India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టాప్ క్లాస్ బౌలర్ మహ్మద్ షమీ ఇప్పుడు SRH టీమ్కు భారంగా మారారు. అతడు బౌలింగ్కు వచ్చాడంటే ఎక్కడ భారీగా పరుగులిస్తాడోనని SRH అభిమానులు భయపడే పరిస్థితి వచ్చింది. నిన్న PBKSతో మ్యాచులోనూ 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 75 రన్స్ ఇచ్చారు. ఈ సీజన్లో 6 మ్యాచులాడిన షమీ 5 వికెట్లే తీశారు. దీంతో తదుపరి మ్యాచ్లో అతడిని పక్కనపెట్టి మరో బౌలర్ను తీసుకోవడం బెటర్ అనే చర్చ మొదలైంది. ఏమంటారు?
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా బెంగాల్లో జరుగుతున్న ఆందోళనల్లో ముగ్గురు చనిపోయారు. మాజీ క్రికెటర్, TMC MP యూసుఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న బహరంపూర్లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదిలాఉంటే యూసుఫ్ చాయ్ తాగుతూ ఓ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. ఏమాత్రమైనా సిగ్గుందా? అని దుయ్యబడుతున్నారు. హిందువులు ఊచకోతకు గురవుతుంటే పఠాన్ ఎంజాయ్ చేస్తున్నారని BJP నేత షెహజాద్ ఫైరయ్యారు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం రేఖా గుప్తా భర్త అనధికారికంగా నడుపుతున్నారని ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ ఆరోపించారు. గతంలో మహిళా సర్పంచ్ వ్యవహారాలను ఆమె భర్తలు చూసుకునే వాళ్లని విన్నాం, ఇప్పుడు ఏకంగా సీఎం పనులనే రేఖా గుప్తా భర్త చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా ఒక మహిళా నాయకురాలై ఉండి మరో మహిళా నేతను అవమానపరచడం ఆశ్చర్యకరంగా ఉందని ఆ రాష్ట్ర BJP అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా విమర్శించారు.
TG: రేపటి నుంచి అమల్లోకి తీసుకురానున్న భూభారతి పోర్టల్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి రాష్ట్రమంతటా పోర్టల్ను లాంచ్ చేస్తే తప్పులు సరిచేయడం ఇబ్బందవుతుందన్నారు. అందుకే పైలట్ ప్రాజెక్టుగా తొలుత మూడు మండలాల్లో అమలు చేస్తామన్నారు. సామాన్యుడికి సైతం సులువుగా అర్థమయ్యేలా పోర్టల్ ఉంటుందని స్పష్టం చేశారు. ‘ధరణి’తో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటపెడతామన్నారు.
TG: జీవితమంతా పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య అదే ప్రకృతిలో కలిసిపోయారు. ఖమ్మం జిల్లాలోని స్వగ్రామం రెడ్డిపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామయ్యను ఖననం చేసిన చోటే కుటుంబ సభ్యులు మొక్క నాటారు. ఆయన అంతిమయాత్రకు ప్రజలు, ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ ‘కింగ్స్టన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించగా, దివ్యభారతి హీరోయిన్గా నటించారు. మార్చి 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. 14న పబ్లిక్ హాలిడేగా పేర్కొంటూ ఏపీ, తెలంగాణ విద్యాశాఖలు క్యాలెండర్లో పొందుపర్చాయి. ఇప్పటికే ఆదివారం హాలిడేస్ రావడంతో సోమవారం కూడా విద్యార్థులకు కలిసొచ్చినట్లయింది. అటు దేశవ్యాప్తంగా బ్యాంకులతోపాటు స్టాక్ మార్కెట్లకు కూడా రేపు సెలవు ఉండనుంది.
జలియన్ వాలాబాగ్ అమరవీరులకు PM మోదీ నివాళులర్పించారు. ఈ ఘటన తర్వాత భారత స్వాతంత్ర్య పోరాటమే మలుపు తిరిగిందని ట్వీట్ చేశారు. అమరవీరుల అజేయ స్ఫూర్తిని రాబోయే తరాలు గుర్తుంచుకోవాలన్నారు. పంజాబ్లోని అమృత్సర్లో 1919 APR 13న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న వారిపై బ్రిటిష్ జనరల్ డయ్యర్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మంది గాయపడ్డారు.
✒ ఇంటర్ జవాబు పత్రాల రీకౌంటింగ్కు ₹260, రీవెరిఫికేషన్కు ₹1,300 ఫీజును నేటి నుంచి 22 వరకు చెల్లించొచ్చు.
✒ ఇంటర్ ఫెయిలైనవారికి, ఇంప్రూవ్మెంట్ రాసేవారికి మే 12-20 వరకు పరీక్షలు.
✒ ఈ నెల 15 నుంచి 22 వరకు ఫీజులు చెల్లించాలి.
✒ ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు ₹600+ ప్రతి పేపర్కు రూ.160.
✒ ఫెయిలైనవారికి పేపర్ల సంఖ్యతో సంబంధం లేకుండా₹ 600, ప్రాక్టికల్స్కు ₹275, రెండేళ్లకు కలిపి థియరీ పరీక్షలకు ₹1,200.
SRH ప్లేయర్ అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. సెంచరీకి చేరువైన సమయంలో అభిషేక్ చాలా అవగాహనతో ఆడారన్నారు ‘శర్మాజీ కే బేటే.. 98దగ్గర సింగిల్, 99వద్ద మరో సింగిల్ తీసిన నీలో ఇంత మెచ్యూరిటీనా?.. నావల్ల కావట్లేదు ‘ అని ట్వీట్ చేశారు. సెంచరీకి చేరువైన సమయంలో భారీ షాట్లకు యత్నించి చాలా సందర్భాల్లో అభిషేక్ అవుటయ్యారు. చండీగఢ్లో ఆడుతున్న సమయంలో అభిషేక్కు యువీ కోచ్గా ఉండేవారు.
Sorry, no posts matched your criteria.