news

News April 15, 2025

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బిగ్ షాక్?

image

TG: ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫీజులపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా 52% నుంచి 84% ఫీజులు పెంచాలని ప్రభుత్వంపై కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.

News April 15, 2025

కారు డోర్ లాకింగ్ మర్చిపోకండి!

image

TG: మీరు ఏ పనిలో ఉన్నా పిల్లల్ని ఓ కంట గమనిస్తూనే ఉండాలనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిన్న తన్మయశ్రీ(5), అభినయశ్రీ(4) కారులో ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మేనమామకు పెళ్లి కుదిరిందని వెళ్లిన పిల్లలు కారులో ఆడుకోవడానికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడూ కారును లాక్ చేసి ఉంచండి. ముఖ్యంగా చిన్న పిల్లలున్న పేరెంట్స్ ఇది మర్చిపోవద్దు.

News April 15, 2025

TCSలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు!

image

ఈ ఆర్థిక సంవత్సరంలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని టీసీఎస్ నిర్ణయించినట్లు సమాచారం. 2024-25 మాదిరిగానే రిక్రూట్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. నేషనల్ క్వాలిఫయర్ టెస్టులో ప్రతిభ చూపిన వారిని ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాల్లో నియమించుకోనుంది. కాగా FY2024-25 చివరికి 6,07,979 మంది ఉద్యోగులు TCSలో ఉన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6,433 మంది మాత్రమే పెరిగారు.

News April 15, 2025

ఈనెల 22న టెన్త్ ఫలితాలు విడుదల?

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 22న రిజల్ట్స్ ప్రకటించే అవకాశముంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 6.50L మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఇటీవల ఇంటర్ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే.

News April 15, 2025

దేశంలో తగ్గుతున్న డీజిల్ డిమాండ్

image

దేశంలో డీజిల్ డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 2022-2023లో దాని వినియోగంలో 12.1శాతం వృద్ధి కనిపించగా, 2024-25లో అది 2శాతానికి పడిపోయింది. వ్యవసాయ యంత్రాలు, డీజిల్ ట్రక్కుల వాడకం తగ్గడం.. ఈవీల వాడకం పెరగడమే దీనికి కారణంగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, పెట్రోల్ వినియోగం 7.5 శాతం పెరిగి 4 కోట్ల టన్నులకు, ఎల్పీజీ డిమాండ్ 5.6 శాతం పెరిగి 3.13 కోట్ల టన్నులకు చేరింది.

News April 15, 2025

నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

image

TG: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ టెట్) దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా ఫీజు నిర్ణయించారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే హెల్ప్‌డెస్క్(7093958881, 7093468882) ఈ నెల 15 నుంచి జులై 22 వరకు అందుబాటులో ఉంటుంది. టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

News April 15, 2025

నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమం చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేస్తారు. దాన్ని ఉపయోగించే విధానాన్ని ప్రజలకు వివరిస్తారు. ప్రస్తుతం 250కిపైగా సేవలు వాట్సాప్‌లో అందుతుండగా జూన్ నాటికి ప్రభుత్వం 500 సేవలకు విస్తరించనుంది.

News April 15, 2025

ధోనీ రికార్డుల మీద రికార్డులు

image

CSK కెప్టెన్ ధోనీ నిన్నటి LSG మ్యాచ్‌లో రికార్డుల మీద రికార్డులు నమోదు చేశారు. IPLలో 200డిస్మిసల్స్(స్టంపౌట్లు, క్యాచ్‌లు, రనౌట్లు) చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచారు. అలాగే లీగ్ ప్రారంభం నుంచి అత్యధిక ఇన్నింగ్సుల్లో (132) సిక్సర్లు బాదిన బ్యాటర్‌గానూ ఘనత సాధించారు. మరోవైపు IPLలో అత్యధిక సార్లు(18) POTM అవార్డ్ గెలిచిన 2వ ప్లేయర్‌గా రికార్డులకెక్కారు. ఈ లిస్టులో తొలి స్థానంలో రోహిత్ (19) ఉన్నారు.

News April 15, 2025

అమరావతిలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ!

image

AP: అమరావతి ప్రాంతంలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి పక్కనే దీనిని ఏర్పాటు చేస్తారని సమాచారం. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియాలు, స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలోనే 1.25 లక్షల మంది కెపాసిటీ గల భారీ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నారు.

News April 15, 2025

శబరిమలలో అయ్యప్ప లాకెట్ల విక్రయాలు ప్రారంభం

image

శబరిమల ఆలయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(TDB) అయ్యప్ప స్వామి బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. కోవెలలోని గర్భగుడిలో ఉంచి పూజించిన లాకెట్ల విక్రయాలను నిన్నటి నుంచి మొదలెట్టింది. అయ్యప్ప 2 గ్రాముల లాకెట్ ధర రూ,19,300, 4 గ్రాములైతే రూ.38,600, 8గ్రా. లాకెట్ ధరను రూ.77,200గా నిర్ణయించినట్లు దేవస్థానం తెలిపింది. కాగా తొలి లాకెట్‌ను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన AP భక్తుడికి అందజేశారు.