India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశీయ బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందాయి. దీంతో ఇన్వెస్టర్లు దూకుడుగా పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు. సెన్సెక్స్ 80,151 (69), నిఫ్టీ 24,441 (6) వద్ద చలిస్తున్నాయి. FMCG, IT, METAL సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంక్, ఫైనాన్స్ సూచీలు పుంజుకున్నాయి. HUL, హిందాల్కో, SBI LIFE, నెస్లే, AIRTEL టాప్ లూజర్స్. గ్రాసిమ్, కోల్ఇండియా ఎగిశాయి.
AP: ‘దానా’ తుఫాన్ వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా మారిందని APSDMA తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు భితార్కానికా-ధమ్రా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దానా ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
BRICS అధికారిక కరెన్సీ నమూనా నోట్లు విడుదలయ్యాయి. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వీటిని అందరికీ చూపించారు. ‘BRICS bill’గా పిలుస్తున్న నోటు ముందు వైపున భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికా జాతీయ పతాకాలు ప్రింట్ చేశారు. వాటిపై తాజ్మహల్, డ్రాగన్ వంటి చిహ్నాలకు చోటిచ్చారు. వెనుకవైపు కొత్త సభ్యదేశాల పేర్లు, జెండాలు ఉన్నాయి. ఇవి డాలర్ డామినేషన్కు చెక్ పెడతాయని విశ్లేషకుల అంచనా. మీ comment.
టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తిచేసి నేటికి ఆరేళ్లు పూర్తవుతోంది. 2018లో ఇదేరోజున స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 129 బంతుల్లో 157 రన్స్ చేశారు. దీంతో వన్డేల్లో 10,000కు పైగా పరుగులు చేసిన 12వ బ్యాటర్గా కోహ్లీ నిలిచారు. 205 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించడంతో సచిన్ టెండూల్కర్(259) పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు.
శనగ, మైసూర్ పప్పులను కేంద్ర ప్రభుత్వం ‘భారత్ బ్రాండ్’లో చేర్చింది. దీంతో శనగపప్పు KG ₹60, మైసూర్ పప్పు ₹89కే లభించనుంది. పెరుగుతోన్న ధరలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగానే సబ్సిడీపై పప్పులను అందించాలని కేంద్రం నిర్ణయించింది. మార్కెట్లో శనగపప్పు ₹110, మైసూర్ పప్పు ₹115కు పైనే ఉంది. అమెజాన్, జియోమార్ట్తో పాటు బిగ్బాస్కెట్, బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ నానాటికీ దిగజారిపోతోంది. ఇవాళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) లెవెల్ ఏకంగా 214కి చేరింది. నగరమంతా దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు హైదరాబాద్లోనూ ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతోంది. గత 2,3 రోజులుగా ఉదయం పొగమంచు అలుముకుంటోంది. AQI లెవెల్ 97(మోడరేట్)గా ఉంది. ఇది 100 దాటితే ‘పూర్’గా పరిగణిస్తారు.
భారత్, న్యూజిలాండ్ సెకండ్ టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన NZ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, 2012 తర్వాత ఇండియాలో ఈ జట్టు తొలిసారి టాస్ గెలిచింది. చివరిసారిగా 2012లో బెంగళూరులో టాస్ నెగ్గింది. ఆ మ్యాచులో ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజాగా టీమ్లో పలు మార్పులతో టీమ్ఇండియా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మరి 2012 మ్యాచే రిపీట్ అవుతుందా?
TG: మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులను MIM నేత అక్బరుద్దీన్ కలిశారు. ఖరీదైన ఇళ్లను కూల్చేసి వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. అలా చేస్తే కుదరదని తేల్చి చెప్పారు. తామెప్పుడూ ప్రభుత్వాలకు తలొగ్గలేదని, అన్ని రాజకీయ పార్టీలు మూసీపై రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులు వారి వ్యాపారాలు ఇక్కడుంటే ఎక్కడికో ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు.
BSNL కొత్త లోగోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లోగోలో భారత్ మ్యాప్ను ఉంచడం, కనెక్టింగ్ ఇండియా ట్యాగ్లైన్ను కనెక్టింగ్ భారత్గా మార్చడం బాగుందని కొందరు అంటున్నారు. భారతీయత కనిపిస్తోందని చెప్తున్నారు. మార్చాల్సింది లోగో కాదని, బిజినెస్ స్ట్రక్చర్, అందించాల్సిన సేవలని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెప్పుడు 4G, 5G అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. DD లోగో మార్చినప్పుడూ ఇలాంటి కామెంట్సే వచ్చాయి.
AP: పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 2026 మార్చిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బావర్ కంపెనీ ప్రతినిధులను CM చంద్రబాబు ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఏటా ₹983 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ₹275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని జల వనరుల శాఖ సమీక్షలో తెలిపారు. ఇక నుంచి అలా జరగరాదని, ఈ ఏడాదికి అవసరమైన మొత్తం నిధులను ఏకకాలంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.