India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. బాల్ తగలడంతో తన ముఖానికి గాయమైనట్లు ఇన్స్టాలో ఫొటోను షేర్ చేశారు. అందులో కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో “Get well soon” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలో దారుణ ఘటన జరిగింది. గర్భిణీ సమయంలో ఓ మహిళ పచ్చి పాలను తాగేది. అందులోని బాక్టీరియా కారణంగా లిస్టీరియా అనే ఇన్ఫెక్షన్ సోకి నవజాత శిశువు మృతి చెందింది. అన్పాశ్చరైజ్డ్/ వేడి చేయని మిల్క్ తాగితే గర్భిణులు, శిశువులు, పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు గర్భస్రావం అవ్వొచ్చని అంటున్నారు. వేడి చేసిన పాలనే తాగాలని సూచిస్తున్నారు.

WPL ఫైనల్ 2026లో ఢిల్లీతో జరిగే మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ: లీ, షఫాలీ వర్మ, లారా, రోడ్రిగ్స్, కాప్, హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను, శ్రీ చరణి, నందని శర్మ
బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మందాన, జార్జియా, రిచా ఘోష్, రాధా యాదవ్, డి క్లర్క్, పూజ, అరుంధతి రెడ్డి, సయాలీ, శ్రేయాంక, లారెన్ బెల్.

TG: సీఎం రేవంత్ గతేడాది ప్రతినెలా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, నెలకు ఒక స్కామ్ చేశారని హరీశ్ రావు విమర్శించారు. జనవరిలో సివిల్ సప్లైస్, FEBలో ఎన్టీపీసీ ఫ్లై యాష్, మార్చిలో సాండ్, APRలో ఆర్టీసీ, మేలో అమృత్ టెండర్లు, జూన్లో ఫోర్త్ సిటీ, జులైలో లగచర్ల ల్యాండ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లు, సెప్టెంబర్లో HILTP, అక్టోబర్లో విద్యుత్, NOVలో సింగరేణి, డిసెంబర్లో KLSR స్కామ్ చేశారని ఆరోపించారు.

హిందూ సంప్రదాయంలో భార్యను భర్తకు ఎడమ వైపున ఉండాలని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం. పురాణాల ప్రకారం పరమశివుని శరీరంలో ఎడమ భాగం పార్వతీదేవి ఉంటారు. దీంతోపాటు గుండె ఎడమ వైపున ఉండటంతో భార్య భర్త మనసుకి దగ్గరగా ఉండాలని దీని అంతరార్థం. అందుకే పూజలు, శుభకార్యాల్లో భార్య భర్తకు ఎడమ వైపునే కూర్చుని ధర్మకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

AP: ‘TTD నెయ్యి కల్తీ’ కలకలం రేపుతుండగా ఇతర టెంపుల్స్లోనూ ఇలా జరిగిందేమోనన్న అనుమానాలు వస్తున్నాయి. శ్రీశైలం గుడికీ కల్తీ నెయ్యి వెళ్లిందని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా భోలే బాబా కంపెనీ ఏ రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి సరఫరా చేసింది? ఇలాంటి సంస్థలు ఇంకెన్ని ఉండొచ్చు అన్న చర్చ సాగుతోంది. దేవుడి నెయ్యికే ఇలా చేస్తే ఇక మార్కెట్లో అమ్మే దాన్ని ఎలా తయారు చేస్తున్నారో అన్న సందేహాలూ ఏర్పడుతున్నాయి.

AP: అనుమతి తీసుకోని ‘రాయలసీమ’ లిఫ్ట్ను NGT ఆపేస్తే దానిద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు YCP యత్నిస్తోందని CM CBN విమర్శించారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా తాము నీళ్లిస్తామని చెప్పారు. ‘గోదావరి నీరు వృథాగా పోతోంది. అందులోని 200 TMCలు నల్లమలసాగర్కు తరలిస్తాం. 2014-19 మధ్య నీటి సంఘాలు చేపట్టిన పనులకు గత GOVT బిల్లులు ఇవ్వలేదు. వాటిని చెల్లిస్తాం. ఇకపై పనులు వాటికే ఇస్తాం’ అని CM తెలిపారు.

ఈ జగత్తు శివమయం. ఆయన తన డమరుకనాథంతో భాషకు మూలమైన 14 మహేశ్వర సూత్రాలను సృష్టించాడు. అందుకే ఆయన ఆద్యంతరహితుడు. యోగ విద్యను జగత్తుకు అందించి, సప్తస్వరాలతో సంగీతానికి, తాండవంతో నృత్యానికి ప్రాణం పోశారు. అర్ధనారీశ్వర తత్వంతో స్త్రీ గౌరవాన్ని, నిరాడంబర జీవనంతో ఆధ్యాత్మికతను చాటిచెప్పారు. కులగోత్రాల భేదం లేని శివగోత్రంతో సామాజిక సమరసతను బోధించిన ఆయన సగుణ నిర్గుణ తత్వానికి ప్రతీకగా నిలిచిన విశ్వగురువు.

ప్రస్తుత కాలంలో చిన్నవయసులోనే ఎన్నో రోగాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో కూడా ఈ మధ్య కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తిస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలు నీరు ఎక్కువగా తాగడంతో పాటు హైసోడియం ఉన్న ఫుడ్స్ తినకుండా చూడాలి. అలాగే పిల్లలు ఎత్తుకు తగిన బరువుండేలా చూసుకోవాలి. ఫ్యామిలీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

RAC టికెట్పై ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి ఫుల్ ఛార్జ్ వసూలు చేయడం కరెక్ట్ కాదని పార్లమెంటరీ కమిటీ చెప్పింది. భారతీయ రైల్వేలలో సమయపాలన, ప్రయాణ సమయం, ఆపరేషన్లపై ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఛార్ట్ ప్రిపరేషన్ తర్వాత RACలో ఉండి, ఫుల్ బెర్త్ కేటాయించని ప్యాసింజర్లకు కొంత రిఫండ్ ఇచ్చే మెకానిజం తేవాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సూచించింది. ఒకే బెర్త్కు ఇద్దరి నుంచి ఫుల్ ఛార్జ్ వసూలు చేయకూడదని తెలిపింది.
Sorry, no posts matched your criteria.