India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బోయింగ్ విమానంలో బాత్రూమ్ డోర్ లాక్ కావడంతో ఓ ప్రయాణికుడు అందులోనే చిక్కుకుపోయాడు. సిబ్బంది ఎంత ప్రయత్నించినా తలుపు రాకపోవడంతో విమానాన్ని అత్యవసరంగా కిందికి దించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన US విమానయాన పర్యవేక్షణ సంస్థ FAA, బోయింగ్కు చెందిన 2612 విమానాల ప్రయాణ అర్హతను ప్రశ్నించింది. బోయింగ్ అన్ని విమానాల్లోని లాక్లను మార్చాల్సి ఉండటంతో దీనికి 3.4 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా.
AP: వైసీపీ నేతలు మతకలహాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. అబద్ధాల్ని నిజం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో పింక్ డైమండ్ ఉందంటూ దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెడతామని హోంమంత్రి స్పష్టం చేశారు.
తాను పనిచేసే కంపెనీ తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి టాయిలెట్ పేపర్పై రాజీనామా లేఖ రాశాడు. సింగపూర్కు చెందిన బిజినెస్ ఉమెన్ ఏంజెలా యో ఈ లెటర్ను లింక్డ్ ఇన్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ‘ఈ కంపెనీ నన్ను ఎలా ట్రీట్ చేసిందో తెలిపేందుకే ఇలాంటి పేపర్ను ఎంచుకున్నా’ అని అతడు అందులో రాసుకొచ్చాడు. ఉద్యోగులు బయటికి వెళ్లేటప్పుడు కృతజ్ఞతతో ఉండేలా చూడటం సంస్థ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని యో అన్నారు.
AP: తిరుమల కొండపై వరుసగా మహాపచారాలు జరుగుతున్నాయని YCP Xలో ఆరోపణలు చేసింది. ‘కొండపై మద్యం, బిర్యానీ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. చెప్పులు వేసుకుని భక్తులు మహాద్వారం వద్దకు వచ్చేవరకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిద్రపోతున్నారా? ఇప్పుడు టీటీడీ గోశాలలో వందలాది ఆవులు చనిపోయాయి. అసమర్థుడైన బీఆర్ నాయుడికి అన్నీ అప్పగించి తిరుమలను ఏం చేద్దామని అనుకుంటున్నావ్?’ అని CM CBNను ప్రశ్నిస్తూ ఓ ఫొటో పంచుకుంది.
ఇటీవల జూ.ఎన్టీఆర్ సన్నగా మారడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి బాలేదని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ దీనిపై స్పందించారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అని, ఆయన ఏం చేసినా.. ఎలా ఉన్నా సినిమా కోసమేనని పేర్కొన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యాక ‘దేవర-2’ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ‘దేవర’కు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ప్రతీకార సుంకాలతో చైనా, US మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల ప్రతినిధులు పరస్పరం మాటలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇండోనేషియాలోని చైనా రాయబారి జాంగ్ జిషెంగ్ వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ను టార్గెట్ చేశారు. తమ దేశంలో తయారైన డ్రెస్ను ఆమె ధరించారని ట్వీట్ చేశారు. ‘బిజినెస్ కోసం చైనాను నిందిస్తారు. అవసరానికి చైనా వస్తువులనే కొంటారు’ అని సెటైర్ వేశారు.
TG: కాంగ్రెస్కు BRS మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు. ‘CM రేవంత్కి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. 119 అసెంబ్లీ స్థానాల్లో పదింట మాత్రమే కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉంది. ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడుతుంది. అందుకే ఆయన భయపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.
అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బాంబులతో పేల్చివేస్తామని కలెక్టరేట్లకు ఈమెయిల్స్ రాగా అధికారుల ఫిర్యాదుతో అయోధ్య సైబర్ క్రైమ్ పీఎస్లో కేసు నమోదు చేశారు. బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేపట్టారు.
ఏపీలో ఎస్సీ కులాల వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు. వర్గీకరణలో భాగంగా గ్రూప్-1లో 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్-2లో 18 ఉపకులాలకు 6.5శాతం, గ్రూప్-3లో 29 ఉపకులాలకు 7.5శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.
‘హరిహర వీరమల్లు’ను వచ్చే నెల 9న విడుదల చేస్తామని మేకర్లు ఇప్పటికే చెప్పేశారు. అయినప్పటికీ సినిమా విడుదలపై అనుమానాలు కొనసాగుతున్నాయి. Dy.CM బాధ్యతల్లో బిజీగా ఉన్న పవన్, ఈ వారంలో తన పార్ట్ షూటింగ్ పూర్తిచేయాలని భావించారు. ఊహించని రీతిలో ఆయన కుమారుడు మార్క్ శంకర్ గాయపడటంతో అది కాస్తా వాయిదా పడింది. పవన్ సీన్స్ మూవీకి కీలకం కావడంతో మే 9కి విడుదల చేయగలమా లేదా అన్న టెన్షన్లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.