news

News April 15, 2025

బెంగాల్‌లో హింస.. బంగ్లాదేశీయుల హ్యాండ్?

image

వక్ఫ్ బిల్లు సవరణను నిరసిస్తూ గత వారం పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస వెనుక బంగ్లా దుండగులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నిరసనకారుల్లో కలిసిపోయిన దుండగులు రాళ్లు రువ్వి హింసకు తెరతీశారని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఆ అల్లర్లలో ముగ్గురు చనిపోగా, పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. కేసులో ఇప్పటి వరకు 200మందికి పైగా నిందితుల్ని అధికారులు అరెస్ట్ చేశారు.

News April 15, 2025

నా పాటలు వాడుకున్నందుకు రూ.5కోట్లు ఇవ్వాలి: ఇళయరాజా

image

హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నిర్మాతలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్ ఇచ్చారు. తాను గతంలో స్వరపరిచిన 3 పాటలను వాడుకున్నారని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా ఉపయోగించినందుకు రూ.5కోట్లు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపించారు. కాగా గతంలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మేకర్స్‌కూ ఆయన నోటీసులిచ్చారు.

News April 15, 2025

గురుకుల విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసుకోవచ్చు!

image

TG: ఎస్సీ గురుకులాల్లో ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా విద్యార్థులు ఎన్నిసార్లైనా ఫ్రీగా పేరెంట్స్‌తో మాట్లాడొచ్చు. విద్యార్థులను బట్టి 7-10 ఫోన్లు అందుబాటులో ఉంటాయి. నలుగురికి ఒక కాలింగ్ కార్డిస్తారు. అందులో రిజిస్టర్ చేసిన నంబర్స్‌కే కాల్ వెళ్తుంది. హెల్ప్ సెంటర్ నంబరుకూ కాల్ చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. స్మార్ట్ ఫోన్ కానందున నిరుపయోగం అయ్యే ఛాన్స్ తక్కువ.

News April 15, 2025

ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్!

image

TG: మంత్రి పదవి విషయంలో పలువురు నేతలు బహిరంగంగా మాట్లాడటంపై సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పదవుల విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, అలా మాట్లాడితే లాభం కంటే మీకే నష్టం ఎక్కువని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పదవుల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని నేతలకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క MLA కూడా సోషల్ మీడియా వాడట్లేదని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.

News April 15, 2025

బంగ్లాదేశ్‌లో భారత జట్టు పర్యటన.. షెడ్యూల్

image

భారత సీనియర్ మెన్స్ జట్టు ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టులో జరిగే ఈ పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది. మిర్పూర్ వేదికగా 17, 20 తేదీల్లో తొలి రెండు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 23న చట్టోగ్రామ్‌లో 3 వన్డే ఆడనుంది. ఆ తర్వాత తొలి T20 ఆగస్టు 26న చట్టోగ్రామ్‌లో, మిగతా రెండు T20లను ఆగస్టు 29, 31 తేదీల్లో మిర్పూర్ వేదికగా ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.

News April 15, 2025

త్వరలో ‘SSMB29’ గ్లింప్స్?

image

రాజమౌళి, మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘SSMB29’ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ను అబ్బురపరిచేలా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టన్నింగ్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని, ఇది పూర్తయ్యాక అనౌన్స్‌మెంట్ చేస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

News April 15, 2025

మా వాళ్లు బర్త్‌డే విషెస్ చెప్పలేదు: రాజాసింగ్

image

తెలంగాణ BJP నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత రాజాసింగ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా సీనియర్లు తనను గుర్తించడం లేదన్నారు. ఇవాళ తన పుట్టినరోజున అయినా సొంత పార్టీ సీనియర్లు కనీసం విషెస్ చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన TBJP చీఫ్ కిషన్ రెడ్డి రాజాసింగ్ వ్యవహారంపై అంతర్గతంగా చర్చిస్తామన్నారు.

News April 15, 2025

చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

చిన్నారుల అక్రమ రవాణా విషయంలో UP ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ నిర్దేశించింది. ఆసుపత్రుల నుంచి నవజాత శిశువులు మిస్సయితే వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని ఆదేశించింది. అక్రమ రవాణా కేసుల ట్రయల్స్‌ను కోర్టులు 6 నెలల్లోగా పూర్తి చేయాలంది. కాగా 2020 నుంచి 36 వేల మంది చిన్నారులు మిస్ అయ్యారని కేంద్రం గత ఫిబ్రవరిలో కోర్టుకు నివేదిక సమర్పించింది.

News April 15, 2025

డబ్బు కాదు విధేయత ముఖ్యం.. అందుకే KKRను వీడలేదు: రమణ్‌దీప్

image

KKR తనను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోవడం వెనుక ఉన్న కథను రమణ్‌దీప్ వెల్లడించారు. వేలానికి ముందు రిటైన్‌కు ఒప్పుకోవద్దని, రూ.9-10 కోట్లతో కొనుగోలు చేస్తామని చాలా టీమ్స్ ఆఫర్ ఇచ్చాయన్నారు. అయితే తనకు తొలుత అవకాశం ఇచ్చిన KKRపై విధేయత ఉందని చెప్పారు. అందుకే డబ్బు తక్కువైనా టీమ్‌లోనే ఉంటానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలిపారు. వేలంలోకి వెళితే ఇదే జట్టులోకి వస్తాననే గ్యారంటీ లేదన్నారు.

News April 15, 2025

ICC POTM అవార్డులు.. ఎవరికెన్నంటే?

image

శ్రేయస్ అయ్యర్ ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ ‌అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ అవార్డును 8 మంది భారత క్రికెటర్లు సాధించారు. శుభ్‌మన్ గిల్ 3, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రెండేసి సార్లు ఎంపికవ్వగా, పంత్, అశ్విన్, భువనేశ్వర్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్ ఒక్కోసారి ఎంపికయ్యారు.