news

News September 4, 2025

కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్

image

కేంద్రం GST శ్లాబులను తగ్గించడం కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘సిమెంట్, గ్రానైట్, మార్బుల్, ఇటుకల వంటి ముఖ్యమైన నిర్మాణ సామగ్రిపై GST 12% నుంచి 5%/ 28% – 18% తగ్గడంతో నిర్మాణ వ్యయం తగ్గనుంది. దీంతో మొత్తం నిర్మాణ వ్యయంలో సుమారు 5% వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఇళ్ల ధరలు తగ్గి సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’ అని అంచనా వేస్తున్నారు.

News September 4, 2025

PSలలో లేని CC కెమెరాలు.. సుమోటోగా తీసుకున్న SC

image

దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో CC కెమెరాలు లేకపోవడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ ఏడాది గత 8 నెలల్లో 11 మంది పోలీస్ కస్టడీలో చనిపోయారన్న నివేదిక ఆధారంగా విచారణకు స్వీకరించింది. 2020లో ఓ కేసు విచారణ సందర్భంగా దేశంలోని అన్ని పీఎస్‌లలో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. అయినప్పటికీ కొన్ని స్టేషన్లలో ఇంకా కెమెరాలు లేవని, ఉన్నా పని చేయట్లేదన్న ఆరోపణలున్నాయి.

News September 4, 2025

వరిలో ఉల్లికోడు నివారణకు సూచనలు

image

నారుమడిలో 160 గ్రాముల కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను విత్తనం మొలకెత్తిన 10 – 15 రోజులప్పుడు వేయాలి. నాటేముందు నారు వేర్లను క్లోరిఫైరిఫాస్ (2ml/లీటరు నీటికి) ద్రావణంలో 12 గంటలు ఉంచి నాటితే ఉల్లికోడు నుంచి పంటను కాపాడుకోవచ్చు.
☛ నాటిన 10 నుంచి 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేయాలి. పైపాటుగా లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ (లేదా) క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ కలిపి పిచికారీ చేయాలి.

News September 4, 2025

వర్షాకాలంలో పాడి పశువులకు ఇబ్బందులు

image

వానాకాలంలో నేల చిత్తడిగా మారి గుంతల్లో, మురుగు కాల్వల్లో ఈగలు, దోమలు వృద్ధి చెందుతాయి. ఇవి పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. దీని వల్ల పశువుల శరీరంపై పుండ్లు పడటంతో పాటు అవి రక్తహీనతకు గురవుతాయి. వీటిని వదిలించుకోవడానికి పశువులు తోక, చెవులను ఊపుతూ అసహనానికి గురవుతాయి. దీని వల్ల మేత సరిగా మేయవు. ఫలితంగా పాల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడుతుంది. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

News September 4, 2025

వర్షాలు – పాడి పశువుల విషయంలో జాగ్రత్తలు

image

పశువుల షెడ్ చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చిత్తడి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఉదయం, సాయంత్రం పశువుల పాకలో ఎండు పిడకలు, వేపాకుతో పొగబెట్టాలి. సాయంత్రం పశువుల శరీరంపై వేపనూనె రాయాలి. సీజన్‌కు తగినట్లుగా టీకాలు వేయించాలి. అవకాశాన్ని బట్టి పశువుల పాకలకు దోమ తెరలను ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల పశువుల పాకలోకి దోమలు, ఈగలు ప్రవేశించే అవకాశం ఉండదు.

News September 4, 2025

తన వర్గాన్ని విస్తరించే పనిలో కవిత!

image

TG: BRSకు, MLC పదవికి రాజీనామా చేసిన కవిత తన ప్రధాన అనుచరులతో నిన్న రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. జాగృతి SM ప్రతినిధులతో సమావేశం అయ్యారని, కొందరు BRS కార్యకర్తలు కూడా ఆమెను కలిసినట్లు సమాచారం. ఉద్యమం సమయంలో యాక్టివ్‌గా ఉండి, BRSలో ప్రాధాన్యం దక్కని నేతలను జాగృతిలో చేరాలని ఆమె కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇవాళ ఆమె మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసే అవకాశముంది.

News September 4, 2025

నేడు ఇవి దానం చేస్తే చాలా మంచిది!

image

బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచి, లోకాలను కాపాడిన వామనుడి జయంతి నేడు. దీన్నే కేరళలో ‘ఓనం’గా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన వామనుడికి ప్రత్యేక పూజలు చేసి, పేదలకు బియ్యం, పెరుగు, చక్కెర వంటి ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ప్రశాంతమైన జీవితం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News September 4, 2025

వినాయకుడి ముందు గుంజీలు తీయడం వెనుక ఉన్న శాస్త్రీయత

image

వినాయకుని సమక్షంలో గుంజీలు తీస్తే బుద్ధి వికసనం అవుతుందని పెద్దలు చెబుతుంటారు. దీని వెనుక శాస్త్రీయత కూడా ఉంది. గుంజీలు తీసే క్రమంలో మనం చెవుల తమ్మెలు పట్టుకుంటాం. అప్పుడు ఆ సున్నితమైన భాగాలపై ఒత్తిడి కలుగుతుంది. దీని ద్వారా మెదడులోని నరాలు చురుగ్గా పనిచేస్తాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. అందుకే విద్యార్థులు ఇలా చేయాలని పెద్దలు చెబుతారు. ఇది మన సంప్రదాయంలో దాగి ఉన్న విజ్ఞానం.

News September 4, 2025

గణపతి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు?

image

ఓనాడు విష్ణువు సుదర్శన చక్రాన్ని బాల గణేశుడు మింగేస్తాడు. దాన్ని తిరిగి ఇవ్వాలని విష్ణుమూర్తి వినాయకుడి ముందు గుంజీలు తీస్తాడు. అది చూసి లంబోదరుడికి నవ్వాగదు. ఈక్రమంలోనే వినాయకుడి నోటి ద్వారా బయటకు వచ్చిన సుదర్శన చక్రాన్ని తీసుకెళ్లిపోతాడు విష్ణువు. అలా వినాయకుడి ముందు గుంజీలు తీసే సంప్రదాయం మొదలైంది. గణపతి సమక్షంలో గుంజీలు తీస్తే కోరిన కోరికలు తీరుతాయన్న విశ్వాసం ఏర్పడింది.

News September 4, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన అమిత్ మిశ్రా

image

టీమ్ ఇండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 42 ఏళ్ల మిశ్రా తన 25 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడారు. IPLలో అత్యధిక వికెట్లు (174) తీసిన ఏడో బౌలర్‌గా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో మూడు హ్యాట్రిక్స్ తీసిన ఏకైక బౌలర్ ఇతడే కావడం విశేషం.