India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: అంబేడ్కర్ జయంతి సందర్భంగా HYDలోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి స్వయంగా CM రేవంత్ నివాళులర్పించాలని BRS MLC కవిత డిమాండ్ చేశారు. KCRపై కోపంతో అంబేడ్కర్కు నివాళులర్పించకుండా అవమానించ వద్దన్నారు. ‘మంత్రులతో సహా CM అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించాలి. అలాగే ప్రజలకు కూడా సందర్శించే అవకాశం కల్పించాలి. KCRపై అక్కసుతో ఆ మహనీయుడిని స్మరించడం మరిచిపోవద్దు’ అని పేర్కొన్నారు.
నాని హీరోగా నటిస్తున్న ‘HIT-ది థర్డ్ కేస్’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ను మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం విశాఖపట్నంలోని సంగం థియేటర్లో ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. అలాగే ఉదయం 11.07 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. మే 1న ఈ మూవీ రిలీజ్ కానుంది.
TG: భూ భారతి వెబ్సైట్ను సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ నివాసంలో దీనిపై సమీక్షించారు. 100 ఏళ్లపాటు నడిచే ఈ వెబ్సైట్ అత్యాధునికంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా రూపొందించాలని.. భద్రత కోసం ఫైర్వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు.
జపాన్లో పర్యటిస్తున్న రాజమౌళి అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్} మూవీకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రభాస్ ‘స్పిరిట్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలను చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ‘RRR బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ వెళ్లారు.
AP: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను చేనేతశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలాగే ఐటీశాఖ సెక్రటరీ కె.భాస్కర్కు ఏపీహెచ్ఆర్డీఏ డైరెక్టర్గా పూర్తి బాధ్యతలు, సీసీఎల్ ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.
TG: ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డికి తొలి కాపీని అందించనుంది. ఈ కమిటీలో మంత్రులు దామోదర, పొన్నం, సీతక్క సహా పలువురు అధికారులు ఉన్నారు.
ఐపీఎల్లో భాగంగా ఆర్ఆర్తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
RCB: కోహ్లీ, సాల్ట్, పాటీదార్ (C), లివింగ్స్టోన్, కృనాల్, జితేశ్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, హేజిల్వుడ్, సుయాశ్, యశ్ దయాల్.
RR: జైస్వాల్, శాంసన్ (C), రానా, పరాగ్, జురేల్, హెట్మయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్ శర్మ.
మరికాసేపట్లో RCBతో RR తలపడనుంది. ఈ క్రమంలో పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ(RR)కి తుది జట్టులో స్థానం దక్కుతుందా అనేదానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయన నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని క్రికెట్ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వైభవ్తో డ్రింక్స్ మోయించడమే కాకుండా మ్యాచులో ఆడించాలని కోరుతున్నారు.
మూడేళ్లుగా తమ వద్ద పనిచేస్తున్న వాంగ్ అనే మహిళా ఉద్యోగిని పట్ల చైనాలోని ఓ కంపెనీ అమానవీయంగా వ్యవహరించింది. ఓ నెలలో ఆరు రోజులు ఒక నిమిషం ముందు ఎగ్జిట్ అయ్యారనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఆమె కోర్టులో దావా వేశారు. వాంగ్ను తొలగించడం చట్టవిరుద్ధమని, ఆమెకు పరిహారం చెల్లించాలని కంపెనీని న్యాయమూర్తి ఆదేశించారు. నిమిషం ముందు వెళ్లడం పరిగణనలోకి తీసుకోవద్దని తేల్చిచెప్పారు.
వచ్చే రెండేళ్లలో రోడ్ల నిర్మాణాల కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యేకించి ఈశాన్య భారతంలోని రహదారులను USAరోడ్ల మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండేళ్లలో భారత్ని ప్రపంచంలోని అత్యున్నత మౌలిక సదుపాయాలు కలిగిన దేశంగా అభివృద్ది చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 2014లో 91,287కి.మీ ఉన్న జాతీయ రహదారుల పొడవు ప్రస్తుతం 1,46,204 కి.మీకి పెరిగిందన్నారు.
Sorry, no posts matched your criteria.