news

News October 26, 2024

గంభీర్‌ కోచింగ్‌పై విమర్శలు

image

స్వదేశంలో తొలిసారిగా న్యూజిలాండ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ ఓడటంపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచే ఓటములు మొదలయ్యాయంటూ ఆరోపిస్తున్నారు. శ్రీలంకపై 27 ఏళ్లలో తొలిసారిగా వన్డే సిరీస్ ఓటమి, స్వదేశంలో 12ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఓటమి గంభీర్ వైఫల్యాలేనంటూ విమర్శిస్తున్నారు. ఆటగాళ్లు విఫలమైతే కోచ్ ఏం చేస్తారంటూ గంభీర్ ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

News October 26, 2024

దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. కేంద్రం వార్నింగ్!

image

దీపావళికి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In సూచించింది. ఫిషింగ్, లాటరీ, జాబ్, టెక్ సపోర్ట్, ఇన్వెస్ట్‌మెంట్, COD, ఫేక్ ఛారిటీ, పొరపాటున నగదు పంపడం, డిజిటల్ అరెస్ట్, ఫోన్, పార్సిల్ స్కామ్‌లపై వార్నింగ్ ఇచ్చింది. కాలర్‌ను వెరిఫై చేసుకోవాలని, భయపడొద్దని, వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్, APPS ఇన్‌స్టాల్ చేయొద్దని, లింకులు క్లిక్ చేయొద్దని చెప్పింది.

News October 26, 2024

భారత్ FINALకు వెళ్లాలంటే..

image

NZపై సిరీస్ ఓటమితో భారత WTC ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. తుది సమరానికి అర్హత సాధించాలంటే భారత్ మిగతా 6 మ్యాచుల్లో కచ్చితంగా 4 గెలవాలి. అందులో ఒకటి NZ, 5 AUSతో ఉన్నాయి. అంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. ఇక ఆస్ట్రేలియా 7లో 4, సౌతాఫ్రికా 5లో 4, న్యూజిలాండ్ 4కు 4, శ్రీలంక 4లో 3 గెలిస్తే FINALకు వెళ్తాయి. పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, WIకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

News October 26, 2024

నేను ఖేల్ రత్న అవార్డుకు అర్హురాలినా?: మనూ భాకర్

image

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన భారత షూటర్ మనూ భాకర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘నేను కేంద్ర ప్రభుత్వం అందించే ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు పొందేందుకు అర్హురాలినా? చెప్పండి. ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో దేశం గర్వించేలా చేసిన భాకర్‌ దీనికి అర్హురాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే అవార్డుల ప్రకటనలో ఆమె పేరు ఉంటుందని అంటున్నారు.

News October 26, 2024

ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన జైస్వాల్

image

భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ అగ్రస్థానానికి చేరారు. 2024లో భారత్‌లో జరిగిన 9 టెస్టుల్లో జైస్వాల్ 66 సగటుతో 1056 రన్స్ చేశారు. వాటిలో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో 77 రన్స్ చేసిన యశస్వి.. దిగ్గజ బ్యాటర్ గుండప్ప విశ్వనాథ్ 1979లో (13 మ్యాచుల్లో 1047 రన్స్) నెలకొల్పిన రికార్డును అధిగమించారు.

News October 26, 2024

ఎల్లుండి భూమి సమీపానికి భారీ గ్రహశకలం

image

ఈ నెల 28న ఓ భారీ గ్రహశకలం భూమి సమీపానికి రానున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’ అనే పేరు పెట్టారు. 70 అంతస్తుల భవనమంత పరిమాణం ఉండే ఈ గ్రహ శకలం భూమికి 3.3 మిలియన్ కి.మీ దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు. ఇది సెకనుకు 9.43 కి.మీ వేగంతో భూమి వైపుగా దూసుకొస్తోందని తెలిపారు. దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

News October 26, 2024

ఇందిరమ్మ ఇళ్లు.. బిగ్ అప్డేట్

image

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు యాప్‌ను పరిశీలించిన ఆయన పలు మార్పులు చేయాలని సూచించారు. వచ్చే వారం దీనిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు.

News October 26, 2024

ఓటమిలోనూ మీ వెంటే: ఫ్యాన్స్

image

టెస్ట్ సిరీస్ ఓటమితో ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న టీమ్ ఇండియాకు కొందరు ఫ్యాన్స్ బాసటగా నిలుస్తున్నారు. ఓటమిలోనూ మీ వెంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వరుస విజయాలు సాధించినప్పుడు ప్రశంసించడమే కాదు.. వరుస పరాజయాలు ఎదురైనప్పుడు కూడా వారికి అండగా నిలవాలని అంటున్నారు. మరోవైపు సొంత గడ్డపై భారత జట్టు సిరీస్ కోల్పోవడాన్ని కొందరు ఫ్యాన్స్ జీర్ణించుకోలేక ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News October 26, 2024

Coldplay-Diljit concert: ఈడీ సోదాలు

image

సంగీత ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న Coldplay, Diljit క‌న్స‌ర్ట్స్‌కు సంబంధించి న‌కిలీ టికెట్లు, ధ‌ర‌ల దోపిడీ వ్య‌వ‌హారంలో ED ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసింది. BookMyShow, పలువురిపై నమోదైన కేసుల్లో ఢిల్లీ, ముంబై, జైపూర్‌, చండీగ‌ఢ్‌, బెంగళూరులో సోదాలు నిర్వ‌హించింది. సామాజిక మాధ్య‌మాల్లో బ్లాక్ మార్కెట్‌కు తెర‌లేపి అనధికార, నకిలీ టికెట్లు విక్రయిస్తున్న వారిని గుర్తించిన‌ట్టు ED అధికారి తెలిపారు.

News October 26, 2024

రోహిత్, కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే..!

image

న్యూజిలాండ్‌పై రోహిత్, కోహ్లీ పేలవ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ప్రతిపాదికన కాకుండా ఆటతీరును దృష్టిలో పెట్టుకొని ప్లేయర్లకు జట్టులో చోటివ్వాలని క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. దిగ్గజ ప్లేయర్ సచిన్ తన 40 ఏళ్ల వయసులోనూ దేశవాళీ క్రికెట్ ఆడారని గుర్తు చేస్తున్నారు. ఎంత అనుభవమున్నప్పటికీ రోహిత్, కోహ్లీ ఇదే ఫాలో కావాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!