news

News April 9, 2025

ఏడాది పాటు AU శతాబ్ది ఉత్సవాలు

image

AP: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. ఏప్రిల్ 26న ఉత్సవాలను ప్రారంభించి ఏడాది పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని ఏయూ వీసీ రాజశేఖర్‌తో మంత్రి లోకేశ్ సూచించారు. QS ర్యాంకింగ్స్‌లో టాప్-100లో AU ఉండేలా చూడాలని ఆదేశించారు. వర్సిటీల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.

News April 9, 2025

కమెడియన్ సప్తగిరి తల్లి కన్నుమూత

image

ప్రముఖ కమెడియన్, హీరో సప్తగిరి ఇంట్లో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి చిట్టెమ్మ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇవాళ తిరుపతిలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. దీంతో తోటి నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.

News April 9, 2025

SI సుధాకర్‌పై వైసీపీ శ్రేణుల ఆగ్రహం

image

AP: మాజీ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన <<16038250>>రామగిరి SI సుధాకర్‌పై<<>> YCP శ్రేణులు ఫైరవుతున్నాయి. ఆయన టీడీపీ కోసమే పనిచేస్తున్నారనే దానికి ఈ పొలిటికల్ విమర్శలే నిదర్శనమని పేర్కొంటున్నాయి. టీడీపీ నుంచి గుంతకల్ అసెంబ్లీ సీటుకు పోటీ అంటూ గతంలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను, లోకేశ్, అచ్చెన్న, సత్యకుమార్ తదితర మంత్రులతో ఆయన దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నాయి. ఇదేనా నీ నిజాయితీ అని ప్రశ్నిస్తున్నాయి.

News April 9, 2025

BREAKING: తైవాన్‌లో భూకంపం

image

తైవాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 మాగ్నిట్యూడ్ నమోదైంది. భూకంప ధాటికి రాజధాని తైపీలో భవనాలు షేక్ అయ్యాయి. 73 కి.మీ లోతులో భూమి కంపించిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. నష్ట తీవ్రతపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వివిధ దేశాల్లో వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపాల ధాటికి వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే.

News April 9, 2025

రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్.. రేపటి నుంచే

image

TG: రిజిస్ట్రేషన్ల కోసం గంటలకొద్దీ వెయిట్ చేయకుండా, దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. రేపటి నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను అమలు చేయనుంది. రోజుకు 48 స్లాట్‌ల చొప్పున అందుబాటులో ఉంటాయి. ఇంటి నుంచే registration.telangana.gov.inలో స్లాట్ బుక్ చేసుకుని వెళితే 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

News April 9, 2025

రేషన్ షాపుల ద్వారా చిరు ధాన్యాల సరఫరా: నాదెండ్ల

image

AP: జూన్ నుంచి 40వేల GOVT స్కూళ్లు, 4వేల హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్ షాపుల ద్వారా చిరు ధాన్యాల సరఫరా, రైతు బజార్లలో చౌక ధరల దుకాణాల ఏర్పాటుపై కేంద్రంతో చర్చించినట్లు తెలిపారు. ఉజ్వల యోజన కింద రాష్ట్రంలో ఉన్న 9.65L లబ్ధిదారులను 65.40 లక్షలకు పెంచేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. దీనివల్ల ఏటా ₹587Cr రాయితీ అందుతుందని చెప్పారు.

News April 9, 2025

ఈ విధ్వంసకర ఆటగాడికి ఏమైంది?

image

ఆండ్రీ రస్సెల్.. T20 క్రికెట్‌లో విధ్వంసకర ఆటగాడు. ఒంటిచేత్తో మ్యా‌చ్‌లను మలుపుతిప్పే మేటి ఆల్‌రౌండర్. ఇదంతా గతేడాది వరకు. IPL-2025లో KKR తరఫున బ్యాటింగ్‌కు దిగిన 4 మ్యాచ్‌ల్లో 4,5,1,7 స్కోర్లతో ఘోరంగా విఫలమయ్యారు. 2024 JUL నుంచి ENG టూర్‌, ది హండ్రెడ్, CPL, ILT20, BPL, IPL‌లో మొత్తం 33 మ్యాచ్‌ల్లో 15 Avgతో 387 రన్స్ చేశారు. 5 మ్యాచ్‌ల్లో 3 ఓటములతో కష్టాల్లో ఉన్న KKRకు రస్సెల్ ఫామ్ ఎంతో కీలకం.

News April 9, 2025

పొలిటికల్ ఎంట్రీపై రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు

image

సామాజిక సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందని, ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదనుకుంటానని నటి రేణూ దేశాయ్ వెల్లడించారు. రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చినా పిల్లల కోసం వదులుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాలిటిక్స్ తన జాతకంలో ఉన్నప్పటికీ విధిరాతకు వ్యతిరేకంగా వెళ్తున్నట్లు చెప్పారు. ఏదైనా పార్టీలో చేరితే తప్పకుండా చెబుతానని, దాన్ని రహస్యంగా దాచలేమని పేర్కొన్నారు.

News April 9, 2025

రాష్ట్రానికి త్వరలో కొత్త మద్యం బ్రాండ్లు

image

TGలో కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు మద్యం కంపెనీలు పోటీపడుతున్నాయి. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ప్రకటనతో 604 రకాల బ్రాండ్లు సరఫరా చేసేందుకు 92 కంపెనీలు అప్లై చేసుకున్నాయి. వీటిలో 331 కొత్తవి, 273 ఫారిన్ బ్రాండ్లున్నాయి. ప్రస్తుతం 6 కంపెనీలే లిక్కర్ సరఫరా చేస్తున్నాయి. గుత్తాధిపత్యం లేకుండా కొత్త కంపెనీలను ఎంపిక చేయాలని సర్కార్ యోచిస్తోంది. త్వరలో ఈ బ్రాండ్లు మార్కెట్లోకి రానున్నాయి.

News April 9, 2025

‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో శ్రేయస్ అయ్యర్

image

టీమ్ ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు నామినేట్ అయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చిలో మూడు మ్యాచులు ఆడిన ఆయన 57.33 సగటుతో 172 రన్స్ చేశారు. అయ్యర్‌తో పాటు న్యూజిలాండ్ స్టార్స్ రచిన్, డఫీ ఉన్నారు. మహిళల క్రికెట్లో జార్జియా వాల్(Aus), సదర్లాండ్(Aus), చేతన ప్రసాద్(UAE) ఉన్నారు.