news

News April 21, 2025

JEE MAINS.. ఒకే గ్రామంలో 40 మంది పాస్!

image

సాధారణంగా ఓ గ్రామంలో ఒకరో, ఇద్దరో JEE మెయిన్స్‌లో ఉత్తీర్ణులవుతుంటారు. కానీ, బిహార్‌లోని పట్వటోలి అనే గ్రామంలో ఏకంగా 40 మంది మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో గ్రామంలో ఉచితంగా కోచింగ్ ఇస్తోన్న ‘వృక్ష సంస్థాన్’ నుంచి 28 మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఇంటికో ఇంజినీర్ ఉండటం విశేషం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రతిచోట ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

News April 21, 2025

విద్యార్థుల ఫోన్ నంబర్లకే EAPCET ఫలితాలు

image

TG: ఈఏపీసెట్ ఫలితాలను విద్యార్థుల ఫోన్ నంబర్లకే పంపాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. అప్లికేషన్ సమయంలో రిజిస్టర్ చేసుకున్న నంబర్‌కు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ, మే 2, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి 3.05 లక్షల మంది విద్యార్థులు EAPCET రాయనున్నారు. పరీక్షల అనంతరం 10 రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశముంది.

News April 21, 2025

త్వరలోనే బోనస్ డబ్బులు విడుదల: ఉత్తమ్

image

TG: పెండింగ్‌లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులు త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు మహోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందో స్థానిక బీజేపీ ఎంపీ అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి శాఖపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా అదనంగా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని విమర్శించారు.

News April 21, 2025

SMలో ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ అస్సలు నమ్మకండి: పోలీసులు

image

TG: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చని ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో కనిపించే వీడియోలు, స్క్రీన్ షాట్లు నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ఫ్రీగా ట్రేడింగ్ క్లాసెస్ ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. ఎవరైనా లింక్ పంపించి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరితే తిరస్కరించండి’ అని పోలీసులు ట్వీట్‌లో పేర్కొన్నారు.

News April 21, 2025

హిందీకి వ్యతిరేకంగా పోరాడండి: ఉదయనిధి

image

కేంద్రం NEET, NEP పేరుతో తమిళ విద్యావ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని తమిళనాడు Dy.CM ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావమే తమిళ భాషతో జరిగిందని చెన్నైలోని ఓ కళాశాలలో జరిగిన సభలో ప్రసంగించారు. 1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో ఎంతోమంది నిస్వార్థంగా పోరాడి తమిళ భాషను రక్షించారని, ఇప్పుడు ఆ బాధ్యత తీసుకొని హిందీకి వ్యతిరేకంగా నిరసన చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

News April 21, 2025

BIG BREAKING: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

image

పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన ఆయన 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రిలో చేరి, ఆ తర్వాత కోలుకున్నారు. పోప్ మృతితో యావత్ క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది.

News April 21, 2025

రూ.500 నోటుపై BIG WARNING

image

మార్కెట్లో నకిలీ రూ.500 నోట్లు చలామణి అవుతున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్(RESERVE) అనే చోట E అక్షరం బదులు A ముద్రించారని వెల్లడించింది. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఈ రూ.500 నోటుపై ఈ తప్పును గమనించలేరని పేర్కొంది. ఈ విషయంపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేశామని వివరించింది.
SHAREiT

News April 21, 2025

సిద్ధివినాయక ఆలయంలో మస్క్ తల్లి పూజలు

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తల్లి మాయె మస్క్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆమె ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కాగా తాను రాసిన ‘ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్’ పుస్తకాన్ని రాజ్‌కమల్ బుక్స్ హిందీలోకి అనువదించింది. ఆ పుస్తకం విడుదల కోసం ఆమె భారత్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

News April 21, 2025

పూజా ఖేడ్కర్‌కు సుప్రీం ఆదేశాలు

image

తప్పుడు ధ్రువపత్రాలతో IASకు ఎంపికైన పూజా ఖేడ్కర్ కేసు విచారణ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 2న ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో విచారణ సరిగ్గా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. కాగా ఆమె ధ్రువపత్రాల విషయం తెలిసి శిక్షణలో ఉండగానే UPSC తొలగించింది.

News April 21, 2025

TGలో ‘రోహిత్ వేముల చట్టం’ తేవాలి.. CMకు రాహుల్ గాంధీ లేఖ

image

తెలంగాణలో ‘రోహిత్ వేముల చట్టం’ తేవాలని CM రేవంత్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. దళిత విద్యార్థులు కుల వివక్షను ఎదుర్కోకుండా, వారి హక్కుల పరిరక్షణ కోసం ఈ చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఇటీవల దీనిపై కర్ణాటక CM సిద్ధరామయ్యకూ రాహుల్ లెటర్ రాశారు. కాగా HCU విద్యార్థి రోహిత్ వేముల 2016లో సూసైడ్ చేసుకోగా, కుల వివక్ష వేధింపులే కారణమని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.