India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిన్న రాత్రి DCపై ముంబై సాధించిన విజయం వెనుక గొప్పదనాన్ని రోహిత్కు కట్టబెట్టడం సరికాదని మాజీ క్రికెటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ సలహాలు ఇచ్చారు కరెక్టే. కానీ ఎవరు ఎన్ని చెప్పినా దాన్ని మైదానంలో అమలు చేయాల్సింది కెప్టెనే. క్రెడిట్ అంతా రోహిత్కు ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా తేడా జరిగి మ్యాచ్ను ముంబై చేజార్చుకుని ఉంటే అందరూ హార్దిక్నే తిట్టి ఉండేవారు’ అని పేర్కొన్నారు.
AP: ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ, KGBV, APRJC, మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్, ఒకేషనల్ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన ఇంటర్ విద్యార్థులను మంత్రి లోకేశ్ సన్మానించనున్నారు. రేపు మ.2 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో 52 మందికి అవార్డులను అందించనున్నారు. వీరితో పాటు ఆరుగురు విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులనూ లోకేశ్ సన్మానించనున్నారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించనున్నారు.
బర్ధమాన్ జిల్లా(WB)లోని ఓగ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్కు ఇప్పటి వరకూ పేరే లేదు. తొలుత రాయ్నగర్ అని ఉండేది. అయితే 2008లో ట్రాక్ని కొద్ది మేర పెంచడంతో సమీపంలోని రైనా అనే గ్రామంలో స్టేషన్ను పునర్నిర్మించారు. దీంతో రైనా పేరుతో రైల్వేస్టేషన్ ఉండాలని గ్రామస్థులు నిరసన చేశారు. రెండు గ్రామాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రైల్వేశాఖ ఇప్పటివరకూ స్టేషన్కు పేరే పెట్టలేదు.
దిగ్గజ బ్రిటిష్ నటి జీన్ మార్ష్(90) కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా డిమెన్షియాతో బాధపడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని సన్నిహితులు తెలిపారు. బ్రిటిష్ డ్రామా ‘అప్స్టెయిర్స్, డౌన్స్టెయిర్స్’కి 1975లో ఆమె ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2012లో జీన్కు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ గౌరవం దక్కింది.
AP: కడప(D) ఒంటిమిట్ట(M) నడింపల్లి వద్ద బస్సు-బొలెరో ఢీకొన్న ఘటనలో జీపులోని ముగ్గురు, నెల్లూరు(D) రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద కారు ఢీకొట్టడంతో వడ్లు ఎండబెట్టుకుంటున్న ఇద్దరు రైతులు చనిపోయారు. TG జనగామ(D) రాఘవపూర్ వద్ద లారీని కారు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు చనిపోయారు. అటు RR(D) దామరగిద్ద వద్ద కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు.
AP: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం ఈ చట్టం రూపొందించిందని పిటిషన్లో పేర్కొంది. పార్లమెంట్లో కూడా ఆ పార్టీ బిల్లును వ్యతిరేకించింది.. కాగా మైనార్టీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ ఇటీవల హామీ ఇచ్చారు.
IPL: ముంబై చేతిలో ఓటమితో బాధలో ఉన్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా BCCI రూ.12 లక్షల ఫైన్ విధించింది. ఈ సీజన్లో జరిమానా పడిన ఆరో కెప్టెన్గా నిలిచారు. ఈ జాబితాలో పరాగ్, శాంసన్(RR), పాండ్య(MI), పంత్(LSG), పాటీదార్(RCB) ఉన్నారు. కాగా 3సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేస్తే కెప్టెన్పై ఓ మ్యాచ్ బ్యాన్ విధించే నిబంధనను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే.
PNBకి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన మెహుల్ ఛోక్సీని బెల్జియం అధికారులు <<16091808>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్ లేఖ రాసిందని అక్కడి ప్రభుత్వం నిర్ధారించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం ఛోక్సీపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. కాగా గతంలో అతడి కోసం జారీ చేసిన ఇంటర్పోల్ రెడ్ నోటీసులు డిలీట్ కాగా ఈడీ, సీబీఐ మాత్రం వేట ఆపలేదు.
TG: వివాదాస్పదమైన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై ఈనెల 16న విచారణ జరగనుంది. ఆ భూములు HCU పరిధిలోనివంటూ ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. దీన్ని సుమోటోగా స్వీకరించిన SC తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆ ప్రాంతంలో చెట్లను కొట్టొద్దని CSను ఆదేశించింది. ఈనేపథ్యంలో భూములు ప్రభుత్వానివేనంటూ సర్కార్ అఫిడవిట్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది.
భారత కుబేరులకు ఈ ఏడాది కలిసిరావట్లేదు. 2025లో ఇప్పటివరకు అంబానీ, అదానీ, నాడార్ తదితర సంపన్నులు మొత్తంగా రూ.2.63లక్షల కోట్ల సంపద కోల్పోయారు. ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్తో ఈక్విటీ మార్కెట్ల నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు తప్పుకోవడం, ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ తదితర అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. అత్యధికంగా శివ్ నాడార్ రూ.90 వేల కోట్లు, ఆ తర్వాత అదానీ రూ.55 వేల కోట్లు, అంబానీ రూ.30 వేల కోట్లు నష్టపోయారు.
Sorry, no posts matched your criteria.