news

News April 15, 2025

కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

రాగల మూడు గంటలు ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.

News April 15, 2025

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు

image

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 105 శాతంగా నమోదవుతుందని IMD చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. సీజన్ మొత్తం ఎల్నినో పరిస్థితులు నెలకొంటాయన్నారు. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 1న ప్రవేశిస్తాయి. దీంతో దేశంలో వర్షాకాలం మొదలైందని పేర్కొంటారు.

News April 15, 2025

ఏపీ నుంచి ఏపీకి వయా HYD.. గంటా ఆవేదన

image

AP: వైజాగ్ నుంచి అమరావతికి వెళ్లాలంటే హైదరాబాద్‌ మీదుగా వెళ్లాల్సి రావడంపై TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉదయం 8 గంటలకు విశాఖలో బయలుదేరి హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం నడిచే 2 విమానాలు రద్దు కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి’ అని ఆయన వాపోయారు.

News April 15, 2025

వడదెబ్బ బాధితులకు రూ.4 లక్షల పరిహారం

image

TG: వడదెబ్బతో మరణించినవారి కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వడగాలులను విపత్తుగా ప్రకటిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో వడదెబ్బ బాధితులకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని ప్రభుత్వం రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

News April 15, 2025

పూరీతో సినిమా.. విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

దర్శకుల గత సినిమాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని తాను పనిచేయనని నటుడు విజయ్ సేతుపతి చెప్పారు. స్క్రిప్ట్ నచ్చితేనే నటించేందుకు ఓకే చెబుతానని తెలిపారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతోనే మూవీ చేసేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఒకే లాంటి సినిమాలు చేయకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. కాగా పూరీతో మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుందన్నారు.

News April 15, 2025

సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ భేటీ కోసం నోవాటెల్ హోటల్‌కు వెళ్లగా ఆయన ఎక్కిన లిఫ్టులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగులు కిందకి దిగిన లిఫ్ట్. 8 మంది ఎక్కాల్సిన దాంట్లో 13 మంది ఎక్కడంతో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు లిఫ్టులో నుంచి రేవంత్‌ను సురక్షితంగా బయటకు తీశారు.

News April 15, 2025

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

image

ప్రతీకార టారిఫ్స్‌పై యూఎస్ విరామం ప్రకటించడంతో పుంజుకున్న భారత సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టార్లు గ్రీన్‌లోనే ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 1577 పాయింట్ల లాభంతో 76,734, నిఫ్టీ 500 పాయింట్లు పొంది 23,328 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు 3 శాతం ఎగిశాయి. ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, L&T, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్.

News April 15, 2025

పోస్టల్ సర్వీస్‌నూ వదల్లేదు.. ఎంతకు తెగించార్రా?

image

గుజరాత్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మగ్లర్లు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. చివరికి పోస్టల్ సర్వీస్‌నూ వదల్లేదు. యూనియన్ టెరిటరీ దాద్రానగర్ హవేలీలోని దీవ్ నుంచి పోస్ట్ మాస్టర్ సాయంతో మద్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారు. పోస్టల్ స్టాంప్ ఉన్న పార్శిల్స్ చెక్ చేయరని ఈ దారి ఎంచుకున్నారు. కానీ బార్డర్లో పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు.

News April 15, 2025

ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా?

image

అవసరానికి మించి ఉప్పు తీసుకోవడం మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. WHO చెప్పినట్లు రోజూ 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు (దాదాపు 2గ్రాముల సోడియం) తీసుకోవాలని తెలిపారు. ఈ మోతాదు మించితే రక్తపోటు, శరీరంలో నీరు చేరడం, గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాస్‌లు, నిల్వ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుందని, ఆరోగ్యంగా ఉండేందుకు ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటున్నారు.

News April 15, 2025

ముస్లింలపై మోదీ వ్యాఖ్యలు.. ఒవైసీ కౌంటర్

image

హరియాణాలో నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ Xలో విమర్శలు గుప్పించారు. ‘వక్ఫ్ పేరిట దేశంలో లక్షల ఎకరాల భూములున్నాయి. వాటిని సక్రమంగా వినియోగించి ఉంటే ముస్లిం పిల్లలు సైకిల్ పంక్చర్ పనులు చేసుకోవాల్సి వచ్చేది కాదు’ అని మోదీ వ్యాఖ్యానించారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ ‘సంఘ్ పరివార్ ఆస్తులు దేశం కోసం వినియోగించి ఉంటే మోదీ టీ అమ్మాల్సి వచ్చేది కాదు’ అని కౌంటర్ ఇచ్చారు.