news

News October 18, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వాన కురవొచ్చని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని వెల్లడించింది.

News October 18, 2024

సల్మాన్ ఖాన్ ఆ బ్రాస్‌లెట్ ఎందుకు ధరిస్తారంటే..

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ధరించే బ్రాస్‌లెట్ చాలా ఫేమస్. ఆయన ఫ్యాన్స్ దాన్ని పోలిన బ్రాస్‌లెట్లను ధరిస్తుంటారు. అలాంటి బ్రాస్‌లెట్‌ను తన తండ్రి ధరిస్తుండేవారని ఓ ఇంటర్వ్యూలో సల్లూభాయ్ తెలిపారు. ‘దీనిలోని నీలం రంగు రాయిని ఫెరోజా లేదా టర్కోయిస్ అని పిలుస్తారు. దీన్ని జీవం ఉన్న రాయిగా చెబుతారు. నాపై నెగటివిటీని అడ్డుకుని పగిలిపోతుంది. ఇలా ఇప్పటికి ఏడుసార్లు మార్చాను’ అని వివరించారు.

News October 18, 2024

స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు: లోకేశ్

image

AP: సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ స్కూళ్లకు ₹8.63cr KGBVలకు ₹35.16cr, మండల రిసోర్స్ కేంద్రాలకు ₹8.82cr, మిగతా స్కూళ్లకు ₹51.90cr ఇచ్చారు. సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామాగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్, తాగునీటి కోసం ఈ నిధులు వాడాలన్నారు లోకేశ్.

News October 18, 2024

VIRAL: బికినీలో మృణాల్.. నిజమిదే..

image

టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాత్ టబ్‌లో వైట్ కలర్ బికినీ ధరించిన ఆమె ఫొటోలకు ఫోజులిచ్చారు. కానీ ఆ ఫొటోలు డీప్ ఫేక్ అని తాజాగా తేలింది. ఆ చిత్రాలు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రితుపర్ణ బసక్‌విగా నిర్ధారణ అయింది. ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలను AI ద్వారా మృణాల్ ఫేస్‌గా ఎడిట్ చేశారు. దీంతో టెక్నాలజీని మిస్ యూజ్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

News October 18, 2024

LOVE BOMBING.. ఇదో రోగం!

image

రిలేషన్‌షిప్‌పై నియంత్రణకు కొందరు చేసే భావోద్వేగ మోసాల్నే లవ్ బాంబింగ్ అంటారు. నిజానికిదో మానసిక వ్యాధి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రొమాంటిక్ పార్ట్‌నర్స్‌లో ఎవరికైనా ఇది ఉండొచ్చు. ఊరికే గిఫ్టులివ్వడం, వారిపై ఎక్కువ ఆధారపడేలా చేయడం, నిత్యం అటెన్షన్ చూపడం, అతిగా పొగడటం, పిచ్చిగా ప్రేమ చూపడం దీని లక్షణాలు. వీటితో ఒంటరై, అవతలి వాళ్లు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారంటే మీరూ లవ్ బాంబింగ్ బాధితులే అన్నమాట!

News October 18, 2024

ప్రభాస్‌తో సినిమా.. ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఇదే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఇక చాలు సైలెంట్‌గా ఉండండి’ అని అర్థం వచ్చేలా ఆయన ఎమోజీని ట్వీట్ చేశారు. దీనిని ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ‘ఇక చాలు’ డైలాగ్‌తో పోలుస్తూ ప్రచారం ఆపమనే ప్రశాంత్ అలా ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News October 18, 2024

DAY 3: 125 రన్స్ వెనుకంజలో భారత్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురొడ్డుతోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 231/3 రన్స్ చేసింది. మరో 125 రన్స్ వెనుకబడి ఉంది. కోహ్లీ 70, సర్ఫరాజ్ ఖాన్ 70*, రోహిత్ 52, జైస్వాల్ 35 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 రన్స్‌కే ఆలౌట్ కాగా కివీస్ 402 పరుగులు చేసింది.

News October 18, 2024

లోన్లపై RBI నిషేధం: ఫిన్‌టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు

image

నావి ఫిన్‌సర్వ్‌తో పాటు 3 NBFCs లోన్లు ఇవ్వకుండా RBI నిషేధం విధించడం ఫిన్‌టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. గ్రోత్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలన్న మైండ్‌సెట్టే వేటుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. రూల్స్ పాటించకపోవడం, ఇష్టారీతిన ఎక్కువ వడ్డీకి రుణాలివ్వడం, ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, రుణ గ్రహీతల ఆర్థిక స్తోమత పట్టించుకోకపోవడం, ప్రాపర్‌గా లేని ఇన్‌కం అసెస్‌మెంట్లను RBI సీరియస్‌గా తీసుకుంది.

News October 18, 2024

ఆ రికార్డులో రెండో స్థానానికి కోహ్లీ

image

టెస్టుల్లో విరాట్ కోహ్లీ 9వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన హాఫ్ సెంచరీ దాటారు. ఈక్రమంలో ఈ ఘనత అందుకున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన క్రికెటర్లలో రెండో స్థానంలో ఆయన కొనసాగుతున్నారు. 596 ఇన్నింగ్స్‌లలో ఆయన 221 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో సచిన్(264) అగ్రస్థానంలో ఉన్నారు.

News October 18, 2024

ఎంతవరకైనా పోరాడతా: బండి సంజయ్

image

TG: గ్రూప్-1 అభ్యర్థుల కోసం ఎంతవరకైనా పోరాడతానని కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. జీవో 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు. మెయిన్స్‌ను రీషెడ్యూల్ చేసేవరకు ఉద్యమిస్తానని బండి వెల్లడించారు. మరోవైపు పరీక్ష వాయిదా వేయాలంటూ HYD అశోక్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మరెవరూ నిరసనకు దిగకుండా అక్కడ భారీగా మోహరించారు.

error: Content is protected !!