news

News September 4, 2025

నేడు ఇవి దానం చేస్తే చాలా మంచిది!

image

బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచి, లోకాలను కాపాడిన వామనుడి జయంతి నేడు. దీన్నే కేరళలో ‘ఓనం’గా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన వామనుడికి ప్రత్యేక పూజలు చేసి, పేదలకు బియ్యం, పెరుగు, చక్కెర వంటి ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ప్రశాంతమైన జీవితం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News September 4, 2025

వినాయకుడి ముందు గుంజీలు తీయడం వెనుక ఉన్న శాస్త్రీయత

image

వినాయకుని సమక్షంలో గుంజీలు తీస్తే బుద్ధి వికసనం అవుతుందని పెద్దలు చెబుతుంటారు. దీని వెనుక శాస్త్రీయత కూడా ఉంది. గుంజీలు తీసే క్రమంలో మనం చెవుల తమ్మెలు పట్టుకుంటాం. అప్పుడు ఆ సున్నితమైన భాగాలపై ఒత్తిడి కలుగుతుంది. దీని ద్వారా మెదడులోని నరాలు చురుగ్గా పనిచేస్తాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. అందుకే విద్యార్థులు ఇలా చేయాలని పెద్దలు చెబుతారు. ఇది మన సంప్రదాయంలో దాగి ఉన్న విజ్ఞానం.

News September 4, 2025

గణపతి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు?

image

ఓనాడు విష్ణువు సుదర్శన చక్రాన్ని బాల గణేశుడు మింగేస్తాడు. దాన్ని తిరిగి ఇవ్వాలని విష్ణుమూర్తి వినాయకుడి ముందు గుంజీలు తీస్తాడు. అది చూసి లంబోదరుడికి నవ్వాగదు. ఈక్రమంలోనే వినాయకుడి నోటి ద్వారా బయటకు వచ్చిన సుదర్శన చక్రాన్ని తీసుకెళ్లిపోతాడు విష్ణువు. అలా వినాయకుడి ముందు గుంజీలు తీసే సంప్రదాయం మొదలైంది. గణపతి సమక్షంలో గుంజీలు తీస్తే కోరిన కోరికలు తీరుతాయన్న విశ్వాసం ఏర్పడింది.

News September 4, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన అమిత్ మిశ్రా

image

టీమ్ ఇండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 42 ఏళ్ల మిశ్రా తన 25 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడారు. IPLలో అత్యధిక వికెట్లు (174) తీసిన ఏడో బౌలర్‌గా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో మూడు హ్యాట్రిక్స్ తీసిన ఏకైక బౌలర్ ఇతడే కావడం విశేషం.

News September 4, 2025

NIRF.. దేశంలో టాప్ విద్యాసంస్థలు ఇవే

image

కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2025 ర్యాంకులను విడుదల చేసింది.
*యూనివర్సిటీలు: IIS బెంగళూరు, JNU ఢిల్లీ
*ఇంజినీరింగ్: IIT మద్రాస్, IIT ఢిల్లీ, IIT బాంబే
*మెడికల్: ఢిల్లీ ఎయిమ్స్
*మేనేజ్‌మెంట్: IIM అహ్మదాబాద్, IIM బెంగళూరు
*ఒవరాల్ కేటగిరీ: IIT మద్రాస్, IIS బెంగళూరు, IIT బాంబే, IIT ఢిల్లీ

News September 4, 2025

యూరియా లభ్యతపై మంత్రి లోకేశ్ ఆరా

image

AP: రైతుల ముసుగులో YCP చేస్తున్న కుతంత్రాలను తిప్పికొట్టాలని మంత్రులకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. క్యాబినెట్‌‌కి ముందు మంత్రులతో అల్పాహార భేటీలో పాల్గొన్నారు. జిల్లాల్లో యూరియా సమస్య ఉందా అని ఆరా తీశారు. తగినంత యూరియా ఉందని మంత్రులు తెలిపారు. తెలంగాణ రాజకీయాలపైనా మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జి మంత్రులు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌లు నిర్వహించాలని లోకేశ్ సూచించారు.

News September 4, 2025

రేపు రేషన్ షాపులు బంద్: డీలర్ల సంక్షేమ సంఘం

image

TG: ఈ నెల 5న రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల బంద్‌కు తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం చెల్లించాలని, అలాగే కమీషన్ పెంచాలని డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 5 నెలల కేంద్ర కమీషన్ వెంటనే విడుదల చేయాలని, అలాగే ఇక నుంచి రాష్ట్ర కమీషన్, కేంద్ర కమీషన్ వేర్వేరుగా కాకుండా ఒకేసారి చెల్లించాలని కోరుతున్నారు.

News September 4, 2025

కిమ్ జోంగ్ ఉన్ వారసురాలు ఈమేనా?

image

ఉ.కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆ దేశాన్ని ఆయన చిన్న కూతురు ‘కిమ్ జూ ఏ’ పాలించే అవకాశముందని ద.కొరియా నిఘా సంస్థ పేర్కొంది. గత మూడేళ్లుగా ఆమె కిమ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వయసు 10yrs ఉంటుందని, స్కూల్లో చేరకుండా ఇంట్లోనే చదువుతోందని, గుర్రపు స్వారీ, ఈత, స్కీయింగ్‌లో నైపుణ్యం కలిగి ఉందని సమాచారం. ఆమెకు ఓ సోదరుడు, ఒక సోదరి ఉన్నట్లు టాక్.

News September 4, 2025

పిఠాపురం టీచర్లకు పవన్ కానుక

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని ఉపాధ్యాయులకు చిరు కానుక అందజేశారు. SEP 5న గురుపూజోత్సవం నేపథ్యంలో టీచర్లకు వస్త్రాలు బహుమతిగా పంపారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 2 వేలమంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు, జూ.కాలేజీల లెక్చరర్లకు బహుమతులు పంపారు. మహిళా టీచర్లకు చీరలు, పురుషులకు షర్టు-ప్యాంటు అందజేశారు.

News September 4, 2025

GST తగ్గింపు.. సామాన్యులు ఖుషీ!

image

8 ఏళ్ల తర్వాత GST తగ్గడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ సామగ్రి, నోట్ బుక్స్, పెన్స్, ఏసీలు, టీవీలు, బైకులు, కార్లు.. ఇలా రోజువారీ జీవితంలో ఉపయోగపడే చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్ను రేట్లు అమల్లోకి వస్తాయి. అప్పటివరకు ఆగి ఆ తర్వాత కొనేందుకు సామాన్యులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. GST తగ్గింపుపై మీ కామెంట్?