India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత ఎగుమతులపై యూఎస్ టారిఫ్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికాకు ఎగుమతి చేస్తున్న అన్ని వస్తువులపై ఆ దేశం 26% సుంకాలు వసూలు చేయనుంది. దీంతో ఎగుమతిదారులపై ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుంది. ఇవాళ భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం సుంకాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా టారిఫ్స్తో ఇప్పటికే రోజుకు $2 బిలియన్ల కలెక్షన్లు వస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

AP: మాజీ సీఎం జగన్ కావాలనే హెలికాప్టర్లో ప్రయాణించలేదని, సాంకేతిక సమస్య ఉంటే పైలట్ ఎలా వెళ్లారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. జగన్వేనా ప్రాణాలు.. పైలట్వి కావా అని ఆమె నిలదీశారు. ‘వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు పెట్టుకున్నారు. జగన్ స్థాయికి తగ్గట్లు భద్రత ఏర్పాటు చేశాం’ అని ఆమె పేర్కొన్నారు.

గత రెండు రోజుల్లో జరిగిన 3 ఐపీఎల్ థ్రిల్లర్ మ్యాచ్లు అభిమానులకు మజానిచ్చాయి. 200కు పైగా పరుగులు చేసి ఆరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు పోరాడాయి. సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్లు తగ్గేదేలే అంటూ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొన్న RCB 221/5 స్కోర్ చేస్తే MI 209/9 పరుగులు చేసింది. నిన్న LSG విసిరిన 239 పరుగుల సవాల్కు KKR(234) దీటుగా బదులిచ్చింది. PBKS 219/6 స్కోర్ చేస్తే CSK 201/5 రన్స్ చేసింది.

తెలంగాణలో టెన్త్ ఫలితాల విడుదలకు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 7 నుంచి మొదలైన వ్యాల్యుయేషన్, ఈ నెల 15 లేదా 17వ తేదీతో ముగియనుంది. ఎలాంటి తప్పిదాలు లేకుండా మరోసారి పరిశీలన చేసి, ఆన్లైన్లో మార్కులు నమోదు చేయనున్నారు. అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

PBKS ప్లేయర్ మ్యాక్స్వెల్కు IPL యాజమాన్యం షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్ను అతని ఖాతాలో చేర్చింది. నిన్న CSKతో మ్యాచ్లో ఒక్క పరుగుకే ఔటైన అతను క్రికెట్ వస్తువులు, గ్రౌండ్ ఎక్విప్మెంట్ను దుర్భాషలాడినట్లు సమాచారం. ఇటీవల ఇషాంత్ శర్మకు సైతం ఇవే కారణాలతో ఫైన్, డీమెరిట్ పాయింట్ విధించారు. కాగా 4 డీమెరిట్ పాయింట్లకు ఒక మ్యాచ్ నిషేధం ఉంటుంది.

AP: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తన కొత్త ఇంటికి సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక వైపు E-9 రోడ్ పక్కన ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. మొత్తం 1,455 చ.గజాల విస్తీర్ణంలో జీ+1 పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సీఎం కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాగా గతేడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు 5 ఎకరాల స్థలం కొన్న విషయం తెలిసిందే.

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి 238 గురుకులాల్లో కోడింగ్ కోర్సులను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఈ శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకోసం యూకే ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాది మెయినాబాద్ పాఠశాలలో మాత్రమే కోడింగ్ ట్రైనింగ్ ఉండేదని, ఇకపై అన్ని గురుకులాల్లో అమలు చేస్తామన్నారు.

AP: శ్రీసత్యసాయి జిల్లాలో అక్కాచెల్లెళ్ల(మైనర్లు)తో ఈ నెల 10న పెళ్లికి సిద్ధమైన యువకుడికి పోలీసులు, ICDS అధికారులు షాకిచ్చారు. అతనితోపాటు ఇరు కుటుంబాలను పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాట వినకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో వివాహాన్ని నిలుపుదల చేశారు. ఇద్దరు యువతులతో పెళ్లికి సంబంధించిన వివాహ పత్రిక 3 రోజులుగా సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.

AP: మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇంటివద్దే పాస్పోర్ట్ సేవలు అందించేందుకు ‘మొబైల్ వ్యాన్’ను అధికారులు సిద్ధం చేశారు. ఈ వ్యాన్ ఏ రోజు రూట్లో ప్రయాణిస్తుందో వెబ్సైట్లో ఉంచుతారు. దాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకుంటే మీ ప్రాంతంలోనే సర్టిఫికెట్ల పరిశీలన, వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక పోస్టులో పాస్పోర్టు పంపుతారు.

నిన్న భారీ లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు నేడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చైనాపై టారిఫ్లను ట్రంప్ 104%కు పెంచడం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 వద్ద కొనసాగుతున్నాయి. జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టాప్ లూజర్.
Sorry, no posts matched your criteria.