India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZతో రెండో టెస్టులో వాషింగ్టన్ సుందర్కు చోటివ్వడం టీమ్ఇండియా భయానికి సంకేతమని సునిల్ గవాస్కర్ అన్నారు. అందుకే కుల్దీప్ యాదవ్ను తీసుకోలేదన్నారు. ‘సాధారణంగా గాయాల బెడద ఉంటే తప్ప జట్టులోంచి ముగ్గుర్ని తప్పించరు. బ్యాటింగ్ డెప్త్పై ఆందోళనతోనే కుల్దీప్ను కాదని సుందర్ను తీసుకున్నారు. నిజమే, NZలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కానీ కుల్దీప్ వారికి దూరంగా బంతిని టర్న్ చేయగలరు’ అని వివరించారు.
AP: అవినాశ్ రెడ్డిని విమర్శించడం మానేస్తేనే షర్మిలకు ఆస్తి రాసిస్తానంటూ YS జగన్ బ్లాక్మెయిల్ చేశారని TDP ట్వీట్ చేసింది. ‘నీ గురించి రాజకీయంగా విమర్శించవద్దని అన్నావు ఓకే. కానీ మధ్యలో అవినాశ్ ఎందుకు వచ్చాడు? అవినాశ్ను విమర్శిస్తున్నారని సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టడం ఏంటి? బాబాయ్ హత్యలో నిందితుడైన అతని గురించి మాట్లాడితే నీ ఇంటి నుంచి జరిగిన హత్య మంత్రాంగం బయటపడుతుందని భయమా?’ అని పేర్కొంది.
AP: ఇవాళ మ.12గంటలకు <<14432304>>‘ట్రూత్ బాంబ్’<<>> అంటూ ఉత్కంఠ రేకెత్తించిన YCP చెప్పినట్లుగానే సరిగ్గా 12గంటలకు ట్వీట్ చేసింది. ‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ కొన్ని పత్రాలను జత చేసింది.
గద్వాల(D) తుమ్మలపల్లికి చెందిన శివ(28)కు కర్నూలు(D) బనగానపల్లెకు చెందిన లక్ష్మీతో పెళ్లైంది. భార్య నిండు గర్భిణి కావడంతో పుట్టింటికి పంపాడు. అయితే మంగళవారం బైక్ నుంచి పడి గాయపడ్డ శివను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లక్ష్మీకి కూడా నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం రాత్రి 2 గంటలకు పరిస్థితి విషమించడంతో శివ మృతి చెందాడు. ఆ తర్వాత గంటకే లక్ష్మీ మగబిడ్డకు జన్మనిచ్చారు.
దాదాపు అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు తమ పేషెంట్ల కోసం తమకు ఎడమవైపున కుర్చీ ఏర్పాటు చేసి ఉంచుతారు. కుడివైపు నుంచి రోగి గుండె, లివర్, పొత్తికడుపును పరీక్షించడం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్లలో చాలామంది కుడిచేతి వాటం కావడం వల్ల స్టెతస్కోప్ వంటి పరికరాలు వాడటంలో ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. అందుకే మెడికల్ స్టూడెంట్స్ కాలేజీ నుంచే దీన్ని అలవర్చుకుంటారు. అయితే దీని వెనుక ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు.
స్కోడా ఆటో ఇండియా ఆపరేషన్స్లో 50% వాటా కొనుగోలుకు M&M సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ డీల్ తుదిదశకు చేరినట్టు సమాచారం. ప్రస్తుతం స్కోడా విలువ $1 బిలియన్లుగా ఉంది. షేర్ల కేటాయింపు, నగదు రూపంలో M&M ఈ లావాదేవీని పూర్తి చేయనుంది. భారత మార్కెట్లో పోటీని తట్టుకోవడం స్కోడాకు కష్టంగా మారింది. 2024లో నెట్ ప్రాఫిట్ 69% తగ్గి రూ.96 కోట్లకు చేరింది. అందుకే డీల్కు మొగ్గుచూపినట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
TG: గత ప్రభుత్వంలోని ముఖ్యులపై ఫైల్స్ సిద్ధమయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. నవంబర్ 1 నుంచి 8 వరకు అందరూ లోపలికి వెళతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మరో రెండుమూడు రోజుల్లో సంచలనం జరగబోతోందంటూ బాంబు పేల్చారు. మంత్రి దేని గురించి మాట్లాడారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్పై పాఠశాల విద్యాశాఖ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.
AP: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు వివరించారు. నేడూ భారీ వర్షాలున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
AP: కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో శాడిస్ట్ చంద్రబాబుది అందెవేసిన చేయి అంటూ వైసీపీ విమర్శించింది. వైఎస్ జగన్ హయాంలో డ్రోన్లని విరివిగా వాడినా ఇప్పుడు ఆ ఘనత తనదేనంటూ చంద్రబాబు గప్పాలు కొడుతున్నారని మండిపడింది. ఇదంతా జనం చూసి నవ్విపోతారనే సోయి లేకపోతే ఎలా అంటూ ట్వీట్ చేసింది. జగన్ హయాంలో ఎరువులు, విత్తనాలు చల్లేందుకు డ్రోన్లను వాడినట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.