news

News April 15, 2025

RTCలో 3,038 పోస్టుల భర్తీ: సజ్జనార్

image

TG: ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీతో ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని చెప్పారు.

News April 15, 2025

నేడు క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి, సీఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చిస్తారని సమాచారం. అలాగే సీఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది.

News April 15, 2025

రషీద్ కోసం కూలీ పనులు చేసిన తండ్రి!

image

CSK తరఫున తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన <<16102730>>రషీద్‌<<>>ది గుంటూరు(D) పాతమల్లాయపాలెం. ఇతని తండ్రి బాలీషావలి HYDలో ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. అండర్-14లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడంతో రషీద్ ACAలో భాగమై మంగళగిరిలో ఉండాల్సి వచ్చింది. దీంతో బాలీషావలి ఉద్యోగం వదిలేసి అక్కడికి వెళ్లి రషీద్‌ను ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేవారు. సాధన లేనిరోజు కూలీ పనులకు వెళ్లేవారు. ప్రస్తుతం కుమారుడి ఘనతను చూసి సంతోషిస్తున్నారు.

News April 15, 2025

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

image

రేపటి నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30, మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30, జూన్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి రోజులున్నాయన్నారు. జూన్ 11 నుంచి జులై 12 వరకు ఆషాఢమాసంలో ముహూర్తాల్లేవని.. మళ్లీ JUL 25 నుంచి శ్రావణమాసంలో మంచిరోజులు ఉన్నాయన్నారు. కాగా APR 30న అక్షయ తృతీయ సందర్భంగా వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.

News April 15, 2025

ఆమిర్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి మూవీ?

image

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మూవీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. వంశీ చెప్పిన స్టోరీ లైన్‌కు ఆమిర్ ఫిదా అయి పూర్తి స్క్రిప్ట్ వినిపించాలని కోరినట్లు సమాచారం. దీంతో స్క్రిప్ట్‌ని డెవలప్ చేస్తున్న ఆయన త్వరలోనే హీరోకు చెప్ప‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఆమీర్ ఓకే చేస్తే దిల్ రాజు పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ నిర్మిస్తారని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.

News April 15, 2025

ALERT: నేటి నుంచి 3 రోజులు వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములతో వర్షం కురిసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 15, 2025

కంచ గచ్చిబౌలిపై మోదీ కామెంట్స్.. మంత్రుల కౌంటర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో అడవులను ధ్వంసం చేస్తోందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రులు కౌంటరిచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో తాము చెట్లు నరకలేదని, జంతువులను చంపట్లేదని స్పష్టం చేశారు. అడవులను పెంచి ప్రకృతిని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో అసలు అటవీ భూమి లేదని, బీజేపీ నేతలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని మరో మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.

News April 15, 2025

IPL: నేడు పంజాబ్, కోల్‌కతా మధ్య పోరు

image

IPLలో ఇవాళ PBKS, KKR తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 33 మ్యాచులు జరగ్గా KKR 21, PBKS 12 మ్యాచుల్లో నెగ్గాయి. గత 4 సీజన్లలో అయితే చెరో 4 విజయాలు దక్కించుకున్నాయి. గాయంతో ఫెర్గూసన్ దూరమవడం PBKSకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఆ జట్టు మాక్స్‌వెల్ నుంచి మంచి నాక్ ఆశిస్తోంది. అటు బెస్ట్ AVG, ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న KKR స్పిన్నర్లు పంజాబ్‌ బ్యాటర్లను కట్టడి చేసే అవకాశం ఉంది.

News April 15, 2025

నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం

image

TG: రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం ఇవాళ ఉ.11గంటలకు CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు పథకాలతో పాటు భూభారతి, SC వర్గీకరణ, BCలకు 42శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రజాప్రతినిధులకు CM దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న వివాదాలు, పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చించే అవకాశముంది.

News April 15, 2025

ఐక్యరాజ్య సమితిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి

image

డా.BR అంబేడ్కర్ జయంతిని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో నిర్వహించింది. UN ప్రధాన కార్యాలయం(న్యూయార్క్)లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నాయకులు హాజరయ్యారు. భారత్ తరఫున కేంద్ర‌మంత్రి రాందాస్ అథవాలే పాల్గొని అంబేడ్కర్ గొప్పతనాన్ని, ఆయన ఆశయ సాధనకు PM మోదీ చేస్తోన్న కృషిని వివరించారు. మరోవైపు అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ న్యూయార్క్ నగరం APR 14ను డా.భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్ దినోత్సవంగా ప్రకటించింది.