news

News April 14, 2025

ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో మన వాటా 3.54%

image

ప్రపంచ వ్యాప్తంగా 2022లో 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగైతే, అందులో 95 లక్షల టన్నులతో భారతదేశం 3.54 శాతం వాటా కలిగి ఉందని నేచర్ జర్నల్‌లోని ఓ కథనం తెలిపింది. 8.15 కోట్ల టన్నుల చెత్త ఉత్పన్నంతో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతూనే ఉన్నా ప్రజల్లో ఆచరణ అంతంతమాత్రంగానే ఉంటోంది.

News April 14, 2025

కాంగోలో మళ్లీ అల్లర్లు.. 50 మంది మృతి

image

ఆఫ్రికా దేశం కాంగోలోని గోమాలో అల్లర్లు చెలరేగాయి. దీంతో దాదాపు 50 మంది చనిపోయారు. దీనికి రువాండా మద్దతుతో M23 రెబల్స్ చేస్తున్న దాడులే కారణమని సైన్యం ఆరోపించింది. తిరుగుబాటుదారుల చర్యల వల్ల శాంతి చర్చలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ‘గోమా’తోపాటు దేశంలో రెండో అతిపెద్ద నగరమైన బుకావు కూడా రెబల్స్ అధీనంలోనే ఉంది. మూడేళ్లుగా జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 7వేల మంది మరణించగా, 2.5M మంది వలస వెళ్లారు.

News April 14, 2025

IPL: చరిత్ర సృష్టించిన MI

image

ఢిల్లీతో మ్యాచ్‌లో విజయం సాధించిన MI ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200+ స్కోర్‌ చేసిన ప్రతిసారీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు వరుసగా 15 మ్యాచుల్లో ఇలా గెలిచింది. DC కూడా వరుసగా 13 సందర్భాల్లోనూ ఓడిపోలేదు. అయితే 200+ స్కోర్‌ను CSK 21 సార్లు డిఫెండ్ చేసుకోగా ఐదుసార్లు ఓడిపోవడం గమనార్హం. ఆ తర్వాత RCB(W-19, L-5), SRH(W-15, L-2) ఉన్నాయి.

News April 14, 2025

‘థగ్ లైఫ్’ పూర్తి.. KH237పై కమల్ ఫోకస్

image

మణిరత్నం డైరెక్షన్‌లో ‘థగ్ లైఫ్’ షూటింగ్ పూర్తవడంతో మరో చిత్రంపై కమల్ హాసన్ ఫోకస్ చేశారు. అన్బు-అరీవు దర్శకత్వంలో KH237 సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, జులై/ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం కమల్ తన బాడీ లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

News April 14, 2025

తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు

image

TG: 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా నేడు రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని CM రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డితో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మరోవైపు, సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉత్తమ్ తెలిపారు.

News April 14, 2025

టూవీలర్లలో హీరో.. కార్లలో మారుతి

image

టూవీలర్ల అమ్మకాల్లో హీరో మోటార్స్ ఇండియాలో టాప్‌లో దూసుకెళ్తోంది. డీలర్స్ అసోసియేషన్ ఫాడా డేటా ప్రకారం 2024-25లో ఆ కంపెనీ 54లక్షల బైకులను విక్రయించింది. 48లక్షల వాహనాల విక్రయాలతో హోండా రెండో స్థానంలో ఉంది. అలాగే, కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ అగ్రస్థానంలో ఉంది. 2024-25లో సుమారు 16.72లక్షల కార్లను అమ్మింది. ఇదే కంపెనీ గతేడాది 16.08లక్షల వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ 2వ ప్లేస్ దక్కించుకుంది.

News April 14, 2025

నేడు గుంటూరుకు సీఎం.. ‘P-4’ సభ్యులతో భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లా పొన్నెకల్లులో పర్యటించనున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా అక్కడున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో వర్చువల్ సమావేశంలో మాట్లాడతారు. తర్వాత P-4 కార్యక్రమంలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు.

News April 14, 2025

వేసవిలో ఈ జాగ్రత్తలు ముఖ్యం

image

ఎండాకాలంలో నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ప్రతిరోజూ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. మద్యం, కాఫీ, టీ, ధూమపానానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. మసాలాలు తగ్గిస్తే గ్యాస్‌ట్రబుల్‌ సమస్య దరిచేరదు. చికెన్‌, మటన్‌ తదితర నాన్‌వెజ్ వంటకాలకు దూరంగా ఉంటే బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. 2 పూటల స్నానం చేస్తే చెమట వల్ల వచ్చే ఫంగస్‌‌ సమస్యలను దూరం చేయొచ్చు.

News April 14, 2025

నేటి నుంచి ‘భూభారతి’

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. CM రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. అందువల్ల తొలుత తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేయనుంది.

News April 14, 2025

నేడు లక్నోతో చెన్నై ఢీ.. ఓడితే CSK ఇంటికే!

image

IPLలో ఇవాళ LSG, CSK తలపడనున్నాయి. ఇప్పటి వరకు వీటి మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా లక్నో మూడింటిలో గెలిచింది. ఓ మ్యాచ్‌లో CSK విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కూతురికి అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఆడిన 6 మ్యాచుల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న CSK ఇవాళ కూడా ఓడితే ఫ్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే.