India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేటీఆర్ 30 నిమిషాల పాటు వాంగ్మూలం ఇచ్చారు. సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని జడ్జి అడగగా, సమంతతో పాటు తనపై ఆమె అతి నీచమైన <<14254371>>వ్యాఖ్యలు<<>> చేశారని అన్నారు. ఆ వ్యాఖ్యలను తన నోటితో తిరిగి చెప్పడం ఇష్టం లేదని, ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాతపూర్వక ఫిర్యాదును జడ్జి ముందు ఉంచారు. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.
AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.
చిన్న యాడ్ వీడియోలో కనిపిస్తే చాలు రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. కానీ, డబ్బుల కోసం తప్పుడు పనులు చేయమంటున్నారు కొందరు స్టార్ హీరోలు. తాజాగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పాన్ మసాలా యాడ్ను తిరస్కరించారు. రూ.10 కోట్లు ఇస్తామని చెప్పినా ఆయన తృణప్రాయంగా తిరస్కరించారని సమాచారం. దీంతో పాన్ మసాలా యాడ్కు నో చెప్పిన అల్లు అర్జున్, కార్తీక్ ఆర్యన్, యష్ల సరసన కపూర్ చేరారు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ విరాట్ కోహ్లీని దాటేశారు. ఇంతకు ముందు విరాట్ 7వ స్థానంలో, పంత్ 9వ స్థానంలో ఉండగా తాజా ర్యాంకింగ్స్లో పంత్ ఆరో ప్లేస్కు చేరుకున్నారు. బంగ్లాతో సిరీస్లో సెంచరీ కొట్టిన రిషభ్, న్యూజిలాండ్తో తొలి టెస్టులో 20, 99 పరుగులతో రాణించారు. ఆ మ్యాచ్లో గాయపడగా, రేపటి మ్యాచ్లో ఆడేందుకు ఫిట్గానే ఉన్నారని కోచ్ గంభీర్ తాజాగా వెల్లడించారు.
పండగల సీజన్లో ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వడం రొటీన్. రేట్లు పెంచడం, షాకులివ్వడమే వెరైటీ! ZOMATO, SWIGGY ఇలాగే చేశాయి. జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును రూ.6 నుంచి రూ.10కి పెంచిన కొన్ని గంటల్లోనే స్విగ్గీ సైతం రూ.10కి పెంచేసింది. EX. మీరేదైనా ఆర్డరిస్తే, దానిపై డెలివరీ ఫీజు రూ.36, ప్లాట్పామ్ ఫీజు రూ.10 అదనంగా చెల్లించాలి. AUG 2023లో రూ.2గా ఉన్న ఈ ఫీజు ఏడాదిలోనే 400% పెరిగింది.
టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ నెట్స్లో చెమటోడుస్తున్నారు. తొలి మ్యాచ్లో పంత్, సర్ఫరాజ్ వంటి యువ ఆటగాళ్లు రాణించగా, అనుభవజ్ఞుడైన రాహుల్ 0, 12 రన్స్కే ఔటయ్యారు. రెండు ఇన్నింగ్స్లలోనూ న్యూజిలాండ్ బౌలర్ ఓ రూర్కే బౌలింగ్లో రాహుల్ ఔటయ్యారు. దీంతో అదే హైట్ ఉన్న మోర్నే మోర్కెల్ బౌలింగ్లో రాహుల్ నెట్స్లో సాధన చేశారు. రేపు ఉదయం 9.30 గంటలకు రెండో టెస్టు మొదలుకానుంది.
BRICSలో జాయిన్ అయ్యేందుకు 30+ కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అన్నారు. తమ కూటమితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న గ్లోబల్ సౌత్, ఈస్ట్ దేశాల ఆసక్తిని విస్మరించకూడదని చెప్పారు. అదే టైమ్లో బ్యాలెన్స్ మెయింటేన్ చేయడం, సామర్థ్యం తగ్గకుండా చూసుకోవడం అవసరమన్నారు. తీవ్రమైన ప్రాంతీయ వివాదాలపై డిస్కస్ చేస్తామన్నారు. UNకు BRICS పోటీగా మారొచ్చన్న సందేహాలున్న సంగతి తెలిసిందే.
TG: బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి కొండా సురేఖ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని నాంపల్లి కోర్టులో KTR వాంగ్మూలం ఇచ్చారు. ‘నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని సురేఖ అన్నారు. సాక్షులు నాకు 18ఏళ్లుగా తెలుసు. సురేఖ చేసిన వ్యాఖ్యలను TVలో చూసి వారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు, BRSకి నష్టం చేయాలనేదే ఆమె ఉద్దేశం’ అని పేర్కొన్నారు. సురేఖ వ్యాఖ్యల వీడియోను కోర్టుకు సమర్పించారు.
AP: ప్రతి ఏటా రూ.2,684కోట్లతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈనెల 31న ఈ స్కీమ్ను ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మూడు సిలిండర్లను ఇచ్చేందుకు ఒక షెడ్యూల్ను ఖరారు చేశామన్నారు. ఏప్రిల్-జులై మధ్య మొదటి సిలిండర్, ఆగస్టు-నవంబర్ మధ్య రెండోది, డిసెంబర్-మార్చి 31 మధ్య మూడో సిలిండర్ను ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. చైనాకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా 13వేల కిలోమీటర్లు ఆరున్నర నెలలు సైకిల్పై ప్రయాణించి రొనాల్డోను కలుసుకున్నారు. సౌదీ ప్రో లీగ్లో అల్ షబాబ్తో జరిగిన మ్యాచ్ తర్వాత అభిమాని గురించి తెలుసుకొని రొనాల్డో అతణ్ని కలిసి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. విమానంలో ప్రయాణించే స్తోమత లేకపోవడంతో అతను సైకిల్పై వెళ్లినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.