India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలోని 1.2లక్షల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ‘ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీం’ కింద వినియోగించుకోవాలని GOVT నిర్ణయించింది. కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను వీరి సాయంతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్ల వినియోగం, వీధి దీపాల నిర్వహణలో వీరి సేవలను వినియోగించుకుంటామని CM చంద్రబాబు తెలిపారు.
49 రకాల మందులు క్వాలిటీ స్టాండర్డ్స్లో ఫెయిల్ అయ్యాయని CDSCO తెలిపింది. వీటిలో క్యాల్షియం-500mg, విటమిన్ D3(లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ లేబొరేటరీ ), పారాసిటమోల్(కర్ణాటక యాంటిబయాటిక్స్), మెట్రోనిడజోల్(హిందూస్థాన్ యాంటీబయాటిక్స్), డొంపరిడోన్(రైన్బో లైఫ్ సైన్సెస్), పాన్-40(ఆల్కెమ్ ల్యాబ్స్) తదితర మెడిసిన్ ఉన్నట్లు వెల్లడించింది. నకిలీ కంపెనీలు తయారుచేసిన 4 రకాల మందులను గుర్తించినట్లూ తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. తాను రంగస్థలం మీద వేసిన తొలినాటకం ‘రాజీనామా’కు బెస్ట్ యాక్టర్గా తొలిసారి గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. ‘కోన గోవింద రావు గారు రచించిన రాజీనామా నాటకానికి బెస్ట్ యాక్టర్గా గుర్తింపు రావడం ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చింది. 1974 -2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానంలో ఎనలేని ఆనందం పొందాను’ అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
MS ధోనీ IPLలో కొనసాగుతారా? లేదా? అనే దానిపై సస్పెన్స్ వీడింది. తాను వచ్చే IPLలో ఆడుతానని MSD స్పష్టం చేశారు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ధోనీ తాను మరికొన్నేళ్లు క్రికెట్ను ఆస్వాదిస్తానని చెప్పారు. మైదానంలో ప్రొఫెషనల్ గేమ్గా ఆడితేనే విజయం సాధించగలమని అన్నారు. T20WC ఫైనల్ మ్యాచ్పై స్పందిస్తూ క్రికెట్లో చివరి వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కాగా తలా తాజా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఈసారి బంగారం మెరుపుల్ని వెండి డామినేట్ చేసింది! ఈ ఏడాది ఇప్పటి వరకు 30% రిటర్న్ ఇచ్చింది. ఇక పుత్తడి 23%, నిఫ్టీ 15% రాబడి అందించాయి. గత OCTలో కేజీ సిల్వర్ రూ.73వేలు ఉండగా ఇప్పుడు రూ.లక్షా పదివేలకు చేరుకుంది. ఈ మెటల్ను నగలు, పాత్రలకే కాకుండా ఇండస్ట్రీస్లోనూ వాడతారు. ధరలు ఎక్కువ ఆటుపోట్లకు లోనవుతాయి కాబట్టి పోర్టుఫోలియోలో వెండి కన్నా బంగారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
AP: డీఎస్సీ అభ్యర్థుల కోసం 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. అన్ని ప్రవేశ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లలో డైట్ బిల్లు బకాయిలను త్వరలో చెల్లిస్తామన్నారు. సీడ్ పథకంతో సంచార జాతులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు.
AP: టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజులను ఈ నెల 28 నుంచి నవంబర్ 11లోపు చెల్లించాలని ప్రభుత్వం పరీక్షల విభాగం ప్రకటించింది. రెగ్యులర్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయుల ద్వారా రూ.125 ఫీజు చెల్లించాలని తెలిపింది. నవంబర్ 12 నుంచి 18లోపు చెల్లిస్తే రూ.50, 19 నుంచి 25 వరకు రూ.200, 26 నుంచి నెలాఖరు వరకు అయితే అదనంగా రూ.500 ఫైన్తో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
UNSCలో పాక్ను భారత్ మరోసారి ఉతికారేసింది. కీలక డిబేట్లో కశ్మీర్లో మహిళల అంశాన్ని లేవనెత్తడంపై సీరియస్ అయింది. ఇది వారి అబద్ధాల వ్యాప్తి వ్యూహం ఆధారంగా చేపట్టిన రెచ్చగొట్టే చర్యగా వర్ణించింది. ‘పాక్ సంబంధం లేని పొలిటికల్ ప్రాపగండాకు దిగింది. మీ దేశంలో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు సహా మైనారిటీ మహిళల దుస్థితేంటో అందరికీ తెలుసు’ అని UNలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ పర్వతనేని హరీశ్ అన్నారు.
APకి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా వెళ్లిన మంత్రి లోకేశ్కు శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. నవంబర్ 1 వరకు అమెరికాలోనే ఉండనున్న మంత్రి రేపటి నుంచి పలు ఐటీ, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని వారికి వివరించనున్నారు. ఈ నెల 29న లాస్ వేగాస్లో జరిగే ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరవుతారు.
TG: ఓ కేసులో నిందితుడిగా ఉన్న తన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పోలీసులకు అప్పగించారు. MBNR జిల్లా ఆదర్శ్నగర్లోని ప్రభుత్వ భూములు, డబుల్ బెడ్రూం ఇళ్లను తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించారని నలుగురిపై కేసు నమోదైంది. వారిలో ఉన్న శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే నిన్న ఆయనను శ్రీనివాస్ గౌడ్ కారులో తీసుకొచ్చి PSలో అప్పగించారు.
Sorry, no posts matched your criteria.