India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ APR-SEP త్రైమాసికంలో రూ.5,380.25 కోట్ల లాభాలను ఆర్జించింది. 2023-24లో ఇది రూ.4,726 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో గతేడాదితో పోలిస్తే తగ్గుదల నమోదైంది. రూ.45,384.64 కోట్ల నుంచి రూ.45,197.77 కోట్లకు తగ్గింది. స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 బి.యూనిట్లకు తగ్గగా, క్యాప్టివ్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 5.09 MMT నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది.
TG: కేంద్ర టెక్స్టైల్, స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. 14 మంది సభ్యులతో ఏర్పాటైన టెక్స్టైల్ శాఖ సంప్రదింపుల కమిటీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. స్కిల్ డెవలప్మెంట్కు చెందిన కమిటీలో ఎంపీలు మల్లు రవి, కడియం కావ్యలకు అవకాశం దక్కింది. ఈ కమిటీ 16 మందితో ఏర్పాటైంది.
AP: అమరావతిలో నిర్మాణ పనులకు నవంబర్, డిసెంబర్లో టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, లేఅవుట్లు, కొండవీటి, పాలవాగు, కెనాల్స్, కరకట్ట రోడ్లకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్లో, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు వచ్చే ఏడాది JAN నెలాఖరులో టెండర్లు ఖరారు చేస్తామన్నారు. అమరావతి రైల్వే లైన్కు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
TG: ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆందోళన కార్యక్రమాలపై బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఎంపీ అరవింద్, పాల్వాయి హరీశ్, ఏవీఎన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, జి.నగేశ్, ఈటెల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులకు చోటు లభించింది. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని పార్టీ ప్రకటించనుంది.
పుస్తకాల బ్యాగుల రూపంలో పిల్లల నడుముపై భారాన్ని వేయడం దీర్ఘకాలంలో ప్రమాదకరమని ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యుడు సమీర్ రూపారెల్ పేర్కొన్నారు. ‘బ్యాగుల బరువు వల్ల ప్రతి 10మందిలో 8మంది చిన్నారులకి వెన్ను సమస్యలు వస్తున్నాయి. బ్యాగుల బరువు వారి శరీర బరువులో 15శాతాన్ని మించకూడదు. అధిక బరువు వల్ల మెడ, భుజాల నొప్పులు, వెన్ను వంగిపోయే స్కోలియోసిస్ వంటి పరిస్థితులూ తలెత్తవచ్చు’ అని హెచ్చరించారు.
టెక్నికల్ అనాలసిస్ ప్రకారం నిఫ్టీ-50 మరో 1,000 పాయింట్లు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆల్ టైం హై 26,277 నుంచి నెల కంటే తక్కువ వ్యవధిలోనే 7% (1,899 పాయింట్లు) నష్టపోయిన సూచీ 100 డే మూవింగ్ యావరేజ్(DMA- 24,565) కింద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న 24,399 స్థాయి నుంచి మార్కెట్ పుంజుకోలేకపోతే 23,365 (200 DMA)కి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
TG: మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ‘అసలు DPR లేకుండా మార్కింగ్ ఎలా చేస్తారు. చెరువులు శుభ్రం చేసి, డ్రైనేజీ నీరు మూసీలో కలవకుండా చూడండి. అంతేకానీ పేదల ఇళ్లు కూల్చడం దేనికి? గత ప్రభుత్వం సచివాలయాన్ని బఫర్ జోన్లో కట్టలేదా? పేదల ఉసురు మంచిదికాదు. కూల్చివేతలకు ఉపక్రమిస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం’ అని హెచ్చరించారు.
TG: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీనికి మంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్గా వ్యవహరిస్తారు. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉండనుండగా ప్రత్యేక ఆహ్వానితుడిగా కే.కేశవరావుని నియమించారు. శాఖల వారీగా ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో సబ్ కమిటీ భేటీ కానుంది. కాగా ఇవాళ సాయంత్రంలోపు పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీనిచ్చారు.
వినియోగదారుల కోసం వాయిదాల సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు డెలివరీ పోర్టల్ బ్లింకిట్ ప్రకటించింది. రూ.2999, అంతకంటే విలువైన ఆర్డర్లపై ఇది వర్తిస్తుందని తెలిపింది. కస్టమర్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు అల్బీందర్ ధిండ్సా ట్విటర్లో వివరించారు. చెక్ ఔట్ సమయంలో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. వినియోగదారుడి బ్యాంకును బట్టి వడ్డీ రేటు ఉంటుంది.
AP: కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలని జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ‘YCP హయాంలో మహిళలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో అత్యాచారం జరిగితే నిందితుడ్ని అరెస్ట్ చేయలేదు. గత ఐదేళ్లలో యువతను గంజాయికి, డ్రగ్స్కి బానిసలు చేశారు. ఆ ప్రభావంతోనే సైకోలుగా మారిన కొందరు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు’ అని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.