India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాట్సాప్లో ‘సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్’ అనే ఫీచర్ రానుంది. దీనితో చాట్లో వచ్చిన ఇమేజెస్ను గూగుల్లో సెర్చ్ చేయవచ్చు. ఆ ఫొటో నిజమైనదా? ఎడిట్ చేసిందా? ఎక్కడి నుంచి తీసుకున్నారు? వంటి సమాచారం ఈజీగా తెలిసిపోతుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని, ఇది కేవలం ఆప్షనల్ ఫీచర్ అని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. ప్రస్తుతం ఇది డెవలప్మెంట్ దశలో ఉందని తెలిపింది.
హరియాణాలో BJP చావుదెబ్బ తింటుందని అనేక థియరీలు ప్రచారమయ్యాయి. 27% జనాభాతో ప్రబలశక్తిగా ఉన్న జాట్లు ఆ పార్టీపై కోపంతో ఉన్నారని యోగేంద్రయాదవ్ వంటి విశ్లేషకులు గట్టిగా చెప్పారు. తీరాచూస్తే ఓడిస్తారనుకున్న జాట్లే BJPకి ఓటేసి గెలిపించడం విశేషం. మొత్తం 90లో 36 నియోజకవర్గాల్లో వారిదే ఆధిపత్యం. అందులో కాంగ్రెస్ 18, BJP 16, ఇతరులు 2 గెలవడం గమనార్హం. 30 SC సెగ్మెంట్లలో కాంగ్రెస్ 16, BJP 13 గెలిచాయి.
విజయవాడలోని కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్య కొణిదెలతో ఆలయానికి చేరుకొని సరస్వతి దేవిగా దర్శనమిస్తోన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి ఇద్దరికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. హోమ్ మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ అటవీ ప్రాంతంలో కిడ్నాప్నకు గురైన జవాన్ మృతిచెందారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు నిన్న కిడ్నాప్ చేయగా, ఒక జవాన్ చాకచక్యంగా తప్పించుకున్నారు. మరో జవాన్ కోసం భద్రతా బలగాలు గాలించగా, తాజాగా మృతదేహం లభ్యమైంది.
AP: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.
TG: BRS MLA మల్లారెడ్డి CM రేవంత్రెడ్డిని కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలంటూ రేవంత్కు ఆహ్వానపత్రిక అందజేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబును సైతం మల్లారెడ్డి ఆహ్వానించారు.
జమ్మూకశ్మీర్లో తమ కూటమి సాధించిన గెలుపు రాజ్యాంగ విజయంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. విజయాన్ని అందించిన J&K ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. హరియాణాలో వచ్చిన ఊహించని ఫలితాలపై విశ్లేషిస్తున్నామని తెలిపారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని ట్వీట్ చేశారు.
ఈ దసరాకు తెలుగులో ఆరు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ఈనెల 10న విడుదలవనుంది. 11వ తేదీన సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ ‘విశ్వం’, ఆలియా భట్ ‘జిగ్రా’, ధ్రువ సర్జా ‘మార్టిన్’ రిలీజ్ కానున్నాయి. కాగా సుహాస్ ‘జనక అయితే గనక’ మూవీ ఈనెల 12న రానుంది. వీటిలో మీరు ఏ మూవీకి వెళ్లాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
AP: వైసీపీ తప్ప రాజకీయ పార్టీలన్నీ ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్నాయని TDP నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం కుల గణన చేసినా వివరాలు వెల్లడించలేదని విమర్శించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును కూటమి ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈ నెల 11న దుర్గామాత ఆలయాల్లో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో గవర్నర్, మంత్రులు, అఖిలపక్ష నేతలను కలుస్తామని అన్నారు.
JK ఓటర్ల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తమకు వ్యతిరేకంగా భావించే BJPకి ముస్లిములు గణనీయంగా ఓట్లేశారు. గురెజ్లో 97% ఓటర్లు ముస్లిములే. ఇక్కడ BJP అభ్యర్థి ఫకీర్ మహ్మద్ 1132 ఓట్లతో ఓడిపోయారు. ఆయనకు 40.3%, విజేత నజీర్ అహ్మద్ (NC)కు 46.64% ఓట్లు పడ్డాయి. 70% ముస్లిములు ఉండే కిష్టావర్లో BJP అభ్యర్థి షగున్ పరిహార్ 521 ఓట్లతో గెలిచారు. మొత్తం ఓట్లలో ఆమెకు 48%, ప్రత్యర్థి సాజద్ (NC)కు 47.14% వచ్చాయి.
Sorry, no posts matched your criteria.