India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

Ai కాలంలో విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ట్రాన్స్లేషన్ కోసం టెక్నాలజీ రావడంతో భాషకు అడ్డంకులు తొలగిపోయాయి. పిల్లలను అదనపు భాషతో ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు మదర్ టంగ్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టు కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటే చాలు’ అని ట్వీట్ చేశారు. కాగా, NEPలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

AP: కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ అంతా అంకెల గారడీ, అభూత కల్పన అని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘ఇది పస లేని బడ్జెట్. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.11 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటే రూ.6300 కోట్లే కేటాయించారు. తల్లికి వందనం నిధుల్లో కోత పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి ఊసే లేదు’ అని మండిపడ్డారు.

అంతర్జాతీయ పరిణామాలతో స్టాక్మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెప్టెంబర్ నాటి గరిష్ఠ స్థాయుల నుంచి బెంచ్మార్క్ సూచీలు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో ₹50లక్షల కోట్ల సంపద ఆవిరైంది. నిఫ్టీ స్మాల్క్యాప్ 100 గరిష్ఠ స్థాయి నుంచి 25% పతనమవ్వడంతో ₹5.25లక్షల కోట్లు, నిఫ్టీ మిడ్క్యాప్ 100 పీక్ నుంచి 21% తగ్గడంతో ₹13.35లక్షల కోట్లు కరిగిపోయాయి. ఇక నిఫ్టీ50 14% క్రాష్ అవ్వడంతో ₹31.94లక్షల కోట్ల నష్టం వచ్చింది.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ నూతన పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో సాయం చేసిన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలను తొలగించింది. బంగ్లా నేత షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలనూ తీసివేసింది. కాగా పాక్ నుంచి బంగ్లాకు విముక్తి కల్పించేందుకు అప్పట్లో ఇందిరా విశేష కృషి చేశారు. ఇందుకు కృతజ్ఞతగా అక్కడి పుస్తకాల్లో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా ఇందిరా ఫొటోలను ముద్రించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అభిప్రాయపడ్డారు. ‘నేను కూలీ సినిమాలో భాగం కాదు. లోకేశ్ నా ఫ్రెండ్ కావడంతో సూపర్ స్టార్ను చూసేందుకు కూలీ సెట్స్కు వచ్చాను. నేను సినిమాలోని 45 నిమిషాలు చూశాను. ఇది కచ్చితంగా రూ.వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

TG: బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరుకు బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతోపాటు సంతోశ్ కుమార్, పరశురాములు, వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆయన వారిని వేడుకున్నారు.

స్టాక్మార్కెట్లు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. సంపద సృష్టిలో కాదు. హరించడంలో! ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు నేడు బెంచ్మార్క్ సూచీలు నష్టాల్లో ముగియడం ఖాయమే. అంటే నిఫ్టీ వరుసగా 5 నెలలు నష్టాల్లో క్లోజైనట్టు అవుతుంది. 28 ఏళ్ల క్రితం ఇలా జరిగింది. ప్రస్తుతం నిఫ్టీ 22,118 (-425), సెన్సెక్స్ 73,204 (-1400) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.7L కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సూచీలన్నీ విలవిల్లాడుతున్నాయి.

కెరీర్లో మరింత రాణించాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలి అనుకునే వారికి డా. సుధీర్ కుమార్ పలు సూచనలు చేశారు. ‘కెరీర్ గ్రోత్ కోసం రోజుకు 15 గంటలు పని చేయొచ్చా అని ఓ 25 ఏళ్ల ఉద్యోగి అడిగితే ఇలా చేస్తే మీరు రాణించలేరని చెప్పా. తెలివిగా, ఎక్కువ ఉత్పాదకతతో పనిచేయడం మంచిది. అతిగా పనిచేయడం వల్ల గుండెపోటు, పక్షవాతంతో పాటు అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంది. ఒత్తిడితో పాటు నిరాశకు గురవుతారు’ అని ఆయన ట్వీట్ చేశారు.

టాలీవుడ్ హీరో నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మళ్లీ సినిమా సెట్స్లో అడుగుపెట్టారు. గతంలో తాను ఒప్పుకున్న ఓ సినిమా షూటింగ్లో ఆమె జాయిన్ అయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ షూటింగ్లో ఆమె ఎంతో ఎనర్జిటిక్గా నటించినట్లు టాక్. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా వీరి పెళ్లి తర్వాత చైతూ నటించిన ‘తండేల్’ విడుదలై సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.

రాజకీయ దురుద్దేశంతోనే హరీశ్ రావు SLBC ప్రమాదంపై కుట్రపూరిత విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లికృష్ణారావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో SLBC టన్నెల్ని 100మీటర్లు తవ్వి ఎందుకు వదిలేశారని సూటి ప్రశ్నవేశారు. ఎకరాకు రూ.లక్ష ఖర్చయ్యే టన్నెల్ను పూర్తి చేయకుండా రూ.3లక్షలయ్యే కాళేశ్వరం పనులు ఎందుకు చేపట్టారన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే కాంగ్రెస్కు పేరు వస్తుందని BRS అక్కసు వెల్లగక్కుతోందన్నారు.
Sorry, no posts matched your criteria.