్రాముల అన్నభేది, 0.5-1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. వరద ముంపునకు నారు చనిపోతే ఎకరానికి 15-20 కిలోల స్వల్పకాలిక రకాలైన MTU-1010, KNM-118 విత్తనాలను పొలాన్ని బాగా దమ్ముచేసి డ్రమ్ సీడర్‌తో లేదా వెదజల్లే పద్ధతిలో విత్తుకోవాలి.

News September 4, 2025

మహిళలూ ఆ ఫీలింగ్‌తో బాధపడుతున్నారా?

image

ఈరోజుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరిని మదర్‌ గిల్ట్‌ బాధిస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నామనే భావనే మదర్ గిల్ట్. ఈ విషయంపై ఒత్తిడి చెందితే మానసిక ఆరోగ్యం దెబ్బతిని ఆ ప్రభావం ఇంట్లోనూ, ఆఫీసు పనిపై పడుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి కుదిరినప్పుడల్లా వారితో ఎక్కువ సమయం గడపడం, విహారయాత్రలకు వెళ్లడం ద్వారా ఆ లోటును తీర్చుకోవచ్చంటున్నారు.

News September 4, 2025

గురువారం నాడు ఏ దేవుళ్లను పూజించాలి?

image

ఈ రోజుకు బృహస్పతి అధిపతి. అందుకే ఈరోజున సాయిబాబా, దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామిలతో పాటు బృహస్పతిని కూడా పూజించాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే విష్ణువును పూజించడం కూడా శుభప్రదమని చెబుతున్నారు. పసుపు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తికి పసుపు పువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలని, అలా చేస్తే ఆ దేవుని అనుగ్రహం కలుగుతుందని, దాంపత్య జీవితంలో శాంతి, ఆనందం లభిస్తాయని అంటున్నారు.

News September 4, 2025

ఏ కారు ధర ఎంత తగ్గుతుందంటే?

image

కొన్ని కార్లపై GST 28%శ్లాబు నుంచి 18శాతానికి తగ్గింది. దీంతో ఒక్కో కారుపై ఎంత ధర తగ్గుతుందనే అంచనా వివరాలు కింద చూడొచ్చు.
మారుతీ స్విఫ్ట్(రూ.88వేలు), టాటా నెక్సాన్(రూ.1,05,000), మారుతీ బాలెనో(రూ.85వేలు), మహీంద్రా 3XO(రూ.95వేలు), హ్యుందాయ్ వెన్యూ(రూ.79వేలు), టాటా టియాగో(రూ.50వేలు), కియా సోనెట్(రూ.90వేలు), టాటా ఆల్ట్రోజ్(రూ.82వేలు), హ్యుందాయ్ i20(రూ.75వేలు), హోండా అమేజ్(రూ.85వేలు).

News September 4, 2025

తెలుగు ప్రేక్షకుల ప్రేమను మర్చిపోలేను: కళ్యాణి

image

అఖిల్ ‘హలో’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. ‘కొత్త లోక’ మూవీ సక్సెస్‌తో ఆమె పేరు మార్మోగుతోంది. మంచి కథ దొరికితే తెలుగులో సినిమా చేస్తానని సక్సెస్ మీట్‌లో కళ్యాణి చెప్పారు. తన మొదటి ప్రేక్షకులు తెలుగువారేనని, వారి ప్రేమను ఎప్పటికీ మరిచిపోనని ఆమె తెలిపారు. తెలుగులోనూ ‘కొత్త లోక’ను హిట్ చేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.

News September 4, 2025

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. సీఎం కీలక నిర్ణయం

image

AP: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాంటి పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధివిధానాలను రూపొందించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారథి ఉంటారు. తప్పుడు పోస్టుల నివారణ, బాధ్యులపై కఠిన చర్యలకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కమిటీ సూచనలు చేయనుంది.

News September 4, 2025

AP క్యాబినెట్‌ నిర్ణయాలు ఇవే

image

* 5జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులకు ఆమోదం
* వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
* గ్రామీణ తాగునీటి సరఫరా నిర్వహణ, పర్యవేక్షణ పాలసీపై చర్చ
* కుప్పంలో రూ.586 కోట్లతో హిందాల్కో పరిశ్రమకు ఆమోదం
* ప్రైవేటు వర్సిటీల చట్టంలో పలు సవరణలకు గ్రీన్ సిగ్నల్
* SIPB, CRDA నిర్ణయాలకు ఆమోదం
* SEP 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశముంది.

News September 4, 2025

OTTలోకి రజినీకాంత్ ‘కూలీ’.. ఎప్పుడంటే?

image

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

News September 4, 2025

రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా

image

APలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ భేటీ అయిన మంత్రివర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని అమలు చేయనుంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానాన్ని రూపొందించింది. 1.63 కోట్ల కుటుంబాలకు హైబ్రిడ్ విధానంలో 3,257 చికిత్సలు అందించనుంది.