news

News October 26, 2024

రోహిత్, కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే..!

image

న్యూజిలాండ్‌పై రోహిత్, కోహ్లీ పేలవ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ప్రతిపాదికన కాకుండా ఆటతీరును దృష్టిలో పెట్టుకొని ప్లేయర్లకు జట్టులో చోటివ్వాలని క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. దిగ్గజ ప్లేయర్ సచిన్ తన 40 ఏళ్ల వయసులోనూ దేశవాళీ క్రికెట్ ఆడారని గుర్తు చేస్తున్నారు. ఎంత అనుభవమున్నప్పటికీ రోహిత్, కోహ్లీ ఇదే ఫాలో కావాలని సూచిస్తున్నారు.

News October 26, 2024

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

image

భారత పర్యటనకు ముందు శ్రీలంక చేతిలో పరాజయం. కీలక ప్లేయర్, కెప్టెన్ విలియమ్సన్ గాయంతో దూరమయ్యారు. దీంతో NZపై భారత్ సులభంగా సిరీస్ గెలిచేస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ కివీస్ క్రికెటర్లు అద్భుతంగా ఆడారు. తొలి టెస్టులో పేస్‌తో దెబ్బకొట్టి, రెండో టెస్టులో స్పిన్‌తో భారత ప్లేయర్లను అల్లాడించారు. 1955 తర్వాత భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించారు.

News October 26, 2024

Intel చేసిన ఆ తప్పుకు మూల్యం.. $3 లక్షల కోట్లు

image

బిజినెస్ ఏదైనా విజయవంతంగా నడపాలంటే డిసిషన్ మేకింగ్ చాలా ముఖ్యం. ఆ సామర్థ్యం లేకుంటే కలిగే నష్టం అపారం. ఇంటెల్‌కు 2005లో $20bnsతో Nvidiaను కొనే అవకాశం వచ్చింది. దాని సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయక రిజెక్ట్ చేసింది. ఇప్పుడదే Nvidia మార్కెట్ విలువ ఏకంగా $3trnsకు చేరుకుంది. ఇంటెల్ $100bnsకు పడిపోయింది. AI చిప్ తయారీలో వెనకబడింది. లో కాస్ట్ AI చిప్ Gaudi 3ని తీసుకొచ్చినా ఏం లాభం లేకుండాపోయింది.

News October 26, 2024

సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది: రోహిత్

image

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోల్పోవడం తీవ్ర నిరాశ కలిగించిందని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఇది తమ వైఫల్యమేనని ఆయన చెప్పారు. వాంఖడేలో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామన్నారు. కివీస్ అద్భుతంగా ఆడిందని ప్రశంసించారు. కాగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 రన్స్ తేడాతో ఓడి సిరీస్ కోల్పోయింది. అదే సమయంలో 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ చేజార్చుకుంది.

News October 26, 2024

12 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో సిరీస్ ఓటమి

image

4331 రోజులుగా అనేక మేటి జట్లు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయాయి. ఈ 12 ఏళ్లలో ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్ సాధించింది. 2012 తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి తెలియని భారత్‌ను సునాయాసంగా ఓడించింది. మూడు మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. న్యూజిలాండ్‌కు భారత్‌లో ఇదే తొలి సిరీస్ విజయం. భారత్‌కు 18 సిరీస్‌ విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి.

News October 26, 2024

ప్రాణ త్యాగం చేసైనా వక్ఫ్ బిల్లును అడ్డుకుంటాం: మౌలానా ఖ‌లీద్

image

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును అడ్డుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖ‌లీద్ సైఫుల్లా అన్నారు. ‘ఇది మాకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య. ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ బిల్లు అమలును అడ్డుకొని తీరుతాం. అవసరమైతే ముస్లింలు జైల్ భరో కార్యక్రమాలు చేపడతారు’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ‌మే అత్య‌ధికంగా వ‌క్ఫ్ ఆస్తుల‌ను ఆక్ర‌మించిందని మౌలానా ఆరోపించారు.

News October 26, 2024

క్రెడిట్ కార్డులపై బ్యాంకుల దీపావళి ఆఫర్స్

image

కస్టమర్లకు బ్యాంకులు గుడ్‌న్యూస్ చెప్పాయి. దీపావళి, ధంతేరాస్‌ షాపింగ్ చేసేందుకు క్రెడిట్ కార్డుపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్, ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్, గోల్డ్ జువెలరీ, మొబైళ్లు, దుస్తుల కొనుగోలుపై ICICI, HDFC, AXIS BANKS, SBI కార్డ్స్ డీల్స్ ప్రకటించాయి. జియో మార్ట్, జొమాటో, స్విగ్గీ, యాపిల్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మింత్రా, తనిష్క్‌తో టై‌అప్స్ పెట్టుకున్నాయి.

News October 26, 2024

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

image

AP: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. శింగనమల మం. నాయనపల్లి క్రాస్ వద్ద కారు టైర్ పగలడంతో అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

News October 26, 2024

కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఉన్నారా?: షర్మిల

image

AP: ఆస్తి విషయంలో వైసీపీ చీఫ్ జగన్ తమపై కేసు పెట్టడం చూసి చాలా బాధేసిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ‘ప్రతి ఇంట్లో ఇలాంటివి సహజమని అంత సులభంగా ఎలా మాట్లాడుతున్నారు. మీకు మానవత్వం లేదా? మీకు ఎమోషన్స్ లేవా?’ అని జగన్‌ను నిలదీశారు. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి అని షర్మిల దుయ్యబట్టారు.

News October 26, 2024

పుజారాను వద్దనుకుంటే జట్టులో వీరెందుకు?

image

NZతో టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై నెట్టింట విమర్శలు వెలువెత్తాయి. హిట్ మ్యాన్, కింగ్, ప్రిన్స్‌గా పేరొందిన ఆటగాళ్లు కనీసం స్పిన్ ముందు నిలవలేదని కొందరు పోస్టులు చేశారు. పుజారా వంటి ప్లేయర్‌ను స్వదేశంలో జరిగే మ్యాచులకు ఎంపిక చేయనప్పుడు వీరిని ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ భారత జట్టు యువ ప్లేయర్ల కోసం చూస్తే రోహిత్, కోహ్లీ ఇంకా యంగ్ ప్లేయర్లేనా అని ప్రశ్నిస్తున్నారు.

error: Content is protected !!