news

News October 12, 2024

IPL కంటే టెస్టు క్రికెట్‌కే నా ప్రాధాన్యం: కమిన్స్

image

ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకొంటే లీగ్ నుంచి రెండేళ్ల పాటు నిషేధం విధించాలన్న నిబంధనను బీసీసీఐ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేనెప్పుడూ అలా తప్పుకోలేదు. కానీ నాకు తొలి ప్రాధాన్యం దేశానికి టెస్టులు, ఐసీసీ ట్రోఫీలు ఆడటమే. షెడ్యూల్‌ బట్టి IPL వంటి టోర్నీలు ఆడాలా వద్దా అని నిర్ణయించుకుంటుంటాను’ అని వెల్లడించారు.

News October 12, 2024

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

దసరా రోజున కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.77,670 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.250 ఎగసి రూ.71,200కి చేరుకుంది. గత రెండు రోజుల్లోనే 10 గ్రాములపై గోల్డ్ ధర రూ.1000కి పైగా పెరిగింది. కేజీ సిల్వర్ ధర రూ.1,000 పెరగడంతో రూ.1,03,000 పలుకుతోంది.

News October 12, 2024

అత్యాచార ఘటన.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై జరిగిన అత్యాచార <<14338493>>ఘటనపై <<>>సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. అటు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

News October 12, 2024

ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ITBPలో 545 కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10% ఖాళీలను ఎక్స్-సర్వీస్‌మెన్‌కు కేటాయించారు. టెన్త్ పాసైన 21 నుంచి 27 ఏళ్లు వారు దరఖాస్తుకు అర్హులు. హెవీ వాహనాలు నడిపే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారికి ₹21,700-69,100 పేస్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. ఫీజు ₹100. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News October 12, 2024

లుంగీలు, దుప్పట్ల సాయంతో జైలు నుంచి జంప్!

image

అస్సాంలోని మోరిగావ్ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. లుంగీలు, దుప్పట్లను తాడులా చేసి 20 అడుగుల జైలు గోడను దూకేశారు. ఖైదీలు సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్ పోక్సో కేసుల్లో నేరస్థులని, వారి కోసం జిల్లావ్యాప్తంగా జల్లెడ పడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఖైదీలకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 12, 2024

అమ్మవారికి తల సమర్పించేందుకు భక్తుడి యత్నం!

image

దుర్గమ్మకు ఓ భక్తుడు ఏకంగా తలనే సమర్పించాలనుకున్న ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని ‘మా బీజాసన్’ గుడికి శుక్రవారం వచ్చిన భక్తుడు తన తలను సమర్పించాలని యత్నించాడు. రేజర్‌తో మెడ కోసుకుంటుండగా ఇతర భక్తులు అడ్డుకున్నారు. అప్పటికే లోతుగా తెగిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సర్జరీ అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 9 రోజుల పాటు ఉపవాసం ఉండి తల ఇచ్చేందుకు ఆలయానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.

News October 12, 2024

WOW: కుర్రాడిలా మారిపోయిన ధోనీ!

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తుంటారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జులపాల జట్టుతో తన కెరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కనిపించారు. తాజాగా హెయిర్ కట్ చేయించి మరింత కుర్రాడిలా మారిపోయారు. సీఎస్కే టీమ్ ట్విటర్‌లో ఆ లుక్స్ పంచుకుని ‘ఎక్స్‌ట్రీమ్ కూల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 43 ఏళ్ల ధోనీ ఆ పిక్స్‌లో నవ యువకుడిలా కనిపిస్తుండటం విశేషం.

News October 12, 2024

ICICI క్రెడిట్ కార్డులో మార్పులు.. NOV 15 నుంచి అమలు

image

☞ యుటిలిటీ, ఇన్సూరెన్స్ చెల్లింపులపై ప్రీమియం కార్డు హోల్డర్లకు ₹80వేలు, సాధారణ కార్డు హోల్డర్లకు ₹40వేల వరకే రివార్డులు అందుతాయి
☞ గ్రాసరీ, డిపార్ట్‌మెంట్ స్టోర్లలో ₹40వేల వరకే రివార్డులు
☞ పెట్రోల్ బంకుల్లో ₹50వేల లావాదేవీ వరకే సర్‌ఛార్జ్ రద్దు
☞ యాడ్ ఆన్ కార్డుపై ఏటా ₹199 ఫీజు
☞ క్రెడిట్ కార్డుతో స్కూళ్లు, కాలేజీల్లో చేసే చెల్లింపులపై ఫీజు ఉండదు
☞ థర్డ్ పార్టీ యాప్స్‌తో చేసే చెల్లింపుపై 1% ఫీజు

News October 12, 2024

బాలయ్య-బోయపాటి కాంబోలో ‘BB4’

image

నందమూరి బాలక‌ృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ కాంబోలో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణంలో 4వ సినిమా మొదలుకానుంది. విజయ దశమి సందర్భంగా సంస్థ ఈ రోజు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 16న ‘BB4’ ముహూర్తం షాట్ చిత్రీకరించనున్నట్లు అందులో పేర్కొంది.

News October 12, 2024

డిగ్రీ పూర్తైన వారికి BIG ALERT

image

ఏపీలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ఓట్ల నమోదుకు ఈసీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఉమ్మడి తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తైన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఆధార్, డిగ్రీ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, ఫొటో సహా మరికొన్ని వివరాలను అప్‌లోడ్ చేయాలి. నవంబర్ 6 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఓటు నమోదు కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

error: Content is protected !!