India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు DGP హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. IPL బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

1603 : బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775 : కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977 : భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

మార్చి 24, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.28 గంటలకు
ఇష: రాత్రి 7.40 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

☛ తిథి: బహుళ దశమి రా.12.34 వరకు తదుపరి ఏకాదశి
☛ నక్షత్రం: ఉత్తరాషాఢ రా.12.31 వరకు తదుపరి శ్రవణం
☛ శుభ సమయం: ఉ.6.15-ఉ.6.51, రా.7.27-రా.7.51
☛ రాహుకాలం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
☛ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
☛ దుర్ముహూర్తం: మ.12.24-మ1.12, మ.2.46-మ.3.34
☛ వర్జ్యం: ఉ.8.15 నుంచి ఉ.9.53 వరకు
☛ అమృత ఘడియలు: సా.6.00 నుంచి రా.7.38 వరకు

భారత మహిళలకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోస్టాఫీస్ సేవింగ్స్ పథకం MSSC. రూ.1000 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో కలిపి మొత్తం తీసుకోవచ్చు. అత్యవసరమైనప్పుడు డిపాజిట్లో 40శాతాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. పోస్టాఫీస్ అధికారిక వెబ్సైట్లో ఫామ్ లభిస్తుంది. ఈ నెలాఖరుకే పథకం ఆగిపోనుంది. మరిన్ని వివరాలకు సమీప పోస్టాఫీసును సంప్రదించవచ్చు. షేర్ చేయండి.

* KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్
* రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్
* TG: స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీం నోటీసులు
* 27న పోలవరానికి సీఎం చంద్రబాబు
* వారు కూడా దక్షిణ భాషలు అర్థం చేసుకోవాలి: పవన్
* ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ
* RRపై SRH విజయం, MIపై చెన్నై విక్టరీ
* బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS

AP: నియోజకవర్గాల పునర్విభజన వల్ల AP, TG, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని మాజీ ఎంపీ కేశినేని నాని అన్నారు. జనాభా ప్రాతిపదికన చేపట్టనున్న ఈ ప్రక్రియ న్యాయమైనదేనా? అని SMలో ప్రశ్నించారు. సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా అని ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజన జాగ్రత్తగా నిర్వహించకపోతే ఉత్తర-దక్షిణ విభేదాలు పెరుగుతాయని హెచ్చరించారు.

AP: అకాల వడగండ్ల వర్షాల కారణంగా పంట నష్టపోయి అనంతపురం(D)లో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై CM చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు. వర్షాలకు 4 జిల్లాల్లో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. దీంతో ప్రభుత్వ పరంగా వారికి సాయం అందించాలని CM ఆదేశించారు. నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందొద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.