India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1980 కాలంలో అసమానతలు, మూఢ నమ్మకాలు, చదువుకు నోచుకోని పిల్లల చుట్టూ తిరిగే ఓ గ్రామీణ కథ ‘పొట్టేల్’. స్టోరీ లైన్ బాగున్నప్పటికీ దానిని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు తడబడ్డాడు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. పటేల్ పాత్రలో అజయ్ ఆకట్టుకున్నారు. అనన్య నాగళ్ల సహా మిగతా వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. ల్యాగ్ సీన్లు మైనస్. ఎడిటింగ్, స్క్రీన్ ప్లేపై మరింత దృష్టి పెట్టాల్సింది. రేటింగ్: 2.5/5
AP: వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకు TDP అధిష్ఠానం MLC పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో రాధాకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. కొన్నేళ్లుగా ఆయన టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. ఇటీవల రాధా ఇంటికి నారా లోకేశ్ వెళ్లడంతో ఆయనకు MLC పదవి కన్ఫార్మ్ అయిందనే వార్తలకు బలం చేకూర్చుతోంది.
బంగ్లాపై టీ20 సెంచరీతో దుమ్మురేపిన సంజూశాంసన్ ఆస్పత్రిలో చేరుతున్నారు. కింది పెదవిలో మ్యూకస్ సిస్ట్ను తొలగించుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. NOV 8 నుంచి సౌతాఫ్రికాతో 4 టీ20ల సిరీస్ మొదలవుతుంది. అక్కడి టఫ్ బౌన్సీ, పేస్ పిచ్లపై సంజూ కీలకం అవుతారు. ఈ సిరీస్ కోసం ముందుగానే చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడిప్పుడే టీమ్లో స్థిరపడుతున్న సంజూకే ఎందుకిలా అంటూ వాపోతున్నారు.
న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే రెండు వికెట్లు కోల్పోయింది. 56 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ డకౌట్ కాగా గిల్(30), కోహ్లీ(1) నిరాశపర్చారు. క్రీజులో జైస్వాల్(26), పంత్(4) ఉన్నారు. భారత్ ఇంకా 203 రన్స్ వెనకబడి ఉంది. ప్రస్తుత స్కోర్ 61/3.
గాయం కారణంగా న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఆడలేకపోయిన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 72 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో LBW రూపంలో పెవిలియన్ చేరారు. భారత్ ప్రస్తుతం 50/2గా ఉంది. క్రీజులో జైస్వాల్(20), కోహ్లీ(0) క్రీజులో ఉన్నారు. KL.రాహుల్ స్థానంలో గిల్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. వరుసగా ఐదో సెషన్లోనూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, జియో పొలిటికల్ సిచ్యువేషన్, US ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. నగదు అట్టిపెట్టుకొనేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,701 (-363), నిఫ్టీ 24,277 (-122) వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో INDUSIND BANK 15% క్రాష్ అయింది.
AP: అగ్రిసెట్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. ఇటు బీడీఎస్ కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ గడువు ఇవాళ సాయంత్రం వరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పొడిగించింది.
వరల్డ్ పోలీసుగా ఫీలయ్యే USలో రేసిజం, జెండర్ వివక్ష ఎక్కువే. ఎంత అభివృద్ధి చెందినా అక్కడ లేడీ ప్రెసిడెంట్ను ఎన్నుకున్న దాఖలాలు లేనేలేవు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు ఈ సెంటిమెంటు అచ్చొచ్చేలా ఉంది. 2016 ఎన్నికల్లో ఆయన హిల్లరీ క్లింటన్ను ఓడించి షాకిచ్చారు. 2020లో జోబైడెన్ చేతిలో ఓడారు. 2024లో మళ్లీ మహిళా అభ్యర్థి కమలా హారిస్పై పోటీచేస్తున్నారు. మరి సెంటిమెంటు వర్కౌట్ అవుతుందంటారా?
పుణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. నిన్న తొలి ఇన్నింగ్స్లో కివీస్ 259 రన్స్కు ఆలౌట్ కాగా స్టంప్స్ సమయానికి భారత్ 16/1తో నిలిచింది. కెప్టెన్ రోహిత్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో గిల్(22), జైస్వాల్(11) ఉన్నారు. భారత్ స్కోర్ 33/1గా ఉంది.
AP: రబీ నుంచి 2019కు ముందున్న పంటల బీమా విధానాన్నే అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. PM ఫసల్ బీమా పథకానికి పంటల వారీగా నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని తెలిపింది. లోన్లు తీసుకోని రైతులు గ్రామ సచివాలయాలు, ఉమ్మడి సేవా కేంద్రాల్లో ప్రీమియం చెల్లించవచ్చని, https://pmfby.gov.in/ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించింది. జీడిమామిడికి NOV 15లోగా ప్రీమియం చెల్లించాలని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.