India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టర్కీలో ముంబై తరహా ఉగ్రదాడి జరిగింది. అంకారాలోని ఏవియేషన్ కంపెనీలో ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. అక్కడ బాంబు దాడి కూడా జరిగిందని, ఉగ్రవాదులు పలువురిని బంధించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
పై ఫొటోలో బోసినవ్వులు చిందిస్తున్న వ్యక్తి పేరు ఎపిమాకో అమాన్చియో. ఫిలిప్పీన్స్కు చెందిన ఆయన ఊళ్లో మొక్కలు నాటుతుండేవారు. 2010లో 37మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ బస్సు, ఆ ఊరి లోయలో పడకుండా ఎపిమాకో నాటిన ఓ చెట్టు కాపాడింది. దాన్ని ఆయన 1975లో నాటడం విశేషం. ఆ సమయంలో తను నాటిన చెట్టు ముంగిట నిల్చుని పెద్దాయన తీసుకున్న ఫొటో ఇది. తాజాగా నెట్టింట హల్చల్ చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన ఆస్తుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయన నికర ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైనే ఉంటుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఆయన కేవలం సినిమాల ద్వారానే ఆదాయాన్ని పొందుతారని, ప్రకటనలకు ఆమడ దూరంలో ఉంటారని వెల్లడించాయి. ప్రస్తుతం రూ.100 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆయన ఇప్పటివరకు 23 సినిమాలు చేశారు. ఆయనకు రూ.కోట్ల విలువైన కార్లు, బంగ్లాలున్నాయి.
TG: షావర్మా, ఫ్రైడ్ చికెన్, పిజ్జాపై మెయనైస్ వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే పచ్చిగుడ్డుతో తయారుచేసే మెయనైస్ వల్ల ఈ ఏడాది HYDలో 10 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తెల్లగా, క్రీమ్లాగా ఉండే మెయనైస్లో హానికర సూక్ష్మక్రిములు ఉంటాయని, దాన్ని బ్యాన్ చేయాలని కోరారు. కాగా ఇప్పటికే మెయనైస్పై కేరళ సర్కారు నిషేధం విధించింది.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చింది. 85 సీట్ల చొప్పున పోటీ చేయాలని కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు నిర్ణయించాయి. మిగతా 18 సీట్లపై కూటమిలోని మిగతా పార్టీలతో చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. ఈసారి తాము కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
TG: గొంతులో దోశ ఇరుక్కుని వ్యక్తి మరణించిన షాకింగ్ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కల్వకుర్తికి చెందిన వెంకటయ్య (41) ఇంట్లో మద్యం తాగి దోశ తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడలేదు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గతంలో కేరళలో ఇడ్లీలు తినే పోటీలో ఓ వ్యక్తి ఇడ్లీలు తింటూ ఊపిరాడక చనిపోయాడు.
ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 27 ఏళ్లుగా ఉద్యోగం చేస్తోన్న మలేషియాకు చెందిన క్లీనర్ బాకర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ పోషణ, తన ముగ్గురు ఆడపిల్లలకు ఉన్నత చదువును అందించేందుకు ఆయన చేసిన శ్రమ వృథా కాలేదు. వారానికి ఏడు రోజులు పనిచేస్తూ పిల్లలను చదివించడంతో వారు న్యాయమూర్తి, డాక్టర్, ఇంజినీర్గా స్థిరపడ్డారు. పిల్లలు సెటిల్ అవడంతో ఇకనైనా రెస్ట్ తీసుకోవాలంటూ నెటిజన్లు ఆయన్ను కోరుతున్నారు.
విదేశాలు వెళ్లినప్పుడు పాస్పోర్టు కోల్పోతే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. అనంతరం సమీపంలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎంబసీలో ప్రాసెస్ సమయంలో ఆ FIR ఓ సాక్ష్యంలా ఉపకరిస్తుంది. పోలీస్ రిపోర్టును కచ్చితంగా వెంట ఉంచుకోవాలి. కొత్త పాస్పోర్టు వచ్చేందుకు కనీసం వారం పడుతుంది. అప్పటి వరకూ ఆగడం ఇబ్బందైతే ఎంబసీ అధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్(EC) ఇస్తారు.
పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 20 ఓవర్లలో 344 పరుగులు చేసింది. ఇప్పటి వరకు నేపాల్ పేరిట ఉన్న 314 రన్స్ను బద్దలుగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లలో సికందర్ రజా 33 బంతుల్లోనే సెంచరీ(15 సిక్సులు) చేశారు. టీ20 వరల్డ్ కప్నకు క్వాలిఫయర్ మ్యాచులు ఆఫ్రికా దేశాల మధ్య జరుగుతున్నాయి.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యాలోని కజన్లో జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో వీరు భేటీ అయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత వీరు సమావేశమవడం గమనార్హం. లద్దాక్లో ఎల్ఏసీ వెంబడి మిలిటరీ పెట్రోలింగ్పై రెండు రోజుల క్రితం ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.