India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పార్టీ అభివృద్ధికి ప్రతీ ఎమ్మెల్యే జీతం నుండి రూ.25 వేలు ఇవ్వాలని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని నేతలకు స్పష్టం చేశారు. పదవుల విషయంలో అద్దంకి దయాకర్లాగా ఓపికతో ఉండాలని చెప్పారు. ఓపికతో ఉన్నాడు కాబట్టే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడని తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబె, ఇతర నేతల పేర్లను పేర్కొంది. దీనిపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 25న వాదనలను విననుంది. ఇప్పటికే ఈ కేసులో నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులు ఇచ్చింది.
AP: విశాఖలో TCS(Tata Consultancy Services) సంస్థకు 21.16 ఎకరాల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎకరం 0.99 పైసల చొప్పున భూమిని ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా TCS నుంచి రూ.1370కోట్ల పెట్టుబడులు, 12000 ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. TCSకు భూకేటాయింపు ద్వారా విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
వేసవిలో డీహైడ్రేషన్కు కారణమయ్యే కూరగాయలను దూరం పెట్టాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపింది. వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలో వేడిని పెంచి స్కిన్ రాషెస్కు దారితీస్తాయి. ఉల్లిపాయ వంటలో వాడినప్పుడు హీట్ను పెంచి ఎసిడిటీకి కారణమవుతుంది. బీట్రూట్తో వేడిగడ్డలు అవుతాయి. కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ శరీరం డీహైడ్రేట్ అయ్యేలా చేస్తాయి. కీర, సొరకాయ, పుదీనా, ఆకుకూరలు తినాలి.
నిర్మాత దిల్ రాజు నుంచి రేపు ఉదయం 11.08 ఓ భారీ అనౌన్స్మెంట్ రానుంది. ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని ట్విటర్లో ప్రకటించింది. ‘బోల్డ్.. బిగ్.. బియాండ్ ఇమాజినేషన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సినిమాల్లో AI టెక్నాలజీ వాడేందుకు దిల్ రాజు ఓ సంస్థతో ఒప్పందం చేసుకోవడం లేదా సొంతంగా సంస్థ ప్రారంభించడం ఈ ప్రకటన వెనుక కారణం కావొచ్చని సినీవర్గాలంటున్నాయి.
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలి విడతగా 12 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ₹లక్ష సాయాన్ని అందించింది. CLP మీటింగ్ అనంతరం పలువురు లబ్ధిదారులకు CM రేవంత్ రెడ్డి ₹లక్ష విలువైన చెక్కులు ఇచ్చారు. కాగా బేస్మెంట్ వరకు ఇళ్లు నిర్మిస్తే ₹లక్ష, గోడలు నిర్మించాక ₹1.25 లక్షలు, స్లాబ్ వేశాక రూ.1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక మరో ₹.లక్ష సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
వాట్సాప్ తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లపై దృష్టి పెట్టింది. తాజాగా స్టేటస్ అప్డేట్స్లో వీడియోల డ్యూరేషన్ను పెంచింది. ఇప్పటివరకు 30 సెకండ్ల వ్యవధి ఉన్న వీడియోలను మాత్రమే స్టేటస్ పెట్టుకునే అవకాశం ఉండేది. ఆ సమయాన్ని 90 సెకండ్లకు పెంచింది. ప్రస్తుతం ఈ అప్డేట్ కొంతమంది బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరూ ఉపయోగించుకోవచ్చు.
బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ (ADA) వివిధ విభాగాల్లో 137 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, గేట్ పాసైనవారు అర్హులు. వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. సైంటిస్ట్ బి పోస్టులకు నెలకు రూ.90,789, సైంటిస్ట్ సి పోస్టులకు నెలకు రూ.1,08,073 జీతం అందనుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నెల 21లోగా https://www.ada.gov.inలో అప్లై చేసుకోవాలి.
సూపర్ స్టార్ మహేశ్బాబు, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భరత్ అనే నేను’ మరోసారి థియేటర్లలో విడుదలవుతోంది. ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. సిినిమా వచ్చి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలో ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ చిత్రం 2018లో విడుదలై రూ.200+ కోట్లు వసూలు చేసింది.
గత ఏడాది ఐపీఎల్లో SRH బ్యాటింగ్లో ఊచకోతతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. 2024 ఏప్రిల్ 15(సరిగ్గా ఇదే రోజు)న టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. RCBతో జరిగిన మ్యాచులో 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. హెడ్ శతకం, క్లాసెన్ హిట్టింగ్తో భారీ స్కోరు చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదీ SRH 286 పరుగులు చేసినా గత రికార్డును చెరపలేకపోయింది. మరి ఈ సీజన్లో కొత్త రికార్డు నమోదవుతుందా? కామెంట్.
Sorry, no posts matched your criteria.