India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఇంజినీరింగ్ థర్డ్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్లకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సమ్మర్ ఆన్లైన్ షార్ట్టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహించనుంది. CSE, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ విద్యార్థులు <

హీరో అంటే అందంగా, చొక్కా నలగకుండా స్టైల్గా కనిపించాలనే ధోరణి నుంచి మన హీరోలు బయటికొచ్చేశారు. రఫ్, రగ్గ్డ్ లుక్తో దుమ్మురేపుతున్నారు. పుష్పలో అల్లు అర్జున్, దేవరలో NTR, తండేల్లో నాగచైతన్య, దసరాలో నాని ఇదే తరహాలో కనిపించారు. లేటెస్ట్ మూవీస్ చూస్తే ‘పెద్ది’లో రామ్ చరణ్, ‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండ, ‘ప్యారడైజ్’లో నాని, ‘లెనిన్’లో అఖిల్ గుబురు గడ్డం, దుమ్ముకొట్టుకుపోయిన శరీరాలతో కనిపిస్తున్నారు.

TG: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు బోనస్ చెల్లించడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తుండగా, రూ.1500 కోట్లు అవసరం కానున్నాయి. కాగా NZB, కామారెడ్డి, NLG, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి.

TG: ప్రజల్లో వక్ఫ్ సవరణలపై అవగాహన కల్పించేందుకు గాను బీజేపీ నేటి నుంచి 12వ తేదీ వరకు ‘గావ్ చలో.. బస్తీ చలో’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తాము చేసిన సవరణల వల్ల పేద ముస్లింలకు కలిగే ప్రయోజనాల్ని నేతలు ప్రజల్లో తిరిగి వివరించనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కే. లక్ష్మణ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఇందులో భాగస్వాములు కానున్నారు.

అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా ఐరోపా సమాఖ్య 23 బిలియన్ డాలర్ల టారిఫ్లను అమెరికా ఉత్పత్తులపై విధించింది. వీటిని దశలవారీగా అమలుచేస్తామని తెలిపింది. ఈ నెల 15 నుంచి మొదటి దశ ప్రారంభమవుతుందని పేర్కొంది. మే 15న రెండో దశ, డిసెంబరు 1న మూడో దశ ఉంటుందని తెలిపింది. ట్రంప్ సుంకాలపై 90రోజుల వ్యవధి ఇవ్వకముందు ఈయూ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీల్లోని 59 ఉపకులాల్ని మూడు గ్రూపులుగా విభజించి, 15శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే గెజిట్ రానుంది. దీంతో ఇకపై విడుదలయ్యే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యాసంస్థల ప్రవేశాల్లో వర్గీకరణ అమలు కానుంది. కాగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగలు పోరాడుతున్నారు.

దేశ ఎగుమతులు FY25లో $820బిలియన్లుగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. FY24($778 బిలియన్లు)తో పోలిస్తే 6 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. ఇందులో వస్తు ఎగుమతులు $395.63 బిలియన్లు, సేవల ఎగుమతులు $354.90 బిలియన్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఎర్ర సముద్రంలో సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ వివాదం గల్ఫ్కు విస్తరించడంతో కొన్ని దేశాల్లో వృద్ధి నెమ్మదించినా భారత్ తన అంచనాలను అధిగమించినట్లు వివరించింది.

గుజరాత్ టైటాన్స్ కోచింగ్లో పెద్దగా హడావిడి ఉండదు. యజమానులూ కనిపించరు. పేపర్పై చూస్తే 5 మ్యాచులు గెలిచినా గొప్పే అన్నట్లుండే ఈ జట్టు గ్రౌండ్లోకి వచ్చేసరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. బట్లర్, గిల్, రషీద్, సిరాజ్ తప్పితే స్టార్లు లేని GT రూథర్ఫోర్డ్, సుదర్శన్, తెవాటియా వంటి బ్యాటర్లు, ప్రసిద్ధ్, ఇషాంత్, సాయి కిశోర్ వంటి బౌలర్లతోనే దుమ్మురేపుతోంది. ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉంది.

తన కెరీర్లో తొలిసారిగా హారర్ కామెడీ సినిమా చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్లో తెలిపారు. ‘‘ప్రజలకు భయమేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు. మరి పోలీసులే భయపడితే’ అన్న కాన్సెప్ట్తో హారర్ కామెడీ జానర్లో సినిమాను తీస్తున్నా. మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పోలీస్ స్టేషన్లో దెయ్యం’ అన్నది సినిమా టైటిల్. ‘చనిపోయిన వారిని చంపలేరు’ అన్నది ట్యాగ్లైన్’ అని RGV పేర్కొన్నారు.

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.