India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై LOP రాహుల్ గాంధీ పెదవి విరిచారని తెలుస్తోంది. ఫేవరేటిజం కనిపిస్తోందని అసంతృప్తి చెందినట్టు సమాచారం. పార్టీ ఎలక్షన్ కమిటీ మీటింగులో ఆయన దీనిని హైలైట్ చేశారని ఇండియా టుడే తెలిపింది. కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని సీట్లను శివసేన UBTకి ఎందుకు కేటాయించారని ప్రశ్నించినట్టు పేర్కొంది. పోటీ చేస్తున్న 85 సీట్లకు PCC 48 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఒకేసారి బీచ్లో ఇసుకతో ఆడుకుంటూ మంచు కొండలను అనుభూతి చెందితే ఎంతో బాగుంటుంది కదా? ఇది ఊహకే పరిమితం అనుకుంటే పొరబడినట్లే. ఇలాంటి అద్భుతమైన బీచ్ జపాన్లో ఉంది. హక్కైడో ద్వీపంలో ఉన్న San’in Kaigan జియోపార్క్లో దీనిని చూడవచ్చు. 2008లో ఈ ప్రాంతాన్ని జపనీస్ జియోపార్క్గా, 2010లో UNESCO గ్లోబల్ జియోపార్క్గా ప్రకటించారు.
చంచల్గూడ జైలు నుంచి విడుదలైన <<14447920>>జానీ మాస్టర్<<>> తన ఇంట్లో ఓ డైరెక్టర్, ఇద్దరు కొరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ‘జైలులో పెట్టే ఆహారం తినలేకపోయా. మనిషి అనే వాడు జైలుకు వెళ్లకూడదు. బయట కంటే జైలులో నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తా. అప్పటి వరకూ ఎవరితో మాట్లాడను. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా’ అని చెప్పినట్లు సమాచారం.
న్యూజిలాండ్తో రెండో టెస్టులో గట్టెక్కేందుకు భారత్ ఆశలు పెట్టుకున్న కోహ్లీ కూడా ఔట్ అయ్యారు. 17 రన్స్ వద్ద సాంట్నర్ బౌలింగ్లో LBWగా వెనుదిరిగారు. దీంతో భారత్ 147 పరుగులకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. క్రీజులో సుందర్, సర్ఫరాజ్ ఉన్నారు. విజయానికి ఇంకా 212 రన్స్ కావాలి.
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్యోగ సంఘాల JAC నేతలు కలిశారు. 2 DAలు, పెండింగ్ బిల్లులు సహా మరికొన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు. ఇవాళ జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని భట్టి వారికి చెప్పారు.
న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 359 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్(8) వికెట్ త్వరగానే కోల్పోగా, గిల్(23), జైశ్వాల్(77) జోడీ స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ ఔట్ కాగా, ఆ కాసేపటికే పంత్(0) కూడా రనౌట్ అయ్యారు. ప్రస్తుతం కోహ్లీ(14), సుందర్(3) ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 225 రన్స్ చేయాలి.
రెండో టెస్టులో న్యూజిలాండ్పై గెలిచేందుకు టీమ్ఇండియా 358 రన్స్ చేయాల్సి ఉంది. అయితే, టీమ్ఇండియా 350+ స్కోరును కేవలం రెండు సార్లే ఛేదించింది. 350కి పైగా పరుగుల లక్ష్యంతో 63 ఇన్నింగ్స్ ఆడితే కేవలం రెండిట్లోనే గెలుపొంది 40 సార్లు ఓడిపోయింది. మరో 21 సార్లు డ్రా చేసుకుంది. 1976లో WIతో మ్యాచ్లో 403, 2008లో ENGతో మ్యాచ్లో 387 రన్స్ ఛేదించి ఇండియా గెలిచింది. మరి ఈ మ్యాచ్లో IND గెలుస్తుందా?
రిపబ్లికన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఫోన్లలో డేటాను చైనీస్ హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదైనా కమ్యూనికేషన్ డేటాను వీరు యాక్సెస్ చేశారేమో తెలుసుకొనేందుకు అధికారులు దర్యాప్తు ఆరంభించారు. వెరిజోన్ ఫోన్ సిస్టమ్స్ ద్వారా హ్యాకింగ్ జరిగినట్టు అంచనావేశారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ క్యాంపెయిన్ సభ్యుల ఫోన్లనూ టార్గెట్ చేసినట్టు అనుమానిస్తున్నారు.
జయం రవితో పెళ్లి జరగబోతోందని వచ్చిన వార్తలను హీరోయిన్ ప్రియాంక మోహన్ ఖండించారు. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ‘జయం రవితో బ్రదర్ సినిమాలో నటించా. మేమిద్దరం దండలు వేసుకుని దిగిన ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో మాకు నిశ్చితార్థం జరిగిందని టాలీవుడ్లోని కొందరు కాల్స్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. అది సినిమాలోని స్టిల్ మాత్రమే. ఆ ఫొటోనే రిలీజ్ చేసినందుకు మేకర్స్ను తిట్టుకున్నా’ అని తెలిపారు.
హిట్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ టెస్టుల్లో ఫ్లాప్ అవుతున్నారు. NZతో సెకండ్ టెస్టులో 0,8 రన్స్కే పరిమితమయ్యారు. చివరి 8 టెస్టుల్లో ఆయన కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగారు. టీమ్ గెలుపు కోసం ముందుండి ఆడాల్సిన కెప్టెనే ఇలా సింగిల్ డిజిట్కు పరిమితమవడంతో నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈ మ్యాచ్లోనైనా అండగా నిలవాల్సిందని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. రోహిత్ ప్రదర్శనపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.