India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హోంమంత్రి అనితపై మాజీ మంత్రి రోజా ట్విటర్లో మండిపడ్డారు. ‘మీ పార్టీ ఆఫీస్కి 10 కి.మీ దూరంలోని గుంటూరు ఆస్పత్రిలో TDP కార్యకర్త నవీన్ హత్యాయత్నం చేసిన దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? బద్వేల్లో ఇంటర్ విద్యార్థి దస్తగిరమ్మ హత్య జరిగి 3 రోజులైంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనిపించలేదా? మంత్రిగా బాధ్యతలు మరిచిన మీకు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. రాదు’ అని ట్వీట్ చేశారు.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో హిందీలో ‘వార్ 2’ సినిమా తెరకెక్కుతోంది. మూవీలో ఎన్టీఆర్ విలన్గా నటిస్తున్నట్లు సమాచారం. మొత్తం 40మందితో ఎన్టీఆర్ ఫైట్ సీక్వెన్స్ను ఈరోజు తెరకెక్కించినట్లు మూవీ టీమ్ తెలిపింది. ముంబైలోని యశ్రాజ్ స్టూడియోస్లో 3 రోజుల పాటు తీయనున్న ఈ ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుందని పేర్కొంది. మరికొన్ని రోజుల్లో హృతిక్ కూడా షూట్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.
AP: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘వైసీపీ ప్రభుత్వం రూ.3,500 కోట్లు చెల్లించకుండా మోసం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రివర్గం, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నా. త్వరలోనే మీరు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నా. నేను మీతోనే ఉన్నా’ అని ట్వీట్ చేశారు. రేపు క్యాబినెట్ భేటీలోనే నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఈ ఏడాది టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించని పేసర్ సిరాజ్ను టీమ్ నుంచి తప్పించాలని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్లలో బౌలింగ్ చేసిన సిరాజ్ 12 వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇటీవల NZతో తొలి టెస్టులో 2 వికెట్లు తీశారు. దీంతో అతడిని ప్లేయింగ్ 11 నుంచి తప్పించి, నెక్స్ట్ మ్యాచులో ఆకాశ్ దీప్కు ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. సచివాలయంలో ఉ.11 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్త పన్ను రద్దు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అలాగే 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ చర్చించనుంది.
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల భేటీ ఖరారైంది. ఐదేళ్ల తర్వాత వీరిద్దరు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. రష్యాలోని కజాన్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా బుధవారం ఈ భేటీ జరగనుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. తూర్పు లద్దాక్లో పెట్రోలింగ్పై భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం భేటీ జరగనుండడం గమనార్హం.
మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే వార్తలను కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ ఖండించారు. ప్రపంచంలో చమురు కొరత ఏమాత్రం లేదని, కావాల్సిన దానికంటే ఎక్కువే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 73 డాలర్లుగా ఉంది.
పంజాబ్లోని అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్లోకి వెళ్లాలంటే ఇండియన్ పాసుపోర్టు, పాకిస్థాన్ వీసా తప్పనిసరిగా ఉండాలి. ఈ స్టేషన్ ఇండియా, పాక్ బోర్డర్లో ఉండటమే ఇందుకు కారణం. IND-PAK రైలు మార్గంలో భారత్ పరిధిలో ఉండే చివరి స్టేషన్ ఇదే. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడి నుంచి PAKకు రైళ్లు నడవట్లేదు. అంతకుముందు అటారీ-లాహోర్ మధ్య నడిచేవి. ఈ స్టేషన్ను 1862లో ప్రారంభించారు.
పంట వ్యర్థాలు కాలుస్తున్న 16మంది రైతుల్ని హరియాణా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఏటా శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణ స్థాయికి చేరుకుంటోంది. పంజాబ్, హరియాణా రైతులు పంటవ్యర్థాలు కాల్చడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో చట్ట విరుద్ధంగా పంట వ్యర్థాలను కాలుస్తున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిలబుల్ అఫెన్స్ కావడంతో వెంటనే బెయిల్ లభించినట్లు వారు తెలిపారు.
TG: రెస్టారెంట్లు అపరిశుభ్ర, పాడైపోయిన వంటకాలతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రాజధాని హైదరాబాదే కాదు ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. తాజాగా నిజామాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆర్కేడ్ రెస్టారెంట్ అండ్ బార్, లహరి హోటల్లో కుళ్లిపోయిన చికెన్ దర్శనమిచ్చింది. దాన్ని ఫ్రిజ్లో స్టోర్ చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తించారు. అలాగే సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.