India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్పై మరో భూకుంభకోణం ఫిర్యాదు నమోదైంది. సుమారు రూ.1,000Cr విలువైన భూమిని ఆయన మాయం చేశారని తట్టిఅన్నారం గ్రామంలోని మధురానగర్ కాలనీ ఫ్లాట్స్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు HYDలోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. RR, మేడ్చల్ జిల్లాల పరిధిలో భూ కేటాయింపులు, 50 ఎకరాల భూదాన్ భూముల వివాదం కేసుల్లో ఇప్పటికే అమోయ్ని ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచ వివాదాలకు అంతర్జాతీయ చట్టాల ఆధారంగా రాజకీయ పరిష్కారాలు వెతకాలని జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ అన్నారు. సంపద, వాణిజ్యం, ఆర్థిక సహకారానికి ఇది తప్పదన్నారు. భారత్లో నిర్వహిస్తున్న 18వ ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్లో ఆయన మాట్లాడారు. ‘ఈ మల్టీ పోలార్ వరల్డ్లో మన కామన్ రూల్స్ను పర్యవేక్షించే గ్లోబల్ పోలీస్, వాచ్డాగ్ ఏమీ లేవు. అందుకే మనమే పరిష్కారాలు వెతకాలి’ అని అన్నారు.
భారత క్రికెట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ సస్పెన్స్ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నేను త్వరలోనే ఒక పెద్ద ప్రకటన చేయబోతున్నాను. మీ అందరికీ త్వరలోనే తెలియజేస్తాను’ అని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇంకేముంది దీనిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. హార్దిక్ మరో పెళ్లి చేసుకోబోతున్నారని కొందరంటే.. లేదు లేదు ముంబై ఇండియన్స్ను వీడి వేరే జట్టులో చేరతారేమోనని ఇంకొందరు అంటున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను హైకోర్టు కోట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. నిందితుల హైప్రోఫైల్ నేపథ్యం కారణంగా హైకోర్టు తీర్పును సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడానికి తగిన కారణాలు లేవని హైకోర్టు గతంలో తేల్చింది.
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల వినియోగం, సేల్పై ఇండోనేషియాలో బ్యాన్ కొనసాగుతోంది. ఆ దేశంలో యాపిల్ $109Mn పెట్టుబడి పెడతామని $95Mn ఇన్వెస్ట్ చేసింది. దీంతో కంపెనీ హామీ పూర్తి చేసి TKDN సర్టిఫికెట్ పొందాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా ఏ ప్రొడక్టైనా 40% ఇండోనేషియాలో తయారైతేనే అమ్మాలనేది TKDN రూల్. i16కు ఇది లేకపోవడంతో స్థానికంగా R&Dసెంటర్, ప్రొడక్షన్ ప్లాంట్ ఏర్పాటును పరిశీలిస్తామని టిమ్ కుక్ ఇటీవల తెలిపారు.
‘వార్-2’ సినిమా సెట్స్ నుంచి జూ.ఎన్టీఆర్ ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ముంబైలో యాక్షన్ సీన్స్ షూట్ జరుగుతుండగా, సెట్స్ నుంచి లీకైన ఫొటోలు వైరల్గా మారాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ కీలక పాత్రలో కనిపించనున్నారు.
లక్షన్నర కోట్ల సంపద ఉన్నప్పటికీ నిరాడంబరమైన జీవితాన్ని గడిపే బిలియనీర్ ఆర్ త్యాగరాజన్ గురించి తెలుసా? శ్రీరామ్ గ్రూప్ను స్థాపించిన త్యాగరాజన్ ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఏకంగా రూ.1.5లక్షల కోట్లు. దుబారా జీవితం అవసరం లేదని ఆయన చెబుతుంటారు. చిన్న ఇంట్లో జీవిస్తూ, రూ.6లక్షల విలువైన కారులో ప్రయాణిస్తుంటారు. ఆయన మొబైల్ వినియోగించేందుకు ఇష్టపడరు.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో 10 మంది చిన్నారులు సహా 28 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. ఒక నివాస సముదాయాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతి చెందారు.
షవర్మా, మండి బిర్యానీ వంటి ఆహారాల్లో వాడే మయోనైజ్ నిషేధానికి TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో అనారోగ్యానికి గురవుతున్నట్లు GHMCకి ఫిర్యాదులు రావడంతో బ్యాన్కు అనుమతించాలని ప్రభుత్వానికి బల్దియా లేఖ రాసింది. దీన్ని పరిశీలిస్తున్న సర్కార్ రాష్ట్రమంతా బ్యాన్ చేయొచ్చని సమాచారం. గుడ్డు సొన, నూనె, నిమ్మరసం, ఉప్పుతో వండకుండా చేసే ఈ పదార్థంలో హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. మీరూ దీని బాధితులేనా?
AP:ఆస్తి కోసం తాను, అమ్మ అత్యాశ పడుతున్నామని YS అభిమానులు భావించవద్దని షర్మిల కోరారు. ‘ఆస్తుల విభజన ఒప్పందం ఐదేళ్లు నా చేతుల్లో ఉన్నా ఏనాడూ బయటికి చెప్పలేదు. ఒక్క ఆస్తి ఇవ్వకపోయినా, ఆర్థిక ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం కోసం బయటపెట్టలేదు. తాజాగా ఇవన్నీ బయటకు వచ్చాయంటే NCLTలో కేసు వేసి సొంత అమ్మకే బతుకుపై అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.