news

News April 9, 2025

ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలి: KTR

image

పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లేఖ రాశారు. ‘ఇంధన ధరలు పెంచి మరోసారి ప్రజల వెన్ను విరిచేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ దేశాల్లోకెల్లా చమురు, LPG ధరలు INDలోనే ఎక్కువ. ముడి చమురు ధరలు అత్యల్ప స్థాయికి పడిపోతే ఇంధన ధరలు ఎందుకు పెంచారో చెప్పండి. ధరల పెంపును ఉపసంహరించుకోవాలని BRS డిమాండ్ చేస్తోంది’ అని KTR ట్వీట్ చేశారు.

News April 9, 2025

ట్రంప్ నిర్ణయం దెబ్బకొడుతుందా?

image

అధిక టారిఫ్స్ విధిస్తూ ప్రపంచ దేశాలు తమను దోచుకుంటున్నాయని US ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతున్నారు. అందుకే తామూ సుంకాలు పెంచామని స్పష్టం చేశారు. దీనివల్ల అమెరికాలో పరిశ్రమలు, ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ నమ్మకం. అయితే USలో బ్లూ కాలర్ జాబ్స్ చేసేందుకు యువత సిద్ధంగా లేరు. అక్కడి కంపెనీలు చీప్ లేబర్ కోసం చూస్తాయి. విదేశీయులు లేకుండా అగ్రరాజ్యం మనుగడ కష్టం. మరి ట్రంప్ నిర్ణయం ఎటు దారితీస్తుందో చూడాలి.

News April 9, 2025

రోనాల్డ్ రాస్‌కు భారీ ఊరట

image

TG: సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్‌కు క్యాట్ భారీ ఊరట కలిగించింది. ఆయన తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొద్ది రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను ఏపీకి కేటాయిస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో రోనాల్డ్ రాస్ కూడా ఉన్నారు. ఆయన మళ్లీ క్యాట్‌ను ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

News April 9, 2025

వక్ఫ్ చట్టం అమలు చేసేది లేదు: మమతా బెనర్జీ

image

వక్ఫ్ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులకు ఎటువంటి ప్రమాదం ఉండదని ముస్లిం ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మతం పేరిట విభజన రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే తాను అన్ని మతాల కార్యక్రమాలకు హాజరవుతానన్నారు. తనను కాల్చి చంపినా సమైక్యత నుంచి వేరు చేయలేరని తేల్చిచెప్పారు.

News April 9, 2025

ట్రంప్ టారిఫ్స్‌పై మోదీ మౌనం ఎందుకు?: రాహుల్

image

US టారిఫ్స్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ట్రంప్ టారిఫ్స్ విధిస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. “ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారు. అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారు. RSS, BJP రెండూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. క్రైస్తవుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని RSS పత్రిక ‘ఆర్గనైజర్’లో రాస్తున్నారు” అని పేర్కొన్నారు.

News April 9, 2025

సచిన్ తర్వాత మరో అద్భుతం ప్రియాంశ్: సిద్ధూ

image

CSKపై సంచలన ఇన్నింగ్స్ ఆడిన PBKS బ్యాటర్ ప్రియాంశ్ ఆర్యపై మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసలు కురిపించారు. ‘సచిన్ తర్వాత మరో అద్భుతాన్ని ఇప్పుడే చూస్తున్నా. CSK బౌలర్లను ఊచకోత కోయడం అమోఘం. ఇండియాకు సుదీర్ఘకాలం ఆడే సత్తా ప్రియాంశ్‌కు ఉంది. ఓడిపోతుందనుకున్న పంజాబ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొని ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం సాధారణ విషయం కాదు’ అని ఆయన కొనియాడారు.

News April 9, 2025

అమెరికాపై 84% టారిఫ్.. చైనా ప్రకటన

image

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ ముదురుతోంది. తాజాగా అమెరికా వస్తువులపై 84% సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అంతకుముందు ఇది 34%గా ఉండేది. చైనాపై ట్రంప్ ప్రభుత్వం 104% టారిఫ్స్ విధించడంతో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.

News April 9, 2025

అగ్ని ప్రమాదం.. మార్క్ శంకర్ ఫొటో వైరల్

image

సింగ‌పూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. ఆ పిల్లాడికి సంబంధించిన లేటెస్ట్ ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం మార్క్‌కు జనరల్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. పవన్‌తోపాటు ఆయన భార్య అన్నా లెజ్నోవా దగ్గరుండి బాబును చూసుకుంటున్నారు. మరో మూడు రోజులపాటు ఆ చిన్నారి ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.

News April 9, 2025

ఆదాయం పెంచేలా పని చేయండి.. CM ఆదేశం

image

AP: సొంతంగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పని చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో తెలుసుకోవాలన్నారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని సూచించారు. నూతన ఎక్సైజ్ పాలసీ సక్సెస్ అయిందని, అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ.4,330 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

News April 9, 2025

కాకాణికి హైకోర్టులో షాక్

image

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. కాగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు.