India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SEP నెలకుగాను మోస్ట్ పాపులర్ హీరోగా దళపతి విజయ్ నిలిచినట్లు ORMAX MEDIA వెల్లడించింది. ఆ తర్వాత వరుసగా ప్రభాస్, షారుఖ్, అజిత్ కుమార్, NTR, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఉన్నారంది. హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఆలియా భట్, దీపికా పదుకొణె, నయనతార, త్రిశ, శ్రద్ధా కపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక, కియారా ఉన్నారని పేర్కొంది.
AP: మంత్రి నారా లోకేశ్ టీమ్ అంటూ సాయం పేరుతో ఫేక్ ఎన్నారై టీడీపీ పేర్లతో మోసగాళ్లు స్కాంలు చేస్తున్నారని టీడీపీ తెలిపింది. +1(208)6482504, 8977038602 నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని ప్రజలకు సూచించింది. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంది. ఇప్పటికే ఫేక్ నంబర్లతో మోసగిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోందని ట్వీట్ చేసింది.
కంపెనీని విజయవంతంగా నడిపించేందుకు వయసుతో సంబంధం లేదని Zepto CEO ఆదిత్ పాలిచా పేర్కొన్నారు. NDTV వరల్డ్ సమ్మిట్లో ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో తన కంటే అధిక వయస్కులను ఇంటర్స్న్గా తీసుకున్నానని చెప్పారు. ‘నా ఏజ్ కంటే రెండు రెట్లు ఎక్కువ గల ఉద్యోగులు సైతం నాకు రిపోర్ట్ చేస్తుంటారు. నాయకత్వానికి వయసుతో పట్టింపు లేదు’ అని చెప్పుకొచ్చారు.
గుజరాత్లో కొంతమంది దుండగులు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోరిస్ సామ్యుల్ క్రిస్టియన్ అనే నిందితుడు తన ముఠాతో కలిసి 2019లో ఓ ప్రభుత్వ భూమి సెటిల్మెంట్లో నకిలీ తీర్పు ఇచ్చేందుకు నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచీ అతడి ముఠా ఈ దందాను కొనసాగిస్తుంది. అహ్మదాబాద్లోని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు మోరిస్ బండారం బట్టబయలైంది.
మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు బిగ్బాస్ హౌజ్లో గుండెపోటు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని ‘మై విలేజ్ షో’ టీం సభ్యుడు అంజిమామ స్పష్టతనిచ్చారు. తాము షో నిర్వాహకులకు కాల్ చేయగా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారన్నారు. గతంలోనూ గంగవ్వకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. బిగ్బాస్ సీజన్-4లో గంగవ్వ పాల్గొనగా, తాజాగా మరోసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్తో రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన గిల్ అందుబాటులో ఉంటారని చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్గా ఉన్నారని పేర్కొన్నారు. కాగా గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో విఫలమైన రాహుల్ను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి మేకర్స్ మరో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మంట అంటుకున్న సింహాసనాన్ని తలకిందులుగా చూపించారు. రేపు డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త అప్డేట్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి మేకర్స్ మరో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మంట అంటుకున్న సింహాసనాన్ని తలకిందులుగా చూపించారు. రేపు డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త అప్డేట్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.
వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఇర్ఫాన్ అనే వ్యక్తి తన భార్య డెలివరీ జరుగుతుండగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి బాబు బొడ్డుతాడును కట్ చేశాడు. దీన్ని వీడియో తీసి యూట్యూబ్లో పోస్టు చేయగా వైరలైంది. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ సీరియస్ అయ్యింది. సదరు వ్యక్తి, డాక్టర్, ప్రైవేట్ ఆస్పత్రిపై కేసు పెట్టింది.
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి క్రికెట్, హాకీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలను నిర్వాహకులు తొలగించారు. ఖర్చును తగ్గించుకునేందుకు కేవలం 10 క్రీడలతో నిర్వహిస్తామని ప్రకటించారు. గతంలో ఈ స్పోర్ట్స్లోనే భారత్ ఎక్కువ మెడల్స్ సాధించింది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం భారత్కు ప్రతికూలంగా మారింది. 2022లో 19 క్రీడల్లో ఈ పోటీలు జరిగాయి.
Sorry, no posts matched your criteria.