news

News April 13, 2025

డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్: డ్రోన్ కార్పొరేషన్

image

AP: రాష్ట్రాన్ని డ్రోన్ రాజధానిగా తీర్చిదిద్దుతామని డ్రోన్ కార్పొరేషన్ తెలిపింది. డ్రోన్ల తయారీలో ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా అవతరిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రజలు, పాలనకు ఉపయోగపడేలా డ్రోన్ సేవలు విస్తృతం చేస్తాం. ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నాం. ఈ నెల 21లోగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి కొత్త యూజ్ కేసెస్‌ను ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొంది.

News April 13, 2025

చికెన్ ఎక్కువగా తింటే?

image

కొందరికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. రోజూ చికెన్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ ఎక్కువ మోతాదులో తింటే బీపీ, గుండె జబ్బులు వస్తాయి. కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. రక్తంలో టాక్సిన్లు నిల్వ ఉండి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయి చేతి, కాలి వేళ్లలో స్ఫటికాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులు వస్తాయి. వారానికి ఒకటి రెండు సార్లు తినడం ఉత్తమం.

News April 13, 2025

తాజా సినిమా ముచ్చట్లు

image

☛ మే 23న ప్రభాస్, త్రిష నటించిన ‘వర్షం’ సినిమా రీ రిలీజ్
☛ రేపు HYDలోని పార్క్ హయత్‌లో తమన్నా నటించిన ‘ఓదెల-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్
☛ రూ.100 కోట్ల మార్కును దాటిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా కలెక్షన్స్
☛ మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్‌గా దేవకట్టా?
☛ మూడు రోజుల్లో రూ.32.2 కోట్ల వసూళ్లు రాబట్టిన గోపీచంద్ మలినేని-సన్నీ డియోల్ సినిమా ‘జాట్’

News April 13, 2025

రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు

image

AP: తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ప్రజల హక్కులను కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం YS జగన్ అని, గత ఐదేళ్లలో ఆయన రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని అన్నారు. ఆయన వల్ల ఐదేళ్ల విలువైన సమయం కోల్పోయామని పేర్కొన్నారు.

News April 13, 2025

ALERT.. రేపు జాగ్రత్త

image

AP: రేపు కోనసీమ జిల్లాలోని 7 మండలాలు, కాకినాడలో 3, తూర్పు గోదావరిలో ఒక మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని, మరో 98 మండలాల్లో <>వడగాలులు <<>>వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండ తీవ్రత దృష్ట్యా బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలని సూచించింది. అటు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, NTR, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.

News April 13, 2025

రేపు ‘మాస్ జాతర’ నుంచి ‘తూ మేరా లవర్’ ఫుల్ సాంగ్

image

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘మాస్ జాతర’ నుంచి ‘తూ మేరా లవర్’ ఫుల్ సాంగ్ రేపు విడుదల కానుంది. రేపు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భాను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తోండగా పాటలో ఇడియట్ మూవీలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ మ్యూజిక్ బీట్‌ను యాడ్ చేశారు. మే 9న థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది.

News April 13, 2025

అనకాపల్లి విషాదం.. ప్రధాని దిగ్భ్రాంతి

image

AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల(మ) కైలాసపట్నంలో పేలుడు ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ₹2లక్షలు, గాయపడ్డవారికి ₹50వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. కాగా AP ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹15లక్షల <<16086795>>సాయం <<>>ప్రకటించింది.

News April 13, 2025

రేపు శ్రీవారి దర్శనానికి పవన్ కళ్యాణ్ సతీమణి

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదల రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి మొక్కులు చెల్లించనున్నారు. కాసేపటి క్రితం తిరుమలకు చేరుకున్న ఆమె గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. రేపు వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు.

News April 13, 2025

IPL: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

image

ఐపీఎల్‌లో ముంబైతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్‌టన్, జాక్స్, సూర్య, తిలక్, హార్దిక్ (C), నమన్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా.
DC: మెక్‌గుర్క్, పోరెల్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అక్షర్ (C), అశుతోశ్, విప్రజ్, స్టార్క్, మోహిత్, కుల్దీప్, ముకేశ్.

News April 13, 2025

పరస్పర సుంకాలను రద్దు చేయండి: చైనా

image

పరస్పర సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని అమెరికాను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరింది. ట్రంప్ తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లను టారిఫ్స్ నుంచి మినహాయిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా చిన్నది అని తెలిపింది. తమ దేశంపై 145% సుంకం విధించడాన్ని తప్పుబట్టింది. ‘పులి మెడలోని గంటను దానిని కట్టిన వ్యక్తి మాత్రమే విప్పగలడు’ అని పేర్కొంది.