news

News October 24, 2024

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి రేపు రాత్రి వరకు గంటకు 80-100kms వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

News October 23, 2024

పుణేలో కోహ్లీ సగటు 133.50.. రేపు కూడా రిపీట్ చేస్తారా?

image

మహారాష్ట్రలోని పుణే MCA స్టేడియంలో కింగ్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ 2 టెస్టుల్లో 3 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ 267 రన్స్ చేశారు. అత్యధిక స్కోర్ 254*గా ఉంది. యావరేజ్ 133.50 కావడం విశేషం. మరి రేపు NZతో ప్రారంభమయ్యే రెండో టెస్టులో కోహ్లీ ఎలా విజృంభిస్తారో చూడాలి.

News October 23, 2024

ఉద్యోగి కారుకు ప్రమాదం.. మేనేజర్ రిప్లై ఇదే..!

image

ఉద్యోగి కారు ప్రమాదానికి గురైంది. కారు ముందుభాగం దెబ్బతిన్న ఫొటోను అతడు తన మేనేజర్‌కి పంపించాడు. ఎవరైనా అయితే నువ్వు ఎలా ఉన్నావనే అడుగుతారు. కానీ ఆ మేనేజర్ మాత్రం ఏ టైమ్‌కి ఆఫీస్‌కి వస్తావో చెప్పు అంటూ రిప్లై ఇచ్చారు. ‘మీరు లేటుగా రావడాన్ని అర్థం చేసుకోగలను. కానీ మీ కుటుంబీకులు మరణిస్తే తప్ప ఆఫీసుకి రాకపోవడాన్ని ఏ సంస్థా సమర్థించదు’ అని జవాబిచ్చారు. ఈ చాట్‌ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది.

News October 23, 2024

24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్: మంత్రి

image

AP: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో.జిల్లా ధర్మవరానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు. ‘ఇచ్చిన గడువు కంటే ముందే డబ్బులు చెల్లించాం. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం CM, Dy.CM ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అని Xలో పేర్కొన్నారు.

News October 23, 2024

ప్రియాంకా గాంధీకి బెస్ట్ విషెస్: సీఎం రేవంత్

image

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు ఇవాళ నామినేషన్ వేసిన ప్రియాంకా గాంధీకి సీఎం రేవంత్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ప్రియాంకా గాంధీకి మనస్ఫూర్తిగా విషెస్ చెబుతున్నాను. ఆమె తన శక్తిమంతమైన స్వరంతో ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో గట్టిగా వినిపిస్తారని నేను నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే.

News October 23, 2024

AQI స్కోర్: ఇండియాను బీట్ చేసిన పాక్

image

దాయాది పాకిస్థాన్ బ్యాడ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమున్న దేశంగా అవతరించింది. AQI 394తో లాహోర్ మన ఢిల్లీని బీట్ చేసింది. సాధారణంగా Air Quality Index 100 ఉంటేనే ఆరోగ్యానికి మంచిదికాదు. ఇక 150 అయితే భయంకర రోగాలు అటాక్ చేస్తాయి. అలాంటిది 394 అంటే ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ, కిన్షాసా, ముంబై, మిలనో, ఉలన్ బాటర్, కరాచీ సిటీస్ లాహోర్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

News October 23, 2024

ఇండియా వెనక్కి తగ్గదు, ఓటమిని ఒప్పుకోదు: బ్రెట్‌ లీ

image

క్రికెట్‌లో టీమ్ ఇండియా శక్తిమంతమైనదని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డారు. ఓటమి ఒప్పుకొని వెనక్కి తగ్గే అలవాటు ఆ జట్టుకు లేదన్నారు. ‘భారత్ ఒకప్పటి లాంటి జట్టు కాదు. ఎప్పుడైనా, ఎలాంటి జట్టునైనా మట్టి కరిపించగలమని భారత్‌కు తెలుసు. AUSను ఓడించగలమని కూడా తెలుసు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో నిర్లక్ష్యంగా ఆడటం వల్ల ఓడింది. రెండో టెస్టులో కచ్చితంగా పుంజుకుంటుంది’ అని స్పష్టం చేశారు.

News October 23, 2024

గ్రూప్ 1 మెయిన్స్: మూడో రోజు హాజరు 68.2%

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. ఇవాళ (మూడో రోజు) జరిగిన పేపర్-2 హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ పరీక్షను 68.2% మంది అభ్యర్థులు రాశారు. మొత్తం 31,383 మంది అభ్యర్థుల్లో 21,429 మంది మాత్రమే హాజరయ్యారు. తొలి రోజు 72.4%, రెండో రోజు 69.4% హాజరు నమోదైంది. ఈ పరీక్షలు ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి.

News October 23, 2024

గణితం, సైన్స్‌లో 20 మార్కులొస్తే పాస్!

image

10వ తరగతిలో పాస్ శాతాన్ని పెంచేందుకు మహారాష్ట్ర వినూత్న నిర్ణయాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. పాస్ మార్కుల్ని 35కు బదులు 20గా నిర్ణయించాలని ఆ రాష్ట్ర విద్యాపరిశోధన-శిక్షణ మండలి(SCERT) ప్రతిపాదించింది. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. ఈ తరహాలో పాస్ అయిన వారి సర్టిఫికెట్లో వారు సైన్స్ సంబంధిత ఉన్నత విద్యలకు తగినవారు కాదన్న విధంగా గుర్తులు ఉంటాయని తెలిపింది. మీ కామెంట్?

News October 23, 2024

జగన్ సైకో మనస్తత్వానికి ఇదో నిదర్శనం: TDP

image

AP: వైఎస్ జగన్ సొంత తల్లిపై కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారని, చెల్లి ఆస్తులు లాక్కోవడానికి సిద్ధమయ్యారని టీడీపీ విమర్శించింది. ‘ఎంవోయూ ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగుజాడల్లో నడవాల్సిన మీరు ఈ విధంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది’ అని షర్మిల లేఖ రాశారని ట్వీట్ చేసింది. జగన్ సైకో మనస్తత్వానికి ఇదో నిదర్శనమని TDP మండిపడింది.

error: Content is protected !!