news

News October 5, 2024

హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల

image

TG: హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా తాజాగా అందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. HYDలో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

News October 5, 2024

తెలుగు సినిమా షూటింగ్ నుంచి పారిపోయిన ఏనుగు

image

కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఓ తెలుగు సినిమా సెట్ నుంచి పుత్తుప్పలి సాధు అనే ఏనుగు పారిపోయింది. నిన్న రాత్రి షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెనుకవైపు నుంచి మరో ఏనుగు ఢీ కొట్టడంతో భయపడి సమీపంలోని అడవిలోకి సాధు పరిగెత్తిందని స్థానిక అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం ఏనుగును పట్టుకున్నామని, ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదని పేర్కొన్నారు.

News October 5, 2024

రుణమాఫీ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందా?: మోదీ

image

మహారాష్ట్రలో పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి ఇన్ని రోజులైనా ఎందుకు చేయడం లేదని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.

News October 5, 2024

ALERT: భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏపీ, తెలంగాణపై ఉండనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజుల పాటు ఏపీలోని రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని వెల్లడించింది. అటు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాగా ఇప్పటికే ఇవాళ AP, TGలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

News October 5, 2024

‘ఈక్వల్ పే = ఈక్వల్ ట్రోల్’.. మహిళా క్రికెటర్లపై విమర్శలు

image

T20WCలో భారత మహిళల జట్టు నిన్న NZ చేతిలో ఓడింది. దీంతో ఆ జట్టుపై SMలో ట్రోలింగ్ మొదలైంది. ట్రోల్స్‌ను సపోర్ట్ చేస్తూ ‘ఈక్వల్ పే = ఈక్వల్ ట్రోల్’ అని కొందరు పోస్టులు చేస్తున్నారు. మెన్స్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లు జీతాలు తీసుకుంటున్నప్పుడు ట్రోలింగ్‌ను కూడా అలాగే స్వీకరించాలంటున్నారు. ₹కోట్ల జీతాలు తీసుకుంటూ ప్రత్యర్థికి పోటీనివ్వకుండా ఓడటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

News October 5, 2024

దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే

image

FY2024-25లో GSDP, GDP అంచనాల ప్రకారం ₹42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర దేశంలోనే రిచెస్ట్ స్టేట్‌గా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు(₹31.55L cr), కర్ణాటక(₹28.09L cr), గుజరాత్(₹27.9L cr), UP(₹24.99L cr), బెంగాల్(₹18.8L cr), రాజస్థాన్(₹17.8L cr), TG(₹16.5L cr), AP(₹15.89L cr), MP(₹15.22L cr) ఉన్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా, బాలీవుడ్‌కు కేంద్రంగా ఉండటం, భారీ పరిశ్రమల కారణంగా MH టాప్‌లో ఉంది.

News October 5, 2024

బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ ఛైర్మన్లు

image

AP: రాష్ట్రంలో వివిధ సంస్థల ఛైర్మన్లు ఇవాళ అమరావతిలో తమ బాధ్యతలు చేపట్టారు. మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌-దామచర్ల సత్య, పర్యాటక శాఖ ఛైర్మన్-నూకసాని బాలాజీ, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజు బాధ్యతలు తీసుకున్నారు. వీరికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.

News October 5, 2024

నటి నాలుగో పెళ్లి వార్తలు.. అవన్నీ సినిమా స్టంట్స్

image

తమిళ నటి వనిత విజయకుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ను <<14242143>>వివాహం<<>> చేసుకుంటాననే అర్థంలో కొన్ని రోజుల కిందట ఫొటో షేర్ చేసింది. అయితే అదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని ఇవాళ ఆమె చేసిన పోస్టుతో తేలిపోయింది. స్వీయ దర్శకత్వంలో మిసెస్&మిస్టర్ చిత్రం పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

News October 5, 2024

బాత్రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకు?

image

US NCBI ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11% గుండెపోటు మరణాలు బాత్రూమ్‌లోనే జరుగుతున్నాయి. స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. మలబద్ధకం ఉన్న వారు ముక్కినప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. అప్పుడు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు.

News October 5, 2024

వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదు: CM రేవంత్

image

TG: రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు.

error: Content is protected !!