news

News April 15, 2025

సీఎల్పీ భేటీ ప్రారంభం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సీఎల్పీ మీటింగ్ ప్రారంభం అయింది. డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై చర్చిస్తున్నారు. భూభారతి, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలకు అవగాహన కల్పించడంపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ మీటింగ్‌కు వివేక్, రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్ గైర్హాజరయ్యారు.

News April 15, 2025

రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

AP: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు CM చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.789 కోట్లతో హైకోర్టు భవనం నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిని ఎల్-1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటు, పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణ ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

News April 15, 2025

BREAKING: విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు

image

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విజయవాడ సీపీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది.

News April 15, 2025

ఈ నెలాఖరుకు 15వేల తొట్టెల నిర్మాణం: పంచాయతీరాజ్ శాఖ

image

AP: వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు 15వేల తొట్టెలను నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ఉపాధి హామీ పథకం కింద రూ.60 కోట్ల వ్యయంతో ఈ నెలాఖరుకు నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ఉపాధి హామీ కార్మికులకు, క్షేత్ర స్థాయి సిబ్బందిని పవన్ అభినందించారు.

News April 15, 2025

ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు: కిషన్ రెడ్డి

image

TG: తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. అయితే తమిళనాడులో ఎన్డీఏను పునరుద్ధరించామని, తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. భూముల అమ్మకంలో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పోటీ పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

News April 15, 2025

నిమిషం పాటు UPI ఆగిపోతే?

image

ఆన్‌లైన్ పేమెంట్స్ పెరిగిపోవడంతో వరుస UPI అంతరాయాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. గత 18 రోజుల్లోనే బ్యాంక్స్ వల్ల 2, NPCI వల్ల 2 సార్లు UPI మొరాయించింది. ఇలా చేయడం వల్ల సెకనుకు 7వేలు, నిమిషానికి 4 లక్షలు, పది ని.లకు 40 లక్షల లావాదేవీలు ఆగిపోతున్నట్లు ‘మనీకంట్రోల్’ పేర్కొంది. దేశ వాణిజ్యానికి UPI ప్రాథమిక చెల్లింపు మార్గంగా మారిన నేపథ్యంలో ఇలాంటి అంతరాయాలకు కళ్లెం వేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

News April 15, 2025

‘భూభారతి’ పోర్టల్ ఎలా ఉందంటే?

image

తెలంగాణలో ఇక ‘ధరణి’ స్థానంలో ‘భూభారతి’ పోర్టల్ ఉండనుంది. ఇందులో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ROR కరెక్షన్, నాలా, అప్పీల్ & రివిజన్, ఇతరాలు ఆప్షన్లున్నాయి. అదేవిధంగా ల్యాండ్ మార్కెట్ వాల్యూ, ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్, నిషేధిత భూములు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వివరాలు, ఈ-చలాన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. గ్రామస్థాయిలో భూరికార్డుల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ <>వెబ్‌సైట్<<>> తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

News April 15, 2025

వివేకా హత్య కేసు.. నిందితుడు ఉదయ్‌కి సుప్రీం నోటీసులు

image

AP: వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ బెయిల్ రద్దు చేయాలంటూ YS సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో ఉదయ్ పాత్ర ఏమిటని CJI ధర్మాసనం ప్రశ్నించింది. హత్య జరిగాక గాయాలు కనపడకుండా కట్లు కట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిలో ఇతనూ ఉన్నాడని సునీత తరఫు లాయర్లు వెల్లడించారు. దీంతో ఉదయ్‌కి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

News April 15, 2025

IPL: నిన్న చెన్నై గెలిచినా..

image

ఈ సీజన్లో ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. గుజరాత్ మినహా టైటిల్స్ గెలిచిన జట్లేవీ ఈసారి టాప్-4లో లేవు. చెన్నై, SRH, RR, MI చివరి నుంచి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. చెన్నై నిన్న లక్నోపై గెలిచినా ఇంకా చివరిస్థానంలోనే ఉండటం గమనార్హం. ధోనీ సేన 7 మ్యాచుల్లో రెండు మాత్రమే గెలిచింది. నెట్ రన్‌రేట్ -1.276 ఆ జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. మరి ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరే 4 జట్లేవో కామెంట్ చేయండి.

News April 15, 2025

మళ్లీ అనారోగ్యం.. భేటీకి హాజరుకాకుండానే..

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఇవాళ సచివాలయంలో జరుగుతున్న క్యాబినెట్ భేటీలో పాల్గొనేందుకు వచ్చారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో మీటింగ్ మొదలుకాకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఆయన క్యాంప్ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ పవన్ పలుసార్లు అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరైన విషయం తెలిసిందే.