India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20వేల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. వడగళ్ల వానలతో ఉత్తర తెలంగాణలో భారీ నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే వివరాలు సేకరించాలంది. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.40వేలు ఇవ్వాలని కోరింది. కాగా నష్టపోయిన అన్నదాతలకు ఎకరానికి రూ.10వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ అనుమతి లేకుండానే 10బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో గవర్నర్ ప్రమేయం లేకుండానే బిల్లులకు చట్ట హోదా కల్పించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపే బిల్లులను నెలలోగా అనుమతించకపోతే అది చట్టరూపం దాల్చినట్లు భావించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రూల్స్ అమలయ్యే అవకాశముంది. వన్డేల్లో పదేళ్ల నుంచి అమల్లో ఉన్న 2 కొత్త బంతుల విధానాన్ని మార్చాలని గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఐసీసీకి ప్రతిపాదించింది. ఒకప్పటిలా ఒకే బంతి వాడితే పాతబడ్డాక రివర్స్ స్వింగ్, స్పిన్కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. WTCలో భారీ తేడాతో గెలిస్తే, పెద్ద జట్లను చిన్నవి ఓడిస్తే అదనపు పాయింట్లు ఇవ్వాలంది. త్వరలో ICC తుది నిర్ణయం తీసుకోనుంది.
ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన JEE మెయిన్ తుది విడత పరీక్షల <
TG: రంగారెడ్డి జిల్లా చటాన్పల్లిలో విషాదం నెలకొంది. ఇటీవల రాసిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ప్రణీత(18) అనే అమ్మాయి బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. ఆమె పుట్టినరోజే ఇలా చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరీక్షలు సరిగా రాయలేదని కొన్నిరోజులుగా కూతురు ఆవేదనతో ఉందని వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRHపై 245 పరుగులు చేసినా PBKS నిన్న ఉప్పల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఓటమితో పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. మూడు సార్లు 200+ రన్స్ చేసి డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయిన కెప్టెన్గా చెన్నై కెప్టెన్ ధోనీ సరసన తొలి స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో డుప్లెసిస్, ధావన్, శాంసన్, కోహ్లీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నిన్న 18.3ఓవర్లలోనే SRH 245రన్స్ను ఛేజ్ చేసింది.
AP: కర్నూలు(D) ఆదోనికి చెందిన పేదింటి విద్యార్థిని నిర్మల ఇంటర్ బైపీసీలో 966 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. 2021-22లో టెన్త్లో 537 మార్కులు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలతో బాలిక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో ఆమె ఆస్పరి KGBVలో చేరింది. ఫస్టియర్లో 420, సెకండియర్లో 966 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది.
PBKSతో నిన్నటి మ్యాచ్లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ అనంతరం క్రేజీ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. 40 బంతుల్లోనే శతకం బాదిన క్రమంలో ఆరెంజ్ ఆర్మీకి <<16080847>>ఓ నోట్<<>> చూపించారు. దానిపై ఆ జట్టు మరో ఓపెనర్ హెడ్ స్పందించారు. ‘అభిషేక్ జేబులో ఆ నోట్ 6 మ్యాచ్ల నుంచి అలాగే ఉంది. ఉప్పల్లో అది బయటకు రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. మరోవైపు, అభిషేక్ 55 బంతుల్లోనే 141 రన్స్ బాది మ్యాచ్ను వన్ సైడ్ చేశారు.
AP: విజయవాడ పటమటకు చెందిన ఇంటర్ విద్యార్థిని రాజేశ్వరికి నిన్న విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 892 మార్కులొచ్చినా ఫెయిలైంది. ఆమెకు సంస్కృతంలో 98, మ్యాథ్స్ 2Aలో 73, 2Bలో 75, ఫిజిక్స్లో 60, కెమిస్ట్రీలో 60, 2 ప్రాక్టికల్స్లో 60 మార్కులు రాగా.. ఇంగ్లిష్లో 5 మార్కులే వచ్చినట్లు మార్కుల లిస్టులో చూపిస్తోంది. కష్టపడి చదివినా ఇంగ్లిషులో 5 మార్కులే రావడం పట్ల విద్యార్థిని కన్నీరుమున్నీరయ్యారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 ఈ నెల 15 నుంచి మరోసారి విచారణ జరపనుంది. 3 రోజుల పాటు జరిగే విచారణలో TG తరఫున ఇప్పటికే 2 దఫాలు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ మరో 2 లేదా 3 సార్లు వాదించనున్నారు. ఆ తర్వాత AP తరఫున వాదనలు ప్రారంభం అవుతాయి. ఈ ట్రైబ్యునల్ విచారణకు తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి హాజరు కానున్నారు.
Sorry, no posts matched your criteria.