news

News April 15, 2025

IPL-2025: ఇప్పటి వరకు Highlights

image

* అత్యధిక పరుగులు: పూరన్ (357)
* అత్యధిక వికెట్లు: నూర్ అహ్మద్(12)
* అత్యధిక వ్యక్తిగత స్కోర్: అభిషేక్ శర్మ(141)
* అత్యధిక సిక్సులు: పూరన్(31)
* అత్యధిక ఫోర్లు: సాయి సుదర్శన్(31)
* శతకాలు: 3(ప్రియాన్ష్ ఆర్య, అభిషేక్, ఇషాన్ కిషన్)
* బెస్ట్ బౌలింగ్: మిచెల్ స్టార్క్(5-35)
* బెస్ట్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్: కరుణ్ నాయర్(222.50)
* టేబుల్ టాపర్: GT

News April 15, 2025

ఇలా పొదుపు చేస్తే.. ఆర్థిక సమస్యలకు చెక్!

image

ఉద్యోగమైనా, వ్యాపారం అయినా పొదుపు చేయకపోతే అనుకోకుండా వచ్చే ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేం. అందుకే నెలనెలా వచ్చే ఆదాయంలో 20 శాతం కచ్చితంగా పొదుపునకు కేటాయించాలి. మిగతా 80 శాతం డబ్బునే ఇతరత్రా ఖర్చులకు వాడాలి. అందులోనూ అనవసరమైన ఖర్చులున్నాయా? అని ప్రతినెలా చెక్ చేస్తూ వాటిని తగ్గించుకోవాలి. హంగులు, ఆర్భాటాలు, కోరికలు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.

News April 15, 2025

ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే అనర్థాలివే!

image

ప్రొటీన్‌‌ ఫుడ్ శరీరానికి మేలు చేసినా మోతాదుకు మించితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్ ఎక్కువైతే తీవ్రమైన దాహం కలిగి, ఫలితంగా తాగే నీటి వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. అలాగే, నోటి దుర్వాసనకూ ప్రొటీన్‌లోని ఆమ్లాలు కారణమవుతాయి. మరోవైపు మలబద్ధకం సమస్య కూడా వేధిస్తుంది. అధిక ప్రొటీన్‌ వల్ల శరీరంలో వేడి పెరిగి ఒళ్లు నొప్పులొస్తాయి.
NOTE: కేజీ శరీరబరువుకు 0.8గ్రా. ప్రొటీన్ అవసరం.

News April 15, 2025

బైడెన్ వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం: ట్రంప్

image

అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ పాలనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగి బైడెన్ అధ్యక్షుడు అవ్వడం వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైందన్నారు. ఈ యుద్ధానికి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయా దేశాల్లో మరణాలు, విధ్వంసం ఆపడానికి శ్రద్ధగా పని చేస్తున్నట్లు వివరించారు. అలాగే, బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ యుద్ధం పట్ల వ్యవహరించిన తీరును ఆయన ఎండగట్టారు.

News April 15, 2025

ధోనీ మరో రికార్డ్.. POTM అవార్డ్ నూర్‌కు ఇవ్వాల్సిందన్న మహీ

image

LSGతో మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 26 రన్స్ చేసిన ధోనీని POTM అవార్డ్ వరించింది. దీంతో IPL చరిత్రలో ఈ అవార్డ్ అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్‌(43yrs 281d)గా ఆయన నిలిచారు. గతంలో ఈ రికార్డ్ లెగ్ బ్రేక్ బౌలర్ ప్రవీణ్ తాంబే(43yrs 60d) పేరిట ఉండేది. మరోవైపు, ధోనీ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డ్ ఎందుకు ఇచ్చారు? నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని అన్నారు. అతను 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చారు.

News April 15, 2025

రాజధాని పనులు ఊపందుకుంటున్నాయి: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి పనులు ఊపందుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ‘రాజధానిలో ప్రస్తుతం 3 వేల మంది కార్మికులు, 500 యంత్రాలు పని చేస్తున్నాయి. ఈ నెలాఖరుకు 15 వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం’ అని వెల్లడించారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు.

News April 15, 2025

ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తాం.. ఈ అల్లర్లెందుకు?: మమత

image

వక్ఫ్ సవరణ బిల్లుపై WBలో ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో జరుగుతున్న అల్లర్లపై ఆ రాష్ట్ర CM మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘ఒకేసారి పుడతాం, ఒకేసారి మరణిస్తాం. అలాంటప్పుడు ఈ అల్లర్లెందుకు? ప్రతి మతం, కులానికి నిరసన తెలిపే హక్కు ఉంది. అలాగని శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. కొందరు వక్ఫ్ బిల్లు అంశంలో తప్పుదోవ పట్టిస్తున్నారు. వారిని నమ్మొద్దు’ అని ఆమె సూచించారు.

News April 15, 2025

తరుగు, తేమ పేరుతో మోసం చేస్తే చర్యలు: మనోహర్

image

AP: రైతులను ఇబ్బందిపెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు, తేమ కొలిచే యంత్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రతి ధాన్యపు బస్తానూ కొంటామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించారు. తరుగు, తేమ శాతం పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News April 15, 2025

AI రోబో తయారు చేసిన HYD పరిశోధకులు

image

TG: HYD సమీపంలోని వోక్సెన్ యూనివర్సిటీ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే రోబోను సృష్టించారు. మెదడు, కళ్లు, గుండె సంబంధిత సున్నితమైన సర్జరీలను కచ్చితత్వంతో చేయడంలో డాక్టర్లకు సాయపడేలా ఈ రోబోను రూపొందించారు. దీని విడి భాగాలను ప్రకృతిహితంగా నేచురల్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ తెలిపారు.

News April 15, 2025

మరో 15 రన్స్ చేసి ఉండాల్సింది: రిషభ్ పంత్

image

తాము ఇంకో 15 పరుగులు చేసి ఉండాల్సిందని LSG కెప్టెన్ రిషభ్ పంత్ అన్నారు. రన్‌రేట్ పెరుగుతున్న క్రమంలో ప్రతిసారీ వికెట్లు కోల్పోవడంతో అనుకున్న స్కోర్ చేయలేకపోయామని CSKతో ఓటమి తర్వాత తెలిపారు. మరోవైపు తాను బ్యాటింగ్‌లో నెమ్మదిగా లయ అందుకున్నట్లు చెప్పారు. పవర్ ప్లే‌లో బౌలింగ్ వేసే అంశంపై తాము దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ప్రతి మ్యాచ్ నుంచి సానుకూల అంశాలు తీసుకొని ముందుకు సాగుతామని పంత్ వివరించారు.