India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏకంగా 15 చోట్ల హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధన్, వేములవాడ, గద్వాల, అలియాబాద్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఛైర్పర్సన్ ఎన్నికకు ఇండిపెండెంట్ల ఓట్లు, అలాగే ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కీలకం కానున్నాయి.

రుణాలు తీసుకున్న వారి ఇళ్లలో విషాదం చోటుచేసుకున్నప్పుడు లేదా శుభ కార్యాలు జరిగే సమయాల్లో లోన్ రికవరీ చేయొద్దని RBI బ్యాంకులను ఆదేశించింది. ‘రుణ రికవరీ విధానం అన్ని బ్యాంకుల్లో ఒకేరీతిన ఉండాలి. నిర్దేశిత రూల్స్ ప్రకారం ఏజెంట్ల నియామకం చేపట్టాలి. రికవరీ కోసం వారు చేసే ఫోన్ కాల్స్ను రికార్డు చేయాలి’ అని పేర్కొంది. రుణగ్రహీతల డేటాను ఉద్యోగులు, ఏజెంట్లు దుర్వినియోగం చేయకుండా చూడాలని సూచించింది.

TG: నల్గొండ జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను సొంతం చేసుకుంది. అటు సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, నేరేడుచర్లలోనూ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తిరుమలగిరిలో BRS గెలిచింది.

AP: స్కూళ్లలో సదుపాయాల కోసం ₹7500 CR ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. ‘18 అంశాల్లో స్కూళ్లకు రేటింగ్ ఇవ్వగా 40% 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి. 84.3% 3వ తరగతి, 62.5% 5వ తరగతి, 47% 8వ తరగతి విద్యార్థులు 2వ క్లాస్ పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. YCP హయాంలో అద్భుతంగా చేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంతలా ఎందుకు పడిపోయాయి’ అని ప్రశ్నించారు. వీటిని మెరుగుపరుస్తామని చెప్పారు.

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది.

జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్ 12న మదనపల్లెలో జన్మించారు. ఆలిండియా రేడియో పరీక్షల్లో ఉత్తీర్ణురాలై 1960లో రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్, ఎడిటర్గా పనిచేశారు. కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖల్లో కీలకపదవులతో పాటు పరిశోధనలు, పుస్తక రచనలో అనేక అవార్డులు వరించాయి. ఆంధ్రానైటింగేల్ బిరుదు పొందారు. ఈమెకు తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషల్లో ప్రావీణ్యం, బోధనలో అనుభవం ఉంది.

T20WCలో పసికూన జింబాబ్వే ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చేలా ఉంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు 5 ఓవర్లలో 34 రన్స్కే 4 వికెట్లు కోల్పోయారు. ఇంగ్లిస్, హెడ్, గ్రీన్, టిమ్ డేవిడ్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్రీజులో మ్యాక్స్వెల్, రెన్షా ఉన్నారు. ఆసీస్ విజయానికి 90 బంతుల్లో 136 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలల బారసాల వేడుక ఫొటోను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. వీరికి శివరామ్, అన్వీరా దేవిగా నామకరణం చేసినట్లు తెలిపారు. తన పేరు (శివ శంకర వరప్రసాద్), రామ్ చరణ్ పేర్ల కలయికతో ‘శివరామ్’ అని, కనకదుర్గమ్మ ఆశీస్సులతో భయం లేని తత్వాన్ని, దైవిక రక్షణను సూచించేలా అన్వీరా దేవి పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ చిన్నారులపై అందరి దీవెనలు ఉండాలని కోరారు.

TG: హుజూరాబాద్ BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులకు 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాలకే పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ సాధించిన కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది.

TG: నిర్మల్ జిల్లా భైంసాలో మున్సిపల్ ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ 26 వార్డులు ఉండగా బీజేపీ, కాంగ్రెస్, BRS పార్టీలు ఇంకా ఖాతా తెరవలేదు. MIM 8, స్వతంత్ర అభ్యర్థులు 5 వార్డులు గెలుచుకున్నారు. పూర్తి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. అటు నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.