India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాక్ను పావుగా వాడుకుంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మండిపడ్డారు. టాయ్లెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. 1999 తర్వాత US మద్దతు కోసం అఫ్గాన్ యుద్ధంలోకి దిగడం తమకు తీరని నష్టం కలిగించిందని వాపోయారు. దశాబ్దాల తర్వాత కూడా పర్యవసానాలు అనుభవిస్తున్నామన్నారు. జిహాద్ పేరుతో తమ పౌరులను పోరాటానికి పంపామని పార్లమెంటులో అంగీకరించారు.

TG: నిన్న విడుదలైన టెట్ <<19104650>>ఫలితాల్లో<<>> ఏకంగా 27,712(42%) మంది ఇన్ సర్వీస్ టీచర్లు అర్హత సాధించలేదు. మొత్తం 65,605 మంది టీచర్లు పరీక్షకు హాజరయ్యారు. టెట్ ప్రవేశ పెట్టకముందు నియమితులై ఐదేళ్లకు మించి సర్వీసులో ఉన్న టీచర్లు రెండేళ్లలోపు ఒక్కసారైనా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఓవరాల్గా 1,95,181 మంది పరీక్ష రాయగా 1,00,270 మంది(51.37%) క్వాలిఫై అయ్యారు.

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

PoK, ఆక్సాయ్ చిన్తో కలిపి మొత్తం J&Kను <<19072627>>భారత భూభాగం<<>>గా చూపిస్తూ చేసిన SM పోస్ట్ను అమెరికా ట్రేడ్ రిప్రజంటేటివ్ (USTR) తొలగించింది. భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ గతవారం USTR ఈ మ్యాప్ను పోస్ట్ చేసింది. దీంతో పాక్, చైనా ఆక్రమణలను తిరస్కరిస్తూ ఇండియా పొలిటికల్ మ్యాప్ను అమెరికా అధికారికంగా గుర్తించినట్లు అంతా భావించారు.

గతంలోనూ ముగ్గురు స్పీకర్లు అవిశ్వాసాలు ఎదుర్కొన్నారు. 2సార్లు ఓటింగ్ జరిగినా అవి వీగిపోయాయి. ఓటింగ్ భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ‘<<19097533>>మెజారిటీ <<>>విషయంలో లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యను లెక్కలోకి తీసుకుంటారు. దీంతో అధికార పక్షానిదే మెజారిటీ అవుతుంది. తీర్మానం గట్టెక్కదు’ అని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి తెలిపారు. గతంలో మౌలాంకర్(1954), హుకుం సింగ్(1966), బలరాం జాఖడ్(1987) అవిశ్వాసం ఎదుర్కొన్నారు.

AP: నిన్న విడుదలైన రూ.1,200 కోట్ల <<19104256>>ఫీజు<<>> రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో 2024-25 బకాయిలు క్లియర్ కానున్నాయి. అయితే 2023-24కు సంబంధించి రూ.1,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ నిధులను తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్సులు పూర్తి చేసుకొని వెళ్లిపోయిన వారినుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

ఏకాదశికి చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే ఆ ఒక్కరోజే కాకుండా మూడ్రోజులు (ఏకాదశి, దశమి, ద్వాదశి) కలిపి ‘హరిత్రయం’ పాటిస్తూ ఉపవాసం ఉండాలంటున్నారు పండితులు. దీనివల్ల అధిక పుణ్యం లభిస్తుందట. నియమాలు.. దశమి నాడే ఉపవాస నియమాలు ప్రారంభించాలి. దశమి రాత్రి అల్పాహారం తీసుకుని, నేలపై పడుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ద్వాదశి ఘడియలు ముగిసేలోపే వ్రత సమాప్తి (పారణ) చేయాలి.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (<

టీ20 వరల్డ్ కప్లో ఇవాళ ఆసక్తికర మ్యాచులు జరగనున్నాయి. ఉ.11 గంటలకు గ్రూప్-D నుంచి సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్(అహ్మదాబాద్), 3pmకి గ్రూప్-B నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్ (కొలొంబో), రా.7 గంటలకు గ్రూప్-C నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ (ముంబై) జట్లు తలపడనున్నాయి. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్ చూడవచ్చు. కాగా గ్రూప్-Aలో ఉన్న భారత్ రేపు ఢిల్లీ వేదికగా రా.7 గంటలకు నమీబియాతో మ్యాచ్ ఆడనుంది.
Sorry, no posts matched your criteria.