India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అగ్రిసెట్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. ఇటు బీడీఎస్ కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ గడువు ఇవాళ సాయంత్రం వరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పొడిగించింది.
వరల్డ్ పోలీసుగా ఫీలయ్యే USలో రేసిజం, జెండర్ వివక్ష ఎక్కువే. ఎంత అభివృద్ధి చెందినా అక్కడ లేడీ ప్రెసిడెంట్ను ఎన్నుకున్న దాఖలాలు లేనేలేవు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు ఈ సెంటిమెంటు అచ్చొచ్చేలా ఉంది. 2016 ఎన్నికల్లో ఆయన హిల్లరీ క్లింటన్ను ఓడించి షాకిచ్చారు. 2020లో జోబైడెన్ చేతిలో ఓడారు. 2024లో మళ్లీ మహిళా అభ్యర్థి కమలా హారిస్పై పోటీచేస్తున్నారు. మరి సెంటిమెంటు వర్కౌట్ అవుతుందంటారా?
పుణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. నిన్న తొలి ఇన్నింగ్స్లో కివీస్ 259 రన్స్కు ఆలౌట్ కాగా స్టంప్స్ సమయానికి భారత్ 16/1తో నిలిచింది. కెప్టెన్ రోహిత్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో గిల్(22), జైస్వాల్(11) ఉన్నారు. భారత్ స్కోర్ 33/1గా ఉంది.
AP: రబీ నుంచి 2019కు ముందున్న పంటల బీమా విధానాన్నే అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. PM ఫసల్ బీమా పథకానికి పంటల వారీగా నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని తెలిపింది. లోన్లు తీసుకోని రైతులు గ్రామ సచివాలయాలు, ఉమ్మడి సేవా కేంద్రాల్లో ప్రీమియం చెల్లించవచ్చని, https://pmfby.gov.in/ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించింది. జీడిమామిడికి NOV 15లోగా ప్రీమియం చెల్లించాలని పేర్కొంది.
AP: 2018లో విశాఖలో YS జగన్పై దాడికి ఆరేళ్లు పూర్తయ్యాయని TDP ట్వీట్ చేసింది. ‘హ్యాపీ “కోడి కత్తి డే” జగన్. 6 ఏళ్ల క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్లడం కాదు. ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి దళిత యువకుడి జీవితం నిలబెట్టు’ అని సెటైర్లు వేసింది. కోడికత్తి లాంటి ఆయుధంతో దాడి చేసినా నేరం కాదని TDP ప్రకటించిందంటూ దీనికి YCP బదులిచ్చింది.
AP: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 6వ తరగతి నుంచి ఎం.ఏ చివరి వరకు పుస్తకాల్లో చేర్చాలని కోరారు. డిసెంబర్ 6 నాటికి అంబేడ్కర్ 69వ వర్ధంతి, 2025 ఏప్రిల్ 14 నాటికి 133వ జయంతిని పురస్కరించుకుని వీటిపై ప్రకటన చేయాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
AP: శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రహదారి, రవాణాశాఖ రూ.252.42 కోట్లు మంజూరు చేసింది. ఆ మార్గంలో నెలకొన్న ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆ ప్రాంత వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. దీనిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందీ భాష వినియోగంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 52.82 కోట్ల మంది హిందీ మాట్లాడతారు. బెంగాలీని 9.72కోట్ల మంది మాట్లాడితే 8.30 కోట్ల మంది మరాఠీలో సంభాషిస్తారు. ఇక 8.11 కోట్ల మంది తెలుగు, 6.90 కోట్ల మంది తమిళం మాట్లాడుతున్నారు. 5.54 కోట్ల మంది గుజరాతీ, 5.07 కోట్ల మంది ఉర్దూ, కన్నడ భాషను 4.37 కోట్లు, 3.75 కోట్ల మంది ఒడియా, మలయాళం మాట్లాడేవారు 3.48 కోట్ల మంది ఉన్నారు.
AP: ఇవాళ్టి నుంచి నవంబర్ 1 వరకు మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జార్జియా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. శాన్ఫ్రాన్సిస్కోలో రేపు ఒరాకిల్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.
TG: ‘హైడ్రా’కు 100 రోజులు పూర్తవడంతో ప్రభుత్వంపై BRS విమర్శలు గుప్పించింది. ‘రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో పేదల జీవితాలను రోడ్డుకీడ్చింది. వెయ్యెలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టు కబ్జాలు ప్రోత్సహించిన కాంగ్రెస్ పరిరక్షణ పేరుతో డ్రామాలాడుతోంది. పేదలకు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేందుకు మనసెలా వచ్చింది? అనుముల తిరుపతిరెడ్డి ఇంటి ఒక్క ఇటుకనైనా ఎందుకు ముట్టలేకపోయింది?’ అని ప్రశ్నించింది.
Sorry, no posts matched your criteria.