news

News April 15, 2025

రేపు జపాన్ పర్యటనకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 22 వరకు ఎనిమిది రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. టోక్యో, ఒసాకా, హీరోషిమా, మౌంట్ ఫుజి నగరాల్లో సీఎం పర్యటిస్తారు. పెట్టుబడుల కోసం ఆ దేశంలోని ప్రముఖ సంస్థలు, పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశం కానుంది.

News April 15, 2025

హార్వర్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన ట్రంప్

image

తమ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ 2.2 బి.డాలర్ల గ్రాంట్లు, 60 మి. డాలర్ల కాంట్రాక్టులను నిలిపివేసింది. యాంటీ సెమిటిజం (యూదు వ్యతిరేకత)పై యూనివర్సిటీ డిమాండ్లను తిరస్కరించడం, విద్యార్థి సంఘాలను నిషేధించడం, అడ్మిషన్ పాలసీలను మార్చడం వంటి షరతులకు అంగీకరించకపోవడం దీనికి కారణం. హార్వర్డ్ తమ స్వాతంత్ర్యం, రాజ్యాంగ హక్కులను కాపాడుకుంటామంటోంది.

News April 15, 2025

గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో పవన్, బాలయ్య సినిమాలు!

image

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బస్టర్‌గా నిలువగా మరోసారి యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్‌తో రాబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యా‌ణ్‌తో పక్కా యాక్షన్ ఫిల్మ్ తీసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇది 2026లో స్టార్ట్ అవ్వొచ్చని టాక్.

News April 15, 2025

రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులు

image

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఈడీ మరోసారి నోటీసులు పంపింది. హరియాణాలోని శిఖోపూర్ భూముల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈనెల 8న విచారణకు హాజరు కావాలని వాద్రాకు సమన్లు జారీ చేసింది. వాటికి ఆయన స్పందించకపోవడంతో మళ్లీ నోటీసులు పంపింది. ఆ భూముల వ్యవహారంలో వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి.

News April 15, 2025

బందీలను వదిలేస్తే కాల్పుల విరమణ: ఇజ్రాయెల్

image

గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీల్లో సగం మందిని విడుదల చేస్తే 45 రోజుల కాల్పుల విరమణకు సిద్ధమేనని ఇజ్రాయెల్ ఆఫర్ ఇచ్చింది. పాలస్తీనా మిలిటెంట్లు ఆయుధాలను వదిలేయాలని డిమాండ్ చేసింది. ఈజిప్ట్ మధ్యవర్తుల ద్వారా ఈ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు చేరవేసినట్లు హమాస్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనలపై సమీక్షిస్తున్నామని తెలిపింది. అయితే నిరాయుధీకరణకు ఒప్పుకోలేమని, దాడులను ప్రతిఘటించే హక్కు తమకుందని పేర్కొంది.

News April 15, 2025

రాష్ట్రంలో మరో పరువు హత్య?

image

AP: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చిత్తూరుకు చెందిన సాయితేజ, యాస్మిన్ బాను బీటెక్ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. అతడు ఎస్సీ కావడంతో యాస్మిన్ పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో వారు FEBలో పెళ్లి చేసుకున్నారు. యాస్మిన్ పేరెంట్స్ పదేపదే కాల్ చేయడంతో సాయితేజ ఆదివారం తన భార్యను పంపాడు. ఆ తర్వాతి రోజే యాస్మిన్ మరణించింది. పుట్టింటి వారే చంపేశారని సాయితేజ ఆరోపిస్తున్నాడు.

News April 15, 2025

ఆ విషయంలో ప్రభుత్వం తోక ముడవడం ఖాయం: తాటిపర్తి

image

AP: వైసీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, లిక్కర్ పాలసీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కౌంటరిచ్చారు. ‘అదానీ దగ్గర రూ.1,750 కోట్లు లంచం తీసుకుని విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారని మాపై విమర్శలు చేసి తోక ముడిచారు. ఇప్పుడు మద్యం కుంభకోణం అంటూ మరోసారి విష ప్రచారం చేసి తోక ముడుస్తారు’ అని Xలో పోస్టు చేశారు.

News April 15, 2025

దుబాయ్‌లో ఇద్దరు తెలుగోళ్లను నరికి చంపిన పాకిస్థానీ

image

TG: దుబాయ్‌లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు. నిర్మల్(D) సోన్‌కు చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్ (40), NZB(D)కు చెందిన శ్రీనివాస్ దుబాయ్‌లోని ఓ ఫేమస్ బేకరీలో పనిచేస్తున్నారు. అదే బేకరీలో పనిచేసే ఓ పాకిస్థానీ మత విద్వేషంతో వీరిద్దరిని దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

News April 15, 2025

రెండో రోజూ స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు!

image

బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 తగ్గి రూ.87,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 తగ్గి రూ.95,180 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ. 100 తగ్గి రూ.1,09,800గా ఉంది.

News April 15, 2025

‘కోపిష్టి’ ఇమేజ్‌ను మార్చుకునే పనిలో గోయెంకా!

image

IPLలో తమ జట్టు ఓటమి తర్వాత కెప్టెన్, ఆటగాళ్లకు <<15878257>>క్లాస్ తీసుకునే<<>> LSG ఓనర్ సంజీవ్ గోయెంకా ఈసారి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నిన్న థ్రిల్లర్ మ్యాచ్‌లో CSK చేతిలో ఓటమి తర్వాత కూడా నవ్వుతూ కనిపించారు. కెప్టెన్ పంత్ భుజంపై చేయి వేసి సరదాగా మాట్లాడారు. CSK సారథి ధోనీని హత్తుకుని అభినందించారు. దీంతో ఆయన తన ‘కోపిష్టి’ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.