news

News April 15, 2025

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. sensex 1,579 పాయింట్లు, nifty 469 పాయింట్ల లాభంతో ట్రేడ్ ప్రారంభించాయి. ట్రంప్ టారిఫ్స్‌కు బ్రేక్, యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగియడం, రెపో రేటు తగ్గుదలతో లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం sensex 76,737 పాయింట్లు, nifty 23,298 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, టెలికాం షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి.

News April 15, 2025

యూరిన్ ఆపుకుంటున్నారా?

image

బిజీగా ఉండటం, వాష్‌రూమ్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మూత్ర విసర్జనను ఆపుకుంటూ ఉంటాం. ఇది తరుచూ జరిగితే మూత్రాశయం సాగి కండరాలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని, కిడ్నీలపై భారం పెరిగి వాటి పనితీరు దెబ్బతింటుందంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. సరిపడా నీళ్లు తాగుతూ ఎప్పటికప్పుడు మూత్రవిసర్జన చేయాలని సూచిస్తున్నారు.

News April 15, 2025

జపాన్‌లో రికార్డు స్థాయిలో తగ్గిన జనాభా!

image

జపాన్‌‌లో ‘యువశక్తి’ విషయంలో సంక్షోభం కొనసాగుతోంది. 2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయింది. 2023తో పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల జనాభా తగ్గింది. మరోవైపు జననాల రేటు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నా.. యువత వివిధ కారణాల వల్ల వివాహం, పిల్లల విషయంలో ఆలస్యం చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే జపాన్ అత్యల్ప బర్త్ రేట్‌ను నమోదు చేసింది.

News April 15, 2025

సూడాన్‌లో కాల్పులు.. 300 మంది మృతి

image

సూడాన్‌లో ఇటీవల <<16082587>>పారామిలటరీ RSF జరిపిన కాల్పుల్లో<<>> మృతుల సంఖ్య 300 దాటినట్లు UN హ్యుమానిటీ ఏజెన్సీ వెల్లడించింది. వీరిలో 10 మంది ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కాల్పుల భయంతో 16వేల మంది జామ్జామ్‌ వలస శిబిరాన్ని వీడినట్లు సమాచారం. దాడులను UN చీఫ్ గుటెర్రస్ ఖండించారు. శత్రుత్వాన్ని వీడి ప్రజలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు.

News April 15, 2025

దర్శక నటుడు స్టాన్లీ కన్నుమూత

image

కోలీవుడ్ దర్శకుడు, నటుడు ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ‘పుదుకొట్టయిరుందు శరవణన్’, ‘ఏప్రిల్ మంత్’, ఈస్ట్‌కోస్ట్ రోడ్’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే స్టాన్లీ పలు తమిళ హిట్ సినిమాల్లోనూ నటించారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీలో ఆయన చివరిసారిగా కనిపించారు.

News April 15, 2025

టీటీడీలో 2 వేల మంది మా వాళ్లే: భూమన

image

AP: టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమవారేనని YCP నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీలో జరిగే పరిణామాలపై వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని చెప్పారు. ‘గోశాలలో ఆవుల మృతిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా. నేను విడుదల చేసిన ఫొటోలు తప్పని తేలితే నాపై చర్యలు తీసుకోవచ్చు. నిజమైతే టీటీడీ ఈఓ, ఛైర్మన్‌ను తొలగించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News April 15, 2025

అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్ని సరసన ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు ఖరారైందని, మరో హీరోయిన్‌గా దిశా పటానీని తీసుకుంటారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ దాదాపు రూ.800 కోట్లతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News April 15, 2025

SC వర్గీకరణపై 5 రోజుల్లో ఆర్డినెన్స్.. ఆ వెంటనే DSC?

image

AP: జాతీయ SC కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 5 రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి, ఆ తర్వాత 3 రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలో విద్యాశాఖ మెగా DSC నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశముంది. జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM CBN ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 15, 2025

త్రివిక్రమ్‌తో వెంకటేశ్ మూవీ ఫిక్స్?

image

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామా సబ్జెక్ట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని సమాచారం. కాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అట్లీ ప్రాజెక్ట్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అట్లీ-బన్నీ మూవీ పూర్తయ్యేందుకు దాదాపు ఏడాదికిపైగా పడుతుంది. ఈ గ్యాప్‌లో వెంకీతో త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసే ఛాన్సుంది.

News April 15, 2025

Intermediate: సంస్కృతంతో తెలుగుకు దెబ్బేనా?

image

TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని రెండోభాషగా ప్రవేశపెట్టాలన్న ఇంటర్మీడియట్ అధికారుల నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల్లో 90% మంది విద్యార్థులు ఎక్కువ మార్కులు వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకుంటున్నారు. టెన్త్ వరకు తెలుగు చదివిన విద్యార్థులు ఇంటర్‌లో సంస్కృతాన్ని తీసుకుంటే తెలుగు భాషకు తీవ్ర నష్టం జరుగుతుందని విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై మీ కామెంట్?