India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

AP: జల్జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి భారీగా నిధులు రానున్నాయి. గతంలో ఆగిపోయిన సుమారు రూ.23 వేల కోట్ల పనులకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కేంద్ర వాటాగా రూ.13 వేల కోట్లు విడుదల కానున్నాయి. 2027 నాటికి ప్రతి ఇంటికీ సురక్షిత కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ కేంద్రంతో చర్చలు జరపడంతో నిధుల విడుదలకు లైన్ క్లియరైంది.

వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు ముడతలు వస్తుంటాయి. వీటిని తొలగించడంలో ఎగ్ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఒక ఎగ్ వైట్, కలబంద గుజ్జు, పంచదార పొడి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే ముఖం అందంగా మెరిసిపోతుంది.

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.

AP: కొన్ని నెలలుగా ధరలు లేక ఇబ్బందులు పడుతున్న కొబ్బరి రైతులకు ఊరట కలుగుతోంది. TGలో మేడారం జాతర, వరుస శుభకార్యాల ప్రభావంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. వారం కిందటి వరకు వెయ్యి కాయల ధర రూ.15-16వేలు ఉండగా ఇప్పుడు రూ.19-20 వేలకు చేరింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి రోజూ 70 లారీల సరకు ఎగుమతి అవుతోంది. ఇక కురిడీ కొబ్బరిలో పెద్ద రకం రూ.32,500, చిన్నకాయ రూ.29వేల వరకు పలుకుతోంది.

AP: విద్యుత్ శాఖలో ఏఈ స్థాయి ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం మోపిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా, ఎన్నికల లోపు తగ్గించే దిశగా అడుగులు వేస్తోందన్నారు.

మొక్కజొన్న పంట 31 నుంచి 60 రోజుల లోపు ఉండి పైరులో 6-10% మొక్కలను కత్తెర పురుగు రెండో దశ లార్వా ఆశించినట్లు గమనిస్తే రసాయన మందులతో సస్యరక్షణ చేపట్టాలి. లీటరు నీటికి 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG లేదా స్పైనోశాడ్ 45% SC 0.3ml కలిపి.. చేతి పంపుతో మొక్క సుడులలో పడే విధంగా పిచికారీ చేసి కత్తెర పురుగును నియంత్రించవచ్చు. ఈ రసాయనాల పిచికారీ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహా తప్పక తీసుకోండి.

న్యూఢిల్లీలోని <

TG: రాష్ట్రంలో ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లపై QR కోడ్ ముద్రించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. కోడ్ను స్కాన్ చేయగానే పరీక్షా కేంద్రం లొకేషన్ చూపిస్తుంది. గతేడాది EAPCET హాల్ టికెట్లపై మాత్రమే QR కోడ్ ఇచ్చారు. ఈసారి <<18619737>>టెన్త్<<>> సహా ఇతర పరీక్షలకూ అమలు చేయనున్నారు. కాగా ఈసెట్-2026 షెడ్యూల్ నిన్న విడుదలైంది. FEB 9-APR 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 15న పరీక్ష ఉండనుంది.
Sorry, no posts matched your criteria.