news

News March 1, 2025

టీచర్ల బదిలీలు.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

AP: ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా టీచర్ల ట్రాన్స్‌ఫర్ ప్రక్రియకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ టీచర్స్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 <>ముసాయిదాపై<<>> ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ముసాయిదాపై సలహాలు, సూచనలను draft.aptta2025@gmail.comకు ఈ నెల 7లోపు మెయిల్ పంపించాలని కోరారు.

News March 1, 2025

CT: దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు ఖరారు!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో ఇంగ్లండ్ 179 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో రూట్(37) ఫర్వలేదనిపించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. SA బౌలర్లలో జాన్సెన్, మల్డర్ తలో 3, కేశవ్ 2, ఎంగిడి, రబాడ చెరో ఒక వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా టార్గెట్ 180. మరోవైపు దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు దాదాపు ఖరారైంది.

News March 1, 2025

చెస్ ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

image

ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు టాప్-10లో నిలిచారు. మూడో స్థానంలో గుకేశ్(2787), ఐదో స్థానంలో అర్జున్ ఎరిగైసి (2777), ఎనిమిదో ర్యాంకులో ప్రజ్ఞానంద(2758) ఉన్నారు. గుకేశ్‌కు తన కెరీర్‌లో ఇదే హైయెస్ట్ ర్యాంకింగ్. కాగా తొలి రెండు స్థానాల్లో కార్ల్‌సన్(2833), నకమురా(2802) కొనసాగుతున్నారు.

News March 1, 2025

వారికి ఎక్స్‌గ్రేషియా.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్‌గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.

News March 1, 2025

OTT & టీవీల్లోకి బ్లాక్ బస్టర్ మూవీ!

image

ఇంటిల్లిపాదిని నవ్వించేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మీ ముందుకు వచ్చేసింది. ఈ చిత్రం జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం అవుతోంది. సినీ చరిత్రలో తొలిసారి ఈ మూవీ (జీ5)OTTతో పాటు TVల్లో ఒకేసారి రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చూస్తున్నారా? COMMENT

News March 1, 2025

భూమిపై ఎక్కువ మంది మాట్లాడే భాషలివే!

image

ప్రపంచంలోని దాదాపు 58 దేశాల్లో 150 కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 2023 లెక్కల ప్రకారం.. చైనీయులు మాట్లాడే మండరిన్ భాషను 110 కోట్ల మంది, ఇండియన్స్ ఎక్కువగా మాట్లాడే హిందీని 60.9 కోట్ల మంది వినియోగిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో స్పానిష్‌ (55 కోట్లు), ఫ్రెంచ్‌ (30.98 CR), అరాబిక్‌ (27.40 CR), బెంగాలీ (27.2 CR), పోర్చుగీసు (26.36 కోట్లు), రష్యన్ (25.50 కోట్లు) ఉన్నాయి.

News March 1, 2025

ఢిల్లీలో ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్

image

కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి పబ్లిక్ CNG బస్సుల్లో 90% బస్సులు తొలగిస్తామని, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.

News March 1, 2025

మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్

image

TG: మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ కులం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, BJP, BRSకు చెందిన కాపు నేతలు పాల్గొన్నారు. కులగణనలో కాపుల సంఖ్యను తగ్గించారని, ప్రభుత్వ/నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సభ, మంత్రి పదవి ఇస్తేనే కులగణనపై కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

News March 1, 2025

ఫిబ్రవరి GST కలెక్షన్స్ @ రూ.1.84లక్షల కోట్లు

image

ఫిబ్రవరిలో స్థూల GST వసూళ్లు 9.1% పెరిగి రూ.1.84లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థానిక రాబడి 10.2% ఎగిసి రూ.1.42లక్షల కోట్లు, దిగుమతులపై రాబడి 5.4% ఎగిసి రూ.41,702కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో CGST రూ.35,204 కోట్లు, SGST రూ.43,704 కోట్లు, IGST రూ.90,870 కోట్లు, సెస్ రూ.13,868 కోట్లు. ఇక రూ.20,889 కోట్లు రీఫండ్ చెల్లించగా నికర GST రూ.1.63లక్షల కోట్లుగా తేలింది. 2024 FEBలో ఇది రూ.1.50 లక్షల కోట్లే.

News March 1, 2025

నేనెవ్వరినీ బెదిరింపులకు గురిచేయట్లేదు: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ <<15611310>>తనపై ఎదురుదాడి<<>> చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తానెవ్వరినీ బెదిరింపులకు గురి చేయట్లేదని స్పష్టం చేశారు. రేవంత్ మాటల్లో పార్టీ నేతల్లోని అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయని చెప్పారు. మోదీ హయాంలో రూ.10 లక్షల కోట్ల విలువైన పనులు రాష్ట్రంలో చేపట్టినట్లు పేర్కొన్నారు.