news

News October 18, 2024

ఆంజనేయస్వామి ఆలయ కూల్చివేతలో ట్విస్ట్

image

AP: చిత్తూరు(D) మొలకలచెరువులో ఈ నెల 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం <<14370148>>కూల్చివేత ఘటనలో<<>> ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య పోరు తలెత్తింది. ఈ క్రమంలో హరినాథ్ గుడిని ధ్వంసం చేశాడని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

News October 17, 2024

ఆసీస్‌కు షాక్.. ఫైనల్‌కు సౌతాఫ్రికా

image

మహిళల T20 WCలో ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా జట్టు షాకిచ్చింది. 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఓడిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 134/5 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 17.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 రన్స్ చేసింది. చివరి మూడు టీ20 వరల్డ్ కప్‌ టోర్నీల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

News October 17, 2024

గ్రూప్-1 మెయిన్స్ వాయిదా లేనట్లేనా?

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ప్రెస్ మీట్‌లో వాయిదా విషయమై అడిగిన ప్రశ్నకు ఇది సందర్భం కాదని సీఎం దాటవేశారు. మరోవైపు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో వాయిదా పడే అవకాశం లేదని కొందరు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

News October 17, 2024

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్

image

TG: రాష్ట్రంలో జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విధానం మాదిరే ఒకరికి 6కేజీల చొప్పున బియ్యం అందిస్తామన్నారు. అటు త్వరలో కొత్తగా జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలనే ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

News October 17, 2024

సూపర్ మార్కెట్‌లో ధరలపై మంత్రి ఆగ్రహం

image

AP: మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని రైతు బజార్, సూపర్ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయల ధరలు, స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. సూపర్ మార్కెట్‌లో కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమ ప్రభుత్వం రాయితీపై రేషన్ షాపుల్లో ఉల్లి, టమాటా, కందిపప్పు, నూనె అందిస్తున్నట్లు తెలిపారు.

News October 17, 2024

పురుషులకూ బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు

image

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారి స్త్రీలకు మాత్రమే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ పురుషుల్లోనూ వస్తుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ సీఎన్ పాటిల్ తెలిపారు. ‘అరుదే అయినా వచ్చే ప్రమాదం లేకపోలేదు. హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, పర్యావరణం దీనికి కారణం కావొచ్చు. 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న పురుషులకు రిస్క్ ఎక్కువ. ఛాతీలో గడ్డ కనిపిస్తే వెంటనే పరీక్షించుకోవడం ఉత్తమం’ అని వివరించారు.

News October 17, 2024

సురేఖపై పరువు నష్టం కేసు.. రేపు కోర్టుకు KTR

image

TG: మంత్రి సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్ రేపు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. జడ్జి ముందు ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాగా నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో నాగార్జున, కేటీఆర్‌పై సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై ఇప్పటికే నాగార్జున డిఫమేషన్ కేసు వేసి, కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

News October 17, 2024

భారత్‌ను హేళన చేసిన మాజీ ప్లేయర్.. ఫ్యాన్స్ ఆగ్రహం

image

న్యూజిలాండ్‌పై భారత్ 46 రన్స్‌కే ఆలౌట్ కావడాన్ని సానుకూలంగా తీసుకోవాలని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని గుర్తుచేసేలా ‘కనీసం 36 రన్స్‌ను దాటారుగా’ అంటూ హేళన చేశారు. ఆ ట్వీట్‌పై భారత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌పై ఇంగ్లండ్ 2019 నుంచి గెలవలేదని, ఐర్లాండ్ చేతిలో ఆ జట్టు 52 రన్స్‌కే ఔటైందని కౌంటర్లు వేస్తున్నారు.

News October 17, 2024

బిష్ణోయ్‌కి సల్మాన్ మాజీ ప్రేయసి సందేశం

image

నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపాలని చూస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని జూమ్ కాల్ చేయమంటూ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ‘నమస్తే లారెన్స్ భాయ్. మీరు జైల్లో ఉన్నా కూడా జూమ్ కాల్స్ చేస్తుంటారని నాకు తెలిసింది. మీతో మాట్లాడే పని ఉంది. దానికి ఏర్పాట్లు చేయండి. నాతో మాట్లాడితే మీకే లాభం. మీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి’ అని సోమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

News October 17, 2024

ఒకే ఓవర్‌లో 4,6,6,6,2

image

శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో విండీస్ ప్లేయర్ మోతీ చెలరేగారు. వెల్లలగే వేసిన 15వ ఓవర్‌లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 24(4,6,6,6,2) రన్స్ బాదారు. మొత్తం 15 బంతులాడిన అతడు 32 రన్స్ చేశారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 162/8 రన్స్ చేసింది.

error: Content is protected !!