news

News April 14, 2025

హంతకుడి ఎన్‌కౌంటర్.. ఈ ‘లేడీ సింగం’ గురించి విన్నారా?

image

కర్ణాటక హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై రేప్ అటెంప్ట్ చేసి చంపిన నిందితుడిని <<16090804>>ఎన్‌కౌంటర్<<>> చేసింది PSI అన్నపూర్ణ. ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని చూసి ఆమె ఏడ్చేశారు. నిందితుడు రితేశ్ కోసం వేట కొనసాగించారు. లొంగిపోమని కోరగా రితేశ్ పోలీసులపై రాళ్లు రువ్వాడు. దీంతో అన్నపూర్ణ రితేశ్‌పై కాల్పులు జరపగా రెండు బుల్లెట్లు తగిలి అతడు హతమయ్యాడు. అందరూ అన్నపూర్ణను లేడీ సింగం అంటూ ప్రశంసిస్తున్నారు.

News April 14, 2025

40ల్లో జాబు ఎందుకు పోతుందో వివరించిన CEO

image

40, ఎర్లీ 50 వయసుండే ప్రొఫెషనల్స్ జాబులు కోల్పోవడంపై బాంబే షేవింగ్ కంపెనీ CEO శాంతను దేశ్‌పాండే స్పందించారు. ఎక్కువ సీనియారిటీ, అధిక జీతాల కారణంగానే ఉద్యోగాలు కోల్పోతారన్నారు. బాధ్యతలు ఎక్కువగా ఉండే వయసులో జాబ్ పోవడంపై విచారం వ్యక్తం చేశారు. జాబ్ పోకుండా ఉండాలంటే.. AIలో నైపుణ్యం పెంచుకోవడం, ఎక్కువ పొదుపు, ఎంటర్‌‌పెన్యూరియల్ మైండ్‌సెట్ పెంచుకోవాలన్నారు.

News April 14, 2025

USతో టారిఫ్ వార్.. చైనా ఎగుమతులపై తీవ్ర ఒత్తిడి!

image

US- చైనా టారిఫ్ వార్ మరింత తీవ్రమయ్యేలా ఉంది. ప్రస్తుతం చైనా ఎగుమతి రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ఆ దేశ కస్టమ్స్ విభాగం ప్రతినిధి తెలిపారు. ఒత్తిడున్నా పరిస్థితులు విధ్వంసకరంగా లేవన్నారు. US ప్రతీకార సుంకాల వల్ల ‘నింగి విరిగి నేలకూలదు’ అని వ్యాఖ్యానించారు. చైనా వైవిధ్యభరిత మార్కెట్‌ను సృష్టిస్తోందన్నారు. చైనాలో దేశీయ మార్కెట్ డిమాండ్ కూడా అధికంగా ఉంటుందని తెలిపారు.

News April 14, 2025

ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు: తమన్నా

image

విజయ్ వర్మ‌తో బ్రేకప్ వార్తలు వస్తున్న వేళ తమన్నా పెళ్లిపై స్పందించారు. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రేమను వ్యాపారంగా చూస్తే సమస్యలొస్తాయని <<15926914>>మిల్కీ బ్యూటీ,<<>> రిలేషన్‌షిప్‌లో సంతోషం, బాధలను స్వీకరిస్తేనే సంతోషంగా ఉంటామని విజయ్ ఇటీవల కామెంట్ చేశారు. దీంతో వీరు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.

News April 14, 2025

ఏపీలో రూ.5,001 కోట్లతో LG కొత్త ప్లాంట్!

image

AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో LG కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. మే 8న దీని ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గతేడాది NOVలో 247 ఎకరాలను కేటాయించింది. రూ.5,001 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్లాంటులో ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లను తయారు చేయనున్నారు. 1,495 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి కల్గనుంది.

News April 14, 2025

నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు: మంత్రులు

image

TG: ఇకపై విద్య, <<16093517>>ఉద్యోగాల్లో<<>> SC వర్గీకరణ అమలు అవుతుందని మంత్రులు దామోదర, ఉత్తమ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. SC వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి వస్తుందని, నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే అన్ని జాబ్ నోటిఫికేషన్లకు SC వర్గీకరణ వర్తిస్తుందన్నారు. SC వర్గీకరణ గురించి చాలా పార్టీలు మాట్లాడాయని, కానీ దాని కోసం ప్రయత్నం చేయలేదని అన్నారు.

News April 14, 2025

రేపు CLP సమావేశం.. 4 అంశాలపై చర్చ

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం రేపు సమావేశం కానుంది. శంషాబాద్ నోవాటెల్‌లో ఉ.11 గంటల నుంచి జరగనున్న ఈ భేటీలో 4 అంశాలపై చర్చించనున్నారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, SC-ST వర్గీకరణపై చర్చ జరగనుంది. ఈ మేరకు పార్టీ MLAలు, MLCలకు ప్రభుత్వ విప్‌లు సమాచారం ఇచ్చారు.

News April 14, 2025

రాజ్యాంగాన్ని కాంగ్రెస్ బుజ్జగింపు సాధనంగా వాడింది: మోదీ

image

కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని బుజ్జగింపు సాధనంగా వాడిందని ప్రధాని మోదీ విమర్శించారు. హస్తం పార్టీ తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా దేశ అత్యున్నత శాసనాన్ని తుంగలో తొక్కేదని నొక్కిచెప్పారు. రాజ్యాంగంతో దేశంలో సామాజిక న్యాయం జరుతుందని భావించిన అంబేడ్కర్ ఆశయాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. హరియాణాలో హిసార్ విమానాశ్రయంలో ప్లాంటును PM ప్రారంభించారు.

News April 14, 2025

నెలకు సగటున 15 ఆవులు మరణిస్తాయి: శ్యామలారావు

image

AP: భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ వ్యాఖ్యలు చేశారని టీటీడీ ఈవో శ్యామలారావు విమర్శించారు. 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేశారన్నారు. ప్రతి నెలా సగటున 15 ఆవులు మరణిస్తాయని, 3 నెలల్లో 43 మృతి చెందాయని తెలిపారు. దాతలు ఇచ్చిన ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయని చెప్పారు. మరణించిన ఆవులకు పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవమన్నారు.

News April 14, 2025

2021-24 మధ్య గోశాలలో అక్రమాలు: TTD EO

image

AP: తిరుమలలోని గోశాల నిర్వహణలో మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని టీటీడీ ఈవో శ్యామలారావు ఆరోపించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలను దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. అలాగే స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. రూ.3 కోట్ల విలువైన సరకులకు రూ.25 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.