India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా దీపావళి కానుకగా ఓటీటీ(Netflix)లోకి రానుంది. ఈ విషయాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా X స్పేస్లో వెల్లడించారు. ఓటీటీ రిలీజ్కు ఎలాంటి సమస్యలు లేవని, పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్తో రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరంలో చైనా కొత్త సైనిక స్థావరాన్ని నిర్మించినట్టు సీనియర్ మిలిటరీ సోర్సెస్ తెలిపాయి. శాటిలైట్ ఇమేజెస్ను విశ్లేషించి LAC సమీపంలోని డ్రాగన్ భూమిలో ఈ సైట్ గుర్తించామని పేర్కొన్నాయి. ఇందులో 70 శాశ్వత నిర్మాణాలు ఉన్నాయని, మిసైళ్ల దాడి తీవ్రతను తగ్గించడమే లక్ష్యమని వెల్లడించాయి. భారత సరిహద్దు వెంబడి మిగిలిన స్థావరాలకు లాజిస్టిక్స్, ఫుడ్ సప్లైకి వీటిని ఉపయోగించుకోవచ్చని తెలిపాయి.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెన్నై ప్రజలు అప్రమత్తమయ్యారు. వరద నుంచి రక్షించుకునేందుకు ద్విచక్రవాహనాలను ఇళ్లలో భద్రపరిచారు. అపార్ట్మెంట్లలోనూ పైకి తీసుకెళ్లి ఇంట్లో, వరండాలో పార్క్ చేశారు. దీంతోపాటు చెన్నై, వేలచేరి పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లపై స్థానికులు కార్లు పార్క్ చేసిన దృశ్యాలు వైరలవుతున్నాయి. విజయవాడలో వచ్చిన వరదల్లో కార్లు, బైక్లు పాడైన విషయం తెలిసిందే.
ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందినా దేశీయ బెంచ్మార్క్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మెటల్, ఆటో షేర్లు తగ్గడం, కీలక కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 81,751 (-221), నిఫ్టీ 25,070 (-57) వద్ద చలిస్తున్నాయి. BPCL, BEL, ICICI BANK, INFY, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, M&M, TATA స్టీల్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లాసర్స్.
TG: హైదరాబాద్లో దారుణం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. చెన్నై నుంచి లింగంపల్లి వచ్చిన ఆమె నానక్రామ్గూడ వెళ్లేందుకు ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు ఆటో ఎక్కింది. డ్రైవర్ మసీద్ బండ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, అక్కడే వదిలేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
AIతో లాభాలున్నా సరైన పర్యవేక్షణ లేకుంటే జరిగే నష్టం అపారం. వెస్ట్రన్ కల్చర్, లాంగ్వేజెస్ వరకు పర్లేదు గానీ భారతీయ భాషలు, కల్చర్పై అవగాహన లేకుంటే దెబ్బ తప్పదు. ‘ఐపిల్ గర్భనిరోధక మాత్ర నిన్ను మిస్సవుతోంది పల్లవీ’ అంటూ జెప్టో పంపిన నోటిఫికేషన్ దీనినే తెలియజేస్తోంది. ఇలాంటి కంటెంట్ ఇస్తున్నప్పుడు మానవ పర్యవేక్షణ కంపల్సరీ అంటున్నారు నిపుణులు. గుడ్డిగా AIని నమ్మొద్దంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?
AP: వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఫుడ్ను తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి. రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి భోంచేయాలి. వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి. రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలి’ అని ఆదేశించింది.
TG: డీఎస్సీ టీచర్ల పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉండగా, కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లు ఇటీవల నియామక పత్రాలు అందుకున్న సంగతి తెలిసిందే.
దేశరక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించిన మిసైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు స్మరించుకుంటున్నారు. పేపర్ బాయ్గా పనిచేసిన ఆయన ఏరో స్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారని కొనియాడుతున్నారు. DRDO, ISROలో చేరి క్షిపణిశాస్త్ర విజ్ఞాన రంగంలో చిరస్మరణీయ సేవలు అందించిన భారత రత్నకు జోహార్లు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
AP: తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ వైద్యమిత్ర కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరించింది. 17 ఏళ్లుగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. పదోన్నతులు, మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, రిటైర్మెంట్ పొందిన వారికి రూ.10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
Sorry, no posts matched your criteria.