news

News October 26, 2024

Lunch Break: భారత్ 81/1

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ లక్ష్యం దిశగా సాగుతోంది. 359 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన IND లంచ్ సమయానికి 81/1 రన్స్ చేసింది. రోహిత్ 8 పరుగులు చేసి ఔట్ కాగా జైస్వాల్ 46, గిల్ 22 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 278 పరుగులు కావాలి. ఆట ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. మరి భారత్ ఈ టెస్ట్ గెలుస్తుందా? తడబడుతుందా? కామెంట్ చేయండి.

News October 26, 2024

యూజర్లకు జియో దీపావళి ఆఫర్లు

image

టెలికం దిగ్గజం జియో దీపావళి ధమాకా పేరుతో యూజర్ల కోసం ఆఫర్లు ప్రకటించింది. రూ.899, రూ.3599 రీఛార్జ్ ప్లాన్లపై రూ.3350(ఈజీమై ట్రిప్, AJIO, స్విగ్గీ ఓచర్లు) విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. రూ.899 ప్లాన్ ద్వారా 90 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాతో పాటు అదనంగా 20GB డేటా లభిస్తుంది. రూ.3599 ప్లాన్‌లో 365 రోజులు రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం పొందవచ్చు.

News October 26, 2024

దీపావళికి 20% తగ్గనున్న గోల్డ్ డిమాండ్.. ఎందుకంటే!

image

గత ఏడాదితో పోలిస్తే ఈ దీపావళి, ధంతేరాస్‌కు గోల్డ్ డిమాండ్ 15-20% తగ్గుతుందని జువెలర్స్ అంచనా వేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమన్నారు. దాదాపుగా వీరి వార్షిక అమ్మకాల్లో 30-40% ఈ సీజన్లోనే నమోదవుతుంది. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, ఐఫోన్ 16, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ స్కీములను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం గోల్డ్ 10grams ధర రూ.81వేలుగా ఉంది.

News October 26, 2024

AI అవకాశాలతో APని అభివృద్ధి చేస్తాం: లోకేశ్

image

ట్రెండింగ్‌లో ఉన్న AI అవకాశాలను వినియోగించుకుని APని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. USA శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘AI ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తున్నాం’ అని వెల్లడించారు.

News October 26, 2024

కొత్త DGP పొంగులేటికి శుభాకాంక్షలు: KTR

image

TG: పలు స్కాముల్లో నవంబర్ 1 నుంచి 8 వరకు కీలక నేతల అరెస్టులు జరుగుతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి KTR సెటైర్లు వేశారు. ‘చూస్తుంటే తెలంగాణకు కొత్త DGP వచ్చినట్లున్నారు. కొత్త రోల్ పోషిస్తున్న పొంగులేటి గారికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అటు నల్గొండలో కానిస్టేబుళ్లు చేస్తున్న నిరసనపైనా KTR స్పందించారు. ‘తెలంగాణలో పోలీసులే పోలీసులకు రెబెల్స్‌గా మారారు’ అని కామెంట్ చేశారు.

News October 26, 2024

సుజీత్‌కు ‘OG’ మేకర్స్ స్పెషల్ విషెస్

image

యంగ్ డైరెక్టర్ సుజీత్ బర్త్ డే సందర్భంగా ‘OG’ సినిమా మేకర్స్ స్పెషల్ విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే బ్లాజింగ్ గన్ సుజీత్.. నువ్వు సుఖంగా ఉండు.. మమ్మల్ని సుఖంగా ఉంచు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ డేట్స్‌కు అనుగుణంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

News October 26, 2024

ఎలక్ట్రీషియన్ల సేవలు కోసం ఊర్జవీర్ స్కీమ్

image

AP: రాష్ట్రంలోని 1.2లక్షల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ‘ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీం’ కింద వినియోగించుకోవాలని GOVT నిర్ణయించింది. కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను వీరి సాయంతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం, వీధి దీపాల నిర్వహణలో వీరి సేవలను వినియోగించుకుంటామని CM చంద్రబాబు తెలిపారు.

News October 26, 2024

క్వాలిటీ టెస్టులో ఈ మందులు ఫెయిల్

image

49 రకాల మందులు క్వాలిటీ స్టాండర్డ్స్‌లో ఫెయిల్ అయ్యాయని CDSCO తెలిపింది. వీటిలో క్యాల్షియం-500mg, విటమిన్ D3(లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ లేబొరేటరీ ), పారాసిటమోల్(కర్ణాటక యాంటిబయాటిక్స్), మెట్రోనిడజోల్(హిందూస్థాన్ యాంటీబయాటిక్స్), డొంపరిడోన్(రైన్‌బో లైఫ్ సైన్సెస్), పాన్-40(ఆల్కెమ్ ల్యాబ్స్) తదితర మెడిసిన్ ఉన్నట్లు వెల్లడించింది. నకిలీ కంపెనీలు తయారుచేసిన 4 రకాల మందులను గుర్తించినట్లూ తెలిపింది.

News October 26, 2024

తొలి ప్రదర్శనకే బెస్ట్ యాక్టర్‌గా గుర్తింపు: మెగాస్టార్

image

మెగాస్టార్ చిరంజీవి తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. తాను రంగస్థలం మీద వేసిన తొలినాటకం ‘రాజీనామా’కు బెస్ట్ యాక్టర్‌గా తొలిసారి గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. ‘కోన గోవింద రావు గారు రచించిన రాజీనామా నాటకానికి బెస్ట్ యాక్టర్‌గా గుర్తింపు రావడం ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చింది. 1974 -2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానంలో ఎనలేని ఆనందం పొందాను’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News October 26, 2024

మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తా: ధోనీ

image

MS ధోనీ IPLలో కొనసాగుతారా? లేదా? అనే దానిపై సస్పెన్స్ వీడింది. తాను వచ్చే IPLలో ఆడుతానని MSD స్పష్టం చేశారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ధోనీ తాను మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తానని చెప్పారు. మైదానంలో ప్రొఫెషనల్ గేమ్‌గా ఆడితేనే విజయం సాధించగలమని అన్నారు. T20WC ఫైనల్ మ్యాచ్‌పై స్పందిస్తూ క్రికెట్లో చివరి వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కాగా తలా తాజా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

error: Content is protected !!