news

News January 29, 2026

ఏ దేవుళ్లకు ఏయే పుష్పాలు సమర్పించాలంటే?

image

విష్ణువుకు తులసి దళాలు ప్రీతికరం. మహాలక్ష్మికి తామరలు, ఎర్రని పూలు ఎంతో ఇష్టం. శివుడిని మారేడు దళాలతో పూజించాలి. సూర్యుడు, గణపతిని తెల్లజిల్లేడు పూలతో పూజిస్తే మంచి జరుగుతుంది. గాయత్రీ దేవికి మల్లె, మందార, కదంబ పుష్పాలు ఇష్టం. పూజకు వాడే పూలు తాజాగా, శుచిగా ఉండాలి. వాసన చూసినవి లేదా నేల రాలినవి వాడకూడదు. ఇలా ఇష్టమైన పూలతో దైవాన్ని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

News January 29, 2026

‘బంగారంతో బీ కేర్‌ఫుల్’ వార్తల్లో నిజం లేదు: సజ్జనార్

image

TG: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని SMలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని CP సజ్జనార్ తెలిపారు. అలాంటి పోస్టులను షేర్ చేయొద్దని సూచించారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ పూర్తిగా సురక్షితమని హామీ ఇచ్చారు. అనుమానం వస్తే 100కు కాల్ చేసి శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.

News January 29, 2026

విజయ్ బూస్ట్ మాకు అవసరం లేదు: తమిళనాడు కాంగ్రెస్

image

కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తామంటూ TVK అధినేత విజయ్ తండ్రి SA చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు పీసీసీ చీఫ్ సెల్వపెరుంతగై సెటైర్లు వేశారు. ‘విజయ్ నుంచి మాకు బూస్ట్ అవసరం లేదు. మా క్యాడర్‌ను చూడండి. వారు ఇప్పటికే బూస్ట్‌తో ఉన్నారు. మా నేత రాహుల్ గాంధీ అవసరమైన బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌వీటా ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ కామెంట్లపై విజయ్, TVK ఇంకా స్పందించలేదు.

News January 29, 2026

‘ఫేర్‌వెల్ సాంగ్’.. నా మరణానంతరమే రిలీజ్: జాకీ చాన్

image

కుంగ్ ఫూ స్టార్ జాకీ చాన్ తన అభిమానులతో ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన మరణం తర్వాతే విడుదల చేయాలని ఒక ప్రత్యేక పాట రికార్డ్ చేయించుకున్నట్లు తెలిపారు. బీజింగ్‌లో జరిగిన తన కొత్త సినిమా వేడుకలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ పాట ప్రపంచానికి తానిచ్చే చివరి సందేశమని ఆయన తెలిపారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో భద్రపరిచి, అభిమానులకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

News January 29, 2026

నేతన్నలకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్

image

AP: మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. హ్యాండ్లూమ్‌ (మగ్గం)కు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ద్వారా 4 లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు. దీనివల్ల నెలకు రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.

News January 29, 2026

చామంతి మొక్కల తలల కత్తిరింపుల వల్ల లాభమేంటి?

image

చామంతి సాగులో అధిక దిగుబడి రావాలంటే మొక్కల తలల కత్తిరింపు తప్పక చేపట్టాలి. పొలంలో మొక్కలన్నీ 30 సెంటీమీటర్లు దాకా పెరిగిన తర్వాత వాటి తలలను తుంచేయాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా పూల దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్కల తలలను తుంచాక నిపుణుల సూచనలతో నత్రజని, పొటాష్ ఎరువులను తగిన మోతాదులో అందిస్తే నాణ్యమైన పువ్వులను పొందవచ్చు.

News January 29, 2026

NIMHANSలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

బెంగళూరులోని <>NIMHANS<<>> 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 31వరకు దరఖాస్తును పోస్ట్ చేయాలి. ఉద్యోగాన్ని బట్టి MCh న్యూరోసర్జరీ, DM న్యూరాలజీ, MD అనస్థీషియా/MS అనస్థీషియా, MD రేడియాలజీ/MS రేడియాలజీ, MD న్యూక్లియర్ మెడిసిన్, MD సైకియాట్రీ, MA/MSc సైకాలజీ, MD ఫిజియాలజీ, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nimhans.ac.in

News January 29, 2026

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

image

దివంగత అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్‌ను మహారాష్ట్ర Dy.CMగా ప్రతిపాదించాలని NCP యోచిస్తోంది. పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారు. అజిత్ మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలు పూర్తైన తర్వాతే శరద్ పవార్ నేతృత్వంలోని NCP(SP)లో విలీనంపై చర్చలు జరగొచ్చని తెలుస్తోంది.

News January 29, 2026

కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్: మంత్రి సవిత

image

AP: తిరుమల వేంకన్న ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని జగన్ కల్తీ చేయించారని మంత్రి సవిత మండిపడ్డారు. పామాయిల్, ఇతర కెమికల్స్‌తో లడ్డూ కల్తీ జరిగిందని, నెయ్యి లేదని సిట్ స్పష్టం చేసిందన్నారు. జంతుకొవ్వు లేదు కదా అని చేసిన తప్పు కప్పిపుచ్చుకోడానికి YCP బ్యాచ్ బుకాయిస్తోందని ఫైరయ్యారు. కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్ అని, కల్తీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.

News January 29, 2026

మేడిగడ్డ బ్యారేజీకి కేంద్రం రెడ్ అలర్ట్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ తీవ్ర ముప్పులో ఉందని కేంద్రం తేల్చింది. ఈ మేరకు దాన్ని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ-1లో చేర్చింది. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ లోక్‌సభకు తెలిపింది. లోపాలను తక్షణమే సరిచేసి బ్యారేజీని పటిష్టం చేయాలని NDSA సిఫార్సు చేసిందని పేర్కొంది. మన్నిక పెరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. ఖజూరి (UP), బొకారో (ఝార్ఖండ్) ఇదే కేటగిరీలో ఉన్నాయి.